ఓ అనాది నక్షత్ర విస్ఫోటనం
అప్పుడెప్పుడో 25 లక్షల సంవత్సరాల క్రితం సంభవించిన భారీ నక్షత్ర విస్ఫోటనం ఆనవాళ్లను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూమికి 150 నుంచి 300 కాంతి సంవత్సరాల దూరంలో జరిగి
అప్పుడెప్పుడో 25 లక్షల సంవత్సరాల క్రితం సంభవించిన భారీ నక్షత్ర విస్ఫోటనం ఆనవాళ్లను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూమికి 150 నుంచి 300 కాంతి సంవత్సరాల దూరంలో జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అంత సుదూర విస్ఫోటనం కాబట్టే భారీ అంతర్ధానాలకు దారితీయకపోయి ఉండొచ్చు. కానీ కాస్మిక్ కిరణాల ప్రవాహంతో భూ జీవావరణాన్ని గణనీయంగా ప్రభావితం చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు.
1. కాంతి విస్ఫోటనం
నక్షత్ర విస్ఫోటనం మూలంగా నెల వరకు కాంతి వెలువడింది. ఇది పున్నమి చంద్రుడి మాదిరిగానే ప్రకాశించి ఉండొచ్చు. దీని కాంతికి నేల మీద వస్తువుల నీడలు పడి ఉండొచ్చని, పగటి పూట కూడా నక్షత్రంలా కనిపించి ఉండొచ్చని అనుకుంటున్నారు. అయితే దాని కాంతిలోని గామా, ఎక్స్ కిరణాలు హాని చేసేంత స్థాయిలో లేవు.
2. కాస్మిక్ కిరణాలు
అత్యధిక శక్తితో కూడిన ప్రొటాన్లు, ఇతర కేంద్రకాలతో కూడిన కాస్మిక్ కిరణాల ప్రచోదనాలు కాంతి వేగంతో సమానంగా దూసుకొచ్చి ఉండొచ్చు. వేలాది సంవత్సరాలు కొనసాగిన ఈ కాంతి పుంజాలు జీవావరణానికి మాయలేని మచ్చను కలగజేసి ఉండొచ్చు.
3. విస్ఫోటన అవశేషాలు
ప్రకాశవంతమైన గ్యాస్, దుమ్ముతో విస్తరించిన పొర భూమికి చేరుకునేలోగానే మాయమైపోయి ఉండొచ్చు. కానీ ఐరన్-60 వంటి రేడియోధార్మిక అణువులు ఇంకా తిరుగాడుతూనే ఉండి ఉండొచ్చు. వీటి అవశేషాలను సముద్ర అడుగు భాగాల్లో, అంటార్కిటిక్ మంచులో, చంద్రుడి మట్టిలో శాస్త్రవేత్తలు గుర్తించారు.
ప్రభావాలు అనేకం
నక్షత్ర విస్ఫోటనం అవశేషాలను బట్టి దాని ప్రభావాలను పరిశోధకులు అంచనా వేశారు.
ఎరువుల వాన: కాస్మిక్ కిరణాలు నైట్రోజన్ అణువులను విచ్ఛిన్నం చేయటం వల్ల నైట్రోజన్ ఆక్సైడ్ రసాయన మిశ్రమాలు పుట్టుకొచ్చి, వానతో కలిసి కురిశాయి. ఇవి చెట్లకు ఎరువులుగా ఉపయోగపడ్డాయి. అయితే కార్బన్ డయాక్సైడ్ మోతాదులు తగ్గి, వాతావరణం చల్లబడింది.
ఓజోన్ తగ్గటం: నైట్రోజన్ ఆక్సైడ్ మోతాదులు పెరగటం ఓజోన్ పొరను దెబ్బతీసింది. ఫలితంగా సూర్యుడి నుంచి వెలువడే అతి నీలలోహిత కాంతి భూమి మీద ఎక్కువగా పడింది. ఇది జన్యువుల మార్పులకు దారితీసింది.
మ్యుయాన్స్ దాడి: కాస్మిక్ కిరణాల్లోని మ్యుయాన్లు (ఎలక్ట్రాన్ల కోవకు చెందినవి) జంతువుల కణజాలంలోకి చొచ్చుకుపోయి, క్యాన్సర్లకు కారణమయ్యాయి.
పిడుగుల దెబ్బ: గాలి అణువులను రేడియోధార్మిక రేణువులు విచ్ఛిన్నం చేయటం ఆయాన్ మార్గాలకు వీలు కల్పించింది. ఇది పిడుగులు పడటానికి ఆస్కారం కలిగిస్తుంది. ఇలా విపరీతంగా పిడుగులు పడటం వల్ల కార్చిచ్చులు చెలరేగాయి. ఫలితంగా అడవులు కాలిపోయి, చివరికి గడ్డి మైదానాలుగా మారిపోయాయి.
నక్షత్రం ఎందుకు విస్ఫోటం చెందుతుంది?
భారీ నక్షత్రం గురుత్వాకర్షణ శక్తి నిరంతరం దాన్ని కుచించుకుపోయేలా లోపలికి లాక్కోవటానికి ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో నక్షత్ర కేంద్రంలో మండుతున్న అణు ఇంధనంతో పుట్టుకొచ్చే పీడనం బయటకు వచ్చేస్తుంటుంది. ఇది నక్షత్ర గురుత్వాకర్షణ ప్రభావాన్ని అడ్డుకుంటుంది. నక్షత్రంలో ఇంధనం నిండుకున్నప్పుడు పీడనం తగ్గిపోయి గురుత్వాకర్షణ శక్తి గెలుస్తుంది. దీంతో నక్షత్రం ఉన్నట్టుండి కుంచించుకుపోయి, వెలుపలి భాగం పేలిపోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
జీపీటీ దృష్టి!
టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఛాట్జీపీటీ పేరు మార్మోగుతోంది. ఆరంభమైనప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. రోజురోజుకీ కొత్త పోకడలు పోతోంది. ఆన్లైన్లో టెక్స్ట్ను సంగ్రహించి, మథించటంతోనే ఆగిపోలేదు. -
హాయ్ ఐయామ్ నమో ఏఐ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన వ్యక్తిగత నమో యాప్ గురించి తెలిసిందే. దీనికి తాజాగా కృత్రిమ మేధతో కూడిన నమో ఏఐ ఫీచర్ కూడా జతచేరింది. -
ఆండ్రాయిడ్ పరికరాల్లో సరికొత్త ఫొటో ఎడిటింగ్
డిజిటల్ ప్రపంచం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ పరికరాలూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. వీటికి త్వరలో కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. -
రోడ్డు గుంతలను పూడ్చే రోబో
గుంతలు లేని రోడ్లను ఒకసారి తలచుకోండి. ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో! ఊహించుకుంటేనే ఎంత సంతోషం కలుగుతుందో కదా. అదే నిజమైతే? అది సాకారం కావటం మరెంతో దూరంలో లేదు. -
అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా
ఆన్లైన్లో నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించటాన్ని అడ్డుకోవటానికి ఇన్స్టాగ్రామ్ కొత్తగా న్యూడిటీ ప్రొటెక్షన్ ఫీచర్ను ప్రవేశపెట్టనుంది. ఇన్స్టాగ్రామ్ డీఎంలలో ఉండే ఈ ఫీచర్ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది. -
పాటలు నేర్పే పదనిస
హిందీ పాటలు పాడటం నేర్చుకోవాలని భావిస్తున్నారా? కానీ సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? అయితే పదనిస యాప్ను ప్రయత్నించి చూడండి. ప్రముఖ సంగీత కంపెనీ సరిగమ ఇటీవలే దీన్ని తీసుకొచ్చింది. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
సామాజిక వ్యసనం శ్రుతి మించుతోందా?
సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయా? దీన్నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే పామ్సీ యాప్ సాయం తీసుకోవచ్చు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు. -
సైన్ఇన్ లేకుండానే ఛాట్జీపీటీ
ఛాట్జీపీటీని వాడుకోవాలంటే ముందు సైన్ఇన్ కావాల్సి ఉంటుంది. పాస్వర్డ్ను మరచిపోవటం వంటి సందర్భాల్లో ఇది కష్టంగా అనిపిస్తుంటుంది. -
నిర్ణీత సమయానికి ఎస్ఎంఎస్
ఆత్మీయుల పుట్టినరోజు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఎస్ఎంఎస్ పంపించాలని అనుకుంటాం. కానీ అప్పటివరకూ మెలకువగా ఉండకపోతే? నిద్రపోయినప్పుడు ఆ సమయానికి మెలకువ రాకపోతే? ఇలాంటి సమయాల్లోనే నిర్ణీత సమయానికి మెసేజ్లు అందే సదుపాయం ఉంటే బాగుండునని అనిపిస్తుంటుంది. -
ఎక్స్లో కమ్యూనిటీ నోట్స్
ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఎక్స్ (ట్విటర్) మనదేశంలో కమ్యూనిటీ నోట్స్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్కు కంట్రిబ్యూట్ చేయటానికి కొత్తవారికీ ఆహ్వానం పలికింది -
వైఫై పాస్వర్డ్ మరిచారా?
ఇంటికి వచ్చిన అతిథులో, పరిచయం ఉన్నవారో వైఫై పాస్వర్డ్ అడుగుతుంటారు. చాలాసార్లు అదేంటో గుర్తుకురాదు. మరెలా? చేతిలో ఫోన్ ఉంటే ఇట్టే తెలుసుకోవచ్చు. ఐఫోన్ వాడేవారైతే- సెటింగ్స్ ద్వారా వైఫై విభాగంలోకి వెళ్లాలి. -
సైబర్ నేరాలకు చక్షు కళ్లెం
మోసపూరిత కాల్స్, మెసేజ్ల వంటి సైబర్ నేరాలను అరికట్టటానికి టెలికం విభాగం కొత్త పోర్టల్ను పరిచయం చేసింది. సంచార్ సాథీ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన దీని పేరు చక్షు. -
పిక్సెల్ ఫోన్లలో లుకప్ ఫీచర్
గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడేవారికి శుభవార్త. తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించే లుకప్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీన్ని ఇంతకుముందు జపాన్లో పరిచయం చేశారు గానీ ఇతర ప్రాంతాల్లో విడుదల చేయలేదు. -
కంప్యూటర్కు బుర్ర!
మన మెదడు అద్భుతమైంది. హేతుబద్ధంగా వ్యవహరిస్తుంది. కార్య కారణాలను విశ్లేషించి ఒక నిర్ణయానికి వస్తుంది. ఉచితానుచితాలను బేరీజు వేస్తుంది. ఏ పని ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో పసిగడుతుంది. -
ఫోన్ ట్యాప్ అయ్యిందా?
నేటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రత అతి కీలకమయ్యాయి. అధునాతన నిఘా పద్ధతుల నేపథ్యంలో ఇవి మరింత ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి. నిత్య జీవితంలో విడదీయలేని పరికరంగా మారిన ఫోన్ల మీదా నిఘా వేయటం, ట్యాపింగ్ చేయటమూ చూస్తున్నాం. -
రోబో సేవలు చేసేనే..
మనిషికి మనిషి తోడంటారు. ఇప్పుడు మర మనిషీ (రోబో) చేయందిస్తోంది. ఒకపక్క అధునాతన హ్యూమనాయిడ్ రోబోల వెల్లువ సంచలనం సృష్టిస్తుండగా.. మరోపక్క మామూలు రోబోలూ సేవలకు సిద్ధమవుతున్నాయి. -
మొబైల్ రోబో
వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త టూల్స్తో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అలాంటి టూల్ ఒకటి ఇటీవలే విడుదలైంది. దీని పేరు ఎల్ఓఓఐ. ఇదో చిన్న డెస్క్టాప్ రోబో.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై