టెరా యుగం షురువైంది

స్మార్ట్‌ఫోన్ల స్టోరేజీలో కొత్త శకం మొదలైంది. త్వరలో 64జీబీకి కాలం చెల్లిపోయి, టెరాబైట్‌ (టీబీ) యుగం ఆరంభం కానుంది. ఇటీవలే యాపిల్‌ సంస్థ ఒక టీబీ వరకు స్టోరేజీతో కూడిన ఐఫోన్‌13 ప్రొ మోడళ్లను ప్రకటించింది....

Updated : 29 Sep 2021 05:50 IST

స్మార్ట్‌ఫోన్ల స్టోరేజీలో కొత్త శకం మొదలైంది. త్వరలో 64జీబీకి కాలం చెల్లిపోయి, టెరాబైట్‌ (టీబీ) యుగం ఆరంభం కానుంది. ఇటీవలే యాపిల్‌ సంస్థ ఒక టీబీ వరకు స్టోరేజీతో కూడిన ఐఫోన్‌13 ప్రొ మోడళ్లను ప్రకటించింది. దీంతో 64జీబీ అంతానికి నాంది పలికినట్టయ్యిందని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. నిజానికి టెరాబైట్‌ మార్పునకు సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌10 ప్లస్‌తోనే పునాది పడినప్పటికీ.. ట్రెండ్‌ను సెట్‌ చేసేది యాపిలే మరి. వీక్షిస్తున్న వీడియోల నాణ్యత, సృష్టిస్తున్న వీడియోల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే 128 జీబీ కన్నా తక్కువ స్టోరేజీ ఫోన్లకు ఇప్పుడు కాలం చెల్లిందనే అనుకోవచ్చు. ఒకవైపు పెరిగిపోతున్న యాప్‌ అప్‌డేట్లు, మరోవైపు గ్రాఫిక్స్‌తో కూడిన గేమ్స్‌ వంటివి ఇట్టే 1జీబీ వరకు స్పేస్‌ తీసేసుకుంటున్నాయి. మరి 64 జీబీ స్టోరేజీ ఎక్కడ సరిపోతుంది. ఒకప్పుడు 16జీబీ అంటేనే ఎక్కువ స్టోరేజీ కింద లెక్క. యాపిల్‌ 2016లో 32జీబీతో ఐఫోన్‌ 7 తీసుకొచ్చిన వెంటనే 16జీబీకి కాలం చెల్లినట్టయ్యింది. అనంతరం స్టోరేజీ 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ.. ఇలా పెరుగుతూనే వస్తోంది. ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఇది టీబీకీ ఎగబాకింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని