తోక పురాణం
తోక జాడించొద్దు అంటాం. తోక పట్టుకు తిరగొద్దంటాం. తోక తొక్కిన తాచులా లేచాడంటాం. మనిషికి తోక లేకపోయినా పూర్వ వాసనలు ఎక్కడికి పోతాయి? చుట్టూ ఉన్న జంతు ప్రపంచం అనుభవాలెక్కడికి పోతాయి? అందుకేనేమో రోజువారీ వ్యవహారాల్లో తోక ప్రస్తావన తరచూ వినిపిస్తూనే ఉంటుంది. దీని ప్రాముఖ్యతను గుర్తు చేస్తూనే ఉంటుంది....
తోక జాడించొద్దు అంటాం. తోక పట్టుకు తిరగొద్దంటాం. తోక తొక్కిన తాచులా లేచాడంటాం. మనిషికి తోక లేకపోయినా పూర్వ వాసనలు ఎక్కడికి పోతాయి? చుట్టూ ఉన్న జంతు ప్రపంచం అనుభవాలెక్కడికి పోతాయి? అందుకేనేమో రోజువారీ వ్యవహారాల్లో తోక ప్రస్తావన తరచూ వినిపిస్తూనే ఉంటుంది. దీని ప్రాముఖ్యతను గుర్తు చేస్తూనే ఉంటుంది. నిజానికి తోకల కథ 50 కోట్ల సంవత్సరాల క్రితమే మొదలైంది. అప్పట్నుంచీ ఎన్నెన్నో పరిణామాలతో ఇవి ఆశ్చర్యం గొలుపుతూనే ఉన్నాయి. ఒకో జంతువు, ఒకో పక్షి ఒకోలా వీటిని వాడుకోవటం చూస్తుంటే ‘ఔరా తోక’ అనాల్సిందే. మరి మనిషికి తోకెందుకు లేదు? పరిణామక్రమంలో మనిషి తోక ఎలా మాయమైంది? వీటిపై శాస్త్రరంగంలో రసవత్తర చర్చ నడుస్తూనే ఉంది. ఇటీవలే దీనిపై ఓ కొత్త సంగతి బయటపడింది. ఈ నేపథ్యంలో అసలు తోకల కథేంటో చూద్దాం.
జీవ పరిణామంలో తోక చరిత్ర పెద్దదే. మన పూర్వికుల, వారి పూర్వికుల, వారి పూర్వికుల దగ్గర మొదలెడితే.. చేపల రూపంలో ఉన్నప్పుడే ఈదడానికి తోకల సాయం తీసుకున్నాం. వానరాల దశకు చేరుకునే సరికి ఒక కొమ్మ మీది నుంచి మరో కొమ్మకు దూకటానికి శరీర నియంత్రణకు ఉపయోగించుకున్నాం. ఎందుకోగానీ సుమారు 2.5 కోట్ల ఏళ్ల కిందట మన తోకలు మాయమైపోయాయి. చార్లెస్ డార్విన్ మహాశయుడు మన పూర్వికుల శరీర నిర్మాణంలో ఈ మార్పును తొలిసారి గుర్తించారు. అయితే తోక ఎందుకు మాయమైంది?ఎలా మాయమైంది? అనేది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. దీనిపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా న్యూయార్క్ పరిశోధకులు గొప్ప విషయాన్నే గుర్తించారు. మన పూర్వికుల్లో తోకలు మాయం కావటానికి జన్యు మార్పేనని స్పష్టంగా తేల్చేశారు. గొరిల్లాలు, చింపాంజీల వంటి తోకలేని కోతుల (ఏప్స్) పరిణామ దశలోనే ఈ మార్పు మొదలైంది. తోక ఏర్పడటంలో పాలు పంచుకునే 31 రకాల జన్యువులను పరిశీలించి మరీ దీన్ని కనుగొన్నారు. ఇందులోని నిజానిజాలు తెలుసుకోవటానికి ఎలుకల్లో ఆ జన్యువును మార్చి పరిశీలించారు కూడా. దీంతో ఎలుకల్లో తోకలు ఏర్పడకపోవటం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే ఏప్స్ తోక ఒక్కసారిగా మాయమై ఉంటుందనే అనుకోవాలి. మనిషి పరిణామ క్రమంలో తోక కనుమరుగు కావటం గణనీయమైన ప్రభావాన్నే చూపించింది. మన పూర్వికుల్లో తోక కండరాలు మొదట్లో కటి భాగం వద్ద అడ్డంగా ఓ వల ఊయలగా మారిపోయాయి. రెండు కాళ్ల మీద నిల్చొని, నడవటం ఆరంభించాక నిట్టనిలువుగా మారిన అవయవాల బరువుకు దన్నుగా నిల్చినవి ఈ కండరాలే. దీని అవశేషం మన వెన్నెముక అడుగున కాక్సిక్స్ ఎముక రూపంలో ఇప్పటికీ మిగిలే ఉంది.
అసలు తోకెందుకు?
శరీర నిర్మాణంలో తోకల పాత్ర అనూహ్యమనే చెప్పుకోవాలి. పక్షులు గాల్లో ఎగురుతున్నప్పుడు పక్కలకు తిరగటానికి, వేగ నియంత్రణకు తోడ్పడేవి తోకలే. కొన్నిరకాల బల్లులు వీటిని కొవ్వును నిల్వ చేసుకోవటానికి ఉపయోగించుకుంటాయి. ర్యాటిల్ స్నేక్ తోకను గబగబా ఊపుతూ శత్రువులను బెదరగొడుతుంది. అయితే చాలా క్షీరదాల్లో తోక చేసే ముఖ్యమైన పని శరీర నియంత్రణ. నడుస్తున్నప్పుడు, పరుగెత్తుతున్నప్పుడు శరీరం స్థిరంగా ఉండటానికిది ఎంతగానో తోడ్పడుతుంది. మరి మనిషికి తోకెందుకు లేదు? ఉంటే ఎందుకు మాయమైంది? ఒక్క మాటలో చెప్పాలంటే వాడాల్సిన అవసరం లేకపోవటం వల్లనే. వానర దశలో రెండు కాళ్ల మీద నిల్చొని, నడవటం ఆరంభించాక గురుత్వాకర్షణ ప్రభావాన్ని అనువుగా మలచుకోవటానికి వీలు ఏర్పడింది. ఒకో అడుగు వేస్తున్న ప్రతిసారీ గురుత్వాకర్షణ శక్తి సాయంతో తేలికగా ముందుకు కదలటం సాధ్యమైంది. నాలుగు కాళ్లతో పోలిస్తే రెండు కాళ్ల మీదైతే 25% తక్కువ శక్తితోనే ఎక్కువ దూరం నడవటానికి అవకాశం ఏర్పడింది. శక్తి వినియోగం 28 గ్రాములు తగ్గినా పెద్ద ప్రభావమే చూపిస్తుంది. అడవుల్లో సంచరిస్తున్నప్పుడు ఇది ఆకలిని తట్టుకోవటం, మనుగడ సాగించటంలో కీలకమైన పాత్ర పోషించింది. మన తల 5 కిలోల బరువు ఉన్నప్పటికీ.. నడుస్తున్నప్పుడు శరీరం పైబాగాన ఉంటుంది. నాలుగు కాళ్ల జంతువుల మాదిరిగా ముందుకు ఉండదు. దీంతో శరీర నియంత్రణకు తోక అవసరం తగ్గిపోయింది. ఇలా క్రమంగా కనుమరుగు అవుతూ వచ్చింది. అయితే పిండస్థ దశలో 31 నుంచి 35 రోజుల మధ్యలో మనందరికీ తోక ఉంటుంది. కాకపోతే ఇది కుంచించుకుపోయి వెన్నెముకలో కలిసిపోతుంది. చివరికి తోక ఎముకలా (కాక్సిక్స్) మారిపోతుంది.
ఒకోటి ఒకోలా..
మనిషికి తప్ప వెన్నెముక గల జీవులన్నింటికీ తోక ఉంటుంది. వీటిల్లో చాలా రకాలున్నాయి. కొన్ని పొడవుగా ఉంటే కొన్ని పొట్టిగా ఉంటాయి. కొన్ని కుచ్చుతో ఉంటే మరికొన్ని నున్నగా ఉంటాయి. వేటి ప్రత్యేకత వాటిదే. జంతువులు, పక్షులు, చేపలు వీటిని ఒకోటి ఒకోలా వినియోగించుకుంటాయి.
సమాచారం కోసం: కుక్కలు భావోద్వేగాలను తోకను కదల్చటం ద్వారానే తెలియజేస్తాయి. ఇవి ఆయా భావాలకు అనుగుణంగా తోకలను పక్కలకు, పైకీ కిందికీ కదిలిస్తాయని ఇటీవలి అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. పిల్లులైతే తోకతో మరిన్ని భావాలను తెలియజేస్తుంటాయి. భయం, చిరాకు, ఆనందం వంటి భావాలను తోకను ఎత్తటం, దించటం, పక్కలకు తిప్పటం వంటి పనులతోనే వెలిబుచ్చుతుంటాయి.
శరీర నియంత్రణ: చాలా జంతువులు శరీర నియంత్రణ కోసమే తోకలను వినియోగించుకుంటాయి. సన్నటి గోడ మీద పిల్లి నడుస్తున్నప్పుడు చూస్తే తోకను కదిలించటం ద్వారా స్థిరత్వాన్ని సాధించటం గమనించొచ్చు. ఉడతలైతే ఒక కొమ్మ మీది నుంచి మరో కొమ్మ మీదికి దూకుతున్నప్పుడు గాలిలోనూ తోకతోనే శరీరాన్ని నియంత్రించుకుంటాయి.
కదలికలకు: కొన్ని జంతువులు కదలటానికి తోకే చాలా కీలకం. చేపల వంటి వాటికిది మరింత ముఖ్యం. దీని సాయంతోనే ఇవి ముందుకు కదులుతాయి. సముద్ర జీవుల తోకలు పైకీ కిందికీ కదలటం వల్లనే అవసరమైనప్పుడు నీటి పైకి వచ్చి గాలిని పీల్చుకుంటాయి.
రక్షణకు: చాలా క్షీరదాలు తోకను రక్షణ కోసం వాడుకుంటాయి. ర్యాటిల్ స్నేక్ చాలా ప్రాణాంతకమైనదైనప్పటికీ.. శత్రువులను బెదర గొట్టటానికి తోకను ఊపుతూ పెద్ద శబ్దం చేస్తుంటాయి. బల్లులు తమను తాము రక్షించుకోవటానికి తోకలను పూర్తిగా శరీరం నుంచి వదిలించేసుకుంటాయి కూడా. ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు అలుగు (ఆర్మడిల్లో) తన తలను, తోకను ఒకదగ్గరికి చేర్చి బంతిలా మారిపోతుంది.
దాడి చేయటానికి: కొన్ని జంతువులకు తోకే ఆయుధం. దీంతోనే దాడి చేస్తాయి. తేలు తోక తెలిసిందే కదా. దీనికి ఉండే కొండితోనే కుట్టేస్తాయి. ఇవి తోకతో ఆహారాన్నీ వేటాడతాయి. పదునైన కొండితో కీటకాల వంటి వాటిని పట్టుకొని తింటాయి.
ఎగరడానికి: పక్షులకు రెండు రకాల ఈకలుంటాయి. రెక్కల్లోని ఈకలు దన్నుగా నిలిస్తే.. తోకలోని ఈకలు చుక్కానిలా ఉపయోగపడతాయి. గాల్లో ఎగురుతున్నప్పుడు ఇవి స్థిరతాన్ని కలిగిస్తాయి. తేలికగా అటూ ఇటూ మళ్లటానికి తోడ్పడతాయి.
ఆకర్షణకు: మగ నెమళ్లు పురి విప్పటం ద్వారానే ఆడ నెమళ్లను ఆకర్షిస్తుంటాయి. మన వేలి ముద్రల మాదిరిగానే నెమళ్ల తోకలు వేటికదే ప్రత్యేకం. చాలా పెద్దగా, ప్రకాశవంతమైన పురిని విప్పే నెమళ్లు మరింత ఎక్కువగా ఆకర్షిస్తాయి.
క్రిములను పారదోలటానికి: ఆవులు, గుర్రాలు, జీబ్రాల వంటివి పొడవైన తోకలుండే జంతువులు సౌలభ్యం కోసమే వీటిని వినియోగించుకుంటాయి. ఈగలు, క్రిములు, కీటకాల వంటి వాటిని పారదోలటానికి వాడుకుంటాయి.
గిరి గీయటానికి: నీటి గుర్రం తోకను చోదకం మాదిరిగానూ తిప్పగలదు. దీంతో విసర్జన సమయంలో మలాన్ని చుట్టుపక్కల ప్రాంతానికి వెదజల్లుతుంది. ఇలా తనుండే చోటును గిరి గీసుకుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
జీపీటీ దృష్టి!
టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఛాట్జీపీటీ పేరు మార్మోగుతోంది. ఆరంభమైనప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. రోజురోజుకీ కొత్త పోకడలు పోతోంది. ఆన్లైన్లో టెక్స్ట్ను సంగ్రహించి, మథించటంతోనే ఆగిపోలేదు. -
హాయ్ ఐయామ్ నమో ఏఐ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన వ్యక్తిగత నమో యాప్ గురించి తెలిసిందే. దీనికి తాజాగా కృత్రిమ మేధతో కూడిన నమో ఏఐ ఫీచర్ కూడా జతచేరింది. -
ఆండ్రాయిడ్ పరికరాల్లో సరికొత్త ఫొటో ఎడిటింగ్
డిజిటల్ ప్రపంచం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ పరికరాలూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. వీటికి త్వరలో కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. -
రోడ్డు గుంతలను పూడ్చే రోబో
గుంతలు లేని రోడ్లను ఒకసారి తలచుకోండి. ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో! ఊహించుకుంటేనే ఎంత సంతోషం కలుగుతుందో కదా. అదే నిజమైతే? అది సాకారం కావటం మరెంతో దూరంలో లేదు. -
అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా
ఆన్లైన్లో నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించటాన్ని అడ్డుకోవటానికి ఇన్స్టాగ్రామ్ కొత్తగా న్యూడిటీ ప్రొటెక్షన్ ఫీచర్ను ప్రవేశపెట్టనుంది. ఇన్స్టాగ్రామ్ డీఎంలలో ఉండే ఈ ఫీచర్ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది. -
పాటలు నేర్పే పదనిస
హిందీ పాటలు పాడటం నేర్చుకోవాలని భావిస్తున్నారా? కానీ సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? అయితే పదనిస యాప్ను ప్రయత్నించి చూడండి. ప్రముఖ సంగీత కంపెనీ సరిగమ ఇటీవలే దీన్ని తీసుకొచ్చింది. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
సామాజిక వ్యసనం శ్రుతి మించుతోందా?
సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయా? దీన్నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే పామ్సీ యాప్ సాయం తీసుకోవచ్చు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు. -
సైన్ఇన్ లేకుండానే ఛాట్జీపీటీ
ఛాట్జీపీటీని వాడుకోవాలంటే ముందు సైన్ఇన్ కావాల్సి ఉంటుంది. పాస్వర్డ్ను మరచిపోవటం వంటి సందర్భాల్లో ఇది కష్టంగా అనిపిస్తుంటుంది. -
నిర్ణీత సమయానికి ఎస్ఎంఎస్
ఆత్మీయుల పుట్టినరోజు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఎస్ఎంఎస్ పంపించాలని అనుకుంటాం. కానీ అప్పటివరకూ మెలకువగా ఉండకపోతే? నిద్రపోయినప్పుడు ఆ సమయానికి మెలకువ రాకపోతే? ఇలాంటి సమయాల్లోనే నిర్ణీత సమయానికి మెసేజ్లు అందే సదుపాయం ఉంటే బాగుండునని అనిపిస్తుంటుంది. -
ఎక్స్లో కమ్యూనిటీ నోట్స్
ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఎక్స్ (ట్విటర్) మనదేశంలో కమ్యూనిటీ నోట్స్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్కు కంట్రిబ్యూట్ చేయటానికి కొత్తవారికీ ఆహ్వానం పలికింది -
వైఫై పాస్వర్డ్ మరిచారా?
ఇంటికి వచ్చిన అతిథులో, పరిచయం ఉన్నవారో వైఫై పాస్వర్డ్ అడుగుతుంటారు. చాలాసార్లు అదేంటో గుర్తుకురాదు. మరెలా? చేతిలో ఫోన్ ఉంటే ఇట్టే తెలుసుకోవచ్చు. ఐఫోన్ వాడేవారైతే- సెటింగ్స్ ద్వారా వైఫై విభాగంలోకి వెళ్లాలి. -
సైబర్ నేరాలకు చక్షు కళ్లెం
మోసపూరిత కాల్స్, మెసేజ్ల వంటి సైబర్ నేరాలను అరికట్టటానికి టెలికం విభాగం కొత్త పోర్టల్ను పరిచయం చేసింది. సంచార్ సాథీ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన దీని పేరు చక్షు. -
పిక్సెల్ ఫోన్లలో లుకప్ ఫీచర్
గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడేవారికి శుభవార్త. తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించే లుకప్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీన్ని ఇంతకుముందు జపాన్లో పరిచయం చేశారు గానీ ఇతర ప్రాంతాల్లో విడుదల చేయలేదు. -
కంప్యూటర్కు బుర్ర!
మన మెదడు అద్భుతమైంది. హేతుబద్ధంగా వ్యవహరిస్తుంది. కార్య కారణాలను విశ్లేషించి ఒక నిర్ణయానికి వస్తుంది. ఉచితానుచితాలను బేరీజు వేస్తుంది. ఏ పని ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో పసిగడుతుంది. -
ఫోన్ ట్యాప్ అయ్యిందా?
నేటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రత అతి కీలకమయ్యాయి. అధునాతన నిఘా పద్ధతుల నేపథ్యంలో ఇవి మరింత ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి. నిత్య జీవితంలో విడదీయలేని పరికరంగా మారిన ఫోన్ల మీదా నిఘా వేయటం, ట్యాపింగ్ చేయటమూ చూస్తున్నాం. -
రోబో సేవలు చేసేనే..
మనిషికి మనిషి తోడంటారు. ఇప్పుడు మర మనిషీ (రోబో) చేయందిస్తోంది. ఒకపక్క అధునాతన హ్యూమనాయిడ్ రోబోల వెల్లువ సంచలనం సృష్టిస్తుండగా.. మరోపక్క మామూలు రోబోలూ సేవలకు సిద్ధమవుతున్నాయి. -
మొబైల్ రోబో
వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త టూల్స్తో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అలాంటి టూల్ ఒకటి ఇటీవలే విడుదలైంది. దీని పేరు ఎల్ఓఓఐ. ఇదో చిన్న డెస్క్టాప్ రోబో.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా