ఆలోచనలే ఆదేశాలు!
అదొక కోతి. పేరు పేజర్. కంప్యూటర్ తెర మీద పాంగ్ ఆట ఆడేస్తోంది. మౌజ్లాంటివేవీ కదిలించకుండానే!అతడి పేరు ఫిలిప్ ఓకీఫే. అమీట్రోఫిక్ లాటెరల్ స్క్లెరోసిస్ (ఏఎల్ఎస్) మూలంగా కండరాలు చచ్చుబడ్డాయి. అయినా కూడా కంప్యూటర్ మీద నిమిషానికి 18 పదాలు రాయగలడు!
అదొక కోతి. పేరు పేజర్. కంప్యూటర్ తెర మీద పాంగ్ ఆట ఆడేస్తోంది. మౌజ్లాంటివేవీ కదిలించకుండానే!
అతడి పేరు ఫిలిప్ ఓకీఫే. అమీట్రోఫిక్ లాటెరల్ స్క్లెరోసిస్ (ఏఎల్ఎస్) మూలంగా కండరాలు చచ్చుబడ్డాయి. అయినా కూడా కంప్యూటర్ మీద నిమిషానికి 18 పదాలు రాయగలడు!
- ఇవేమీ కల్పనలు కావు. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ప్రయోజనాలకు మచ్చు తునకలు. మెదడును కంప్యూటర్తో అనుసంధానం ఈ పరిజ్ఞానం ఇటీవల కొత్తపుంతలు తొక్కుతోంది.
బ్రెయిన్ మిషిన్ ఇంటర్ఫేసెస్ (బీఎంఐ). బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేసెస్ (బీసీఐ). పేరేదైనా వీటి ఉద్దేశం ఒక్కటే. మెదడును కంప్యూటర్ వంటి బయటి పరికరాలతో అనుసంధానం చేయటం. దీంతో ఆలోచనల ద్వారానే కృత్రిమ చేయి వంటివాటిని కదిలించొచ్చు. మొబైల్ ఫోన్ను నియంత్రించొచ్చు. ఇంట్లో లైట్లు వేయొచ్చు. తలుపులు తెరవచ్చు. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నెన్నో పనులు చేయొచ్చు. అందుకే దీనిపై చాలాకాలంగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. మెదడు కణాల ద్వారా అందే సమాచారాన్ని అనువాదం చేసే ఎలక్ట్రోడ్లను తలకు అమర్చటంపై 70ల్లోనే అధ్యయనాలు మొదలయ్యాయి. మొదట్లో కోతులపై ప్రయోగాలు నిర్వహించారు. 20ల తొలినాళ్లలో మనుషులపై ప్రయోగాలు మొదలెట్టారు. పక్షవాతం, పార్కిన్సన్స్, వినికిడిలోపం వంటి జబ్బులను జయించటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు సాగించారు. కానీ అన్నీ ప్రయోగాలకే పరిమితమయ్యాయి. పైగా ఎలక్ట్రోడ్లను అమర్చటానికి తలకు రంధ్రాలు చేయాల్సి వస్తుంది. వినూత్న పరిజ్ఞానాల ఆవిష్కరణతో ఇప్పుడు బయటి నుంచే మెదడు తరంగాలను చదవటం సాధ్యమవుతోంది. న్యూరేబుల్ సంస్థ రూపొందించిన బీసీఐ ఎనేబుల్డ్ హెడ్ఫోన్స్ దీనికో చక్కని ఉదాహరణ. సాఫ్ట్ఈఈజీ సెన్సర్లతో కూడిన ఇది బయటినుంచే మెదడు పనితీరును పసిగడుతుంది. కెర్నెల్ సంస్థ తయారుచేసిన బ్రెయిన్ మెజర్మెంట్ వ్యవస్థ కూడా ఇలాంటిదే. ఇలాంటి పరిజ్ఞానాలన్నీ కొత్త ఆలోచనలకు దారి చూపుతున్నాయి.
ఏంటీ పరిజ్ఞానం?
మన మెదడు పనిచేసే తీరును బట్టి బీసీఐ పరిజ్ఞానం పనిచేస్తుంది. మన మెదడులో బోలెడన్ని నాడీకణాలుంటాయి. ఇవి తోకల్లాంటి డెండ్రయిటిస్, యాక్సాన్ల ద్వారా ఒకదాంతో మరోటి అనుసంధానమవుతాయి. ఆలోచించటం, కదలటం, ఊహించుకోవటం, జ్ఞాపకం పెట్టుకోవటం.. ఇలా మనం ఏ పని చేసినా నాడీకణాలు విద్యుత్ సంకేతాల ద్వారా ఒకదాంతో మరోటి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటుంటాయి. నిజానికి వీటి ప్రసారాలను బయటకు రాకుండా నాడుల మీదుండే పొర అడ్డుకుంటుంది. అయితే కొన్ని దీనిలోంచి బయటకు వస్తుంటాయి. వీటిని గుర్తించి, పట్టుకోవటమే బీసీఐ పరిజ్ఞానంలో కీలకాంశం. తలలో, లేదా తల మీద అమర్చిన ఎలక్ట్రోడ్ల ద్వారా వీటిని సంగ్రహించి, ఆయా పరికరాలకు మెదడు సంకేతాలను బదలాయించి పనిచేసేలా చూడటం దీని ఉద్దేశం.
భావాలతో పదాలు
బీసీఐ పరిజ్ఞానం విషయంలో ఇటీవల మరో గొప్ప ముందడుగు పడింది. ఆస్ట్రేలియాకు చెందిన ఫిలిప్ ఓకీఫే ఆలోచనలను టెక్స్ట్ రూపంలోకి మార్చటంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. అతడికి ముందుగా మెదడులో శరీర కదలికలను ప్రేరేపించే భాగంలో స్టెంట్రోడ్ అనే పరికరాన్ని అమర్చారు. దీన్ని ఆయా అక్షరాలకు సంబంధించిన మెదడు పనితీరును గుర్తించే ప్రోగ్రామ్తో కూడిన కంప్యూటర్కు అనుసంధానం చేశారు. దీంతో చేత్తో రాస్తున్నట్టు ఊహించుకుంటున్న సమయంలో తెర మీద ఆయా పదాలు ప్రత్యక్షం కావటం గమనార్హం. ఇవి 95% కచ్చితత్వంతో ఉండటం విశేషం. పైగా నిమిషానికి 95 అక్షరాల వేగంతోనూ రాయగలిగాడు కూడా. ఇది వృద్ధులు స్మార్ట్ఫోన్ మీద టైప్ చేసే వేగంతో దాదాపు సమానం!
అటు నుంచి ఇటు
ఇప్పటివరకూ పరిశోధనలన్నీ మెదడు నుంచి పుట్టుకొచ్చే ఆలోచనలతో పరికరాలను పనిచేయించటం మీదే దృష్టి సారించాయి. మరి ఆయా పరికరాల నుంచి అందే సమాచారాన్నీ మెదడు స్వీకరించేలా చేస్తే? ఇలాంటి పరిజ్ఞానంతోనే పేజర్ కోతి పాంగ్ ఆట ఆడటం సాధ్యమైంది. ఈ ప్రాజెక్టును చేపట్టింది మరెవరో కాదు. ఎలాన్ మస్క్, ఆయన స్థాపించిన న్యూరాలింక్ సంస్థే. భవిష్యత్తు అంతా మెదడు స్టిమ్యులేషన్, ఆగ్మెంటేషన్లదే అన్నది న్యూరాలింక్ ప్రగాఢ నమ్మకం. కృత్రిమ మేధ మానవ మేధస్సును అధిగమించిన తర్వాత మనిషి మనుగడ కొనసాగటానికి ఇదొక్కటే అవకాశమన్నదీ మస్క్ వాదన. అందుకే మూడ్ వంటివాటిని నియంత్రించాలని న్యూరాలింక్ లక్ష్యంగా పెట్టుకొంది. ఆకలి, దాహం వంటి భావనలనే కాదు.. మాట, భాష, లెక్కల నైపుణ్యాలనూ నియంత్రించటం మీద దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రత్యేక చిప్ను రూపొందిస్తోంది. దీన్ని మనిషి మెదడులో అమర్చితే బ్లూటూత్ ద్వారా మొబైల్తో అనుసంధానం కావొచ్చు. అంటే మనిషి ఒక సైబోర్గుగా అవతరిస్తాడన్నమాట. తీవ్రమైన వెన్నెముక గాయాలతో బాధపడేవారికి ఈ సంవత్సరంలో న్యూరాలింక్ చిప్ను అమర్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే పేజర్ కోతికి చిప్ను అమర్చి పరీక్షించారు. ముందుగా కోతికి జాయ్స్టిక్తో వీడియోగేమ్ ఆడటం నేర్పించారు. బాగా ఆడితే పండు గుజ్జును బహుమతిగా ఇవ్వటం అలవాటు చేశారు. ఈ క్రమంలో ఆయా కదలికలకు తోడ్పడుతున్న నాడుల సమాచారాన్ని న్యూరాలింక్ రికార్డు చేస్తుంది. తర్వాత జాయ్స్టిక్ను కోతికి ఇవ్వకుండా పక్కనపెట్టారు. అయితేనేం? న్యూరాలింక్ సాయంతో కోతి తన ఆలోచనల ద్వారానే పాంగ్ ఆట ఆడేయటం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. -
బొగ్గు దాణా!
బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు -
ఏఐ స్టెతస్కోప్
డాక్టర్ దగ్గరికి వెళ్లగానే ముందుగా పరీక్షించేది స్టెతస్కోప్తోనే. గుండె చప్పుడును వినటం దగ్గరి నుంచి ఊపిరితిత్తి జబ్బుల ఆనవాళ్లను పసిగట్టటం వరకూ ఇది ఎన్నో విధాలుగా తోడ్పడుతోంది. అధిక రక్తపోటును కచ్చితంగా నిర్ధరించటానికీ డాక్టర్లు మణికట్టు వద్ద స్టెతస్కోప్ను ఆనించి పై, కింది సంఖ్యలను నమోదు చేస్తుంటారు. -
క్యాన్సర్ తీరును పసిగట్టే ఏఐ
ఆరోగ్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) కొత్త పుంతలు తొక్కుతోంది. క్యాన్సర్ తీరుతెన్నులను విశ్లేషించటంలోనూ సాయం చేస్తోంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్వెస్ట్రన్ మెడికల్ సెంటర్ పరిశోధకులు రూపొందించిన ‘సియోగ్రాఫ్’ ఏఐ మోడలే దీనికి నిదర్శనం. -
అంతరిక్ష వీడియో ప్రసారాలు!
ఒక దెబ్బకు రెండు పిట్టలు! సైకీ గ్రహశకలం మీదికి ఇటీవల నాసా ప్రయోగించిన వ్యోమనౌక గురించి ఇలాగే చెప్పుకోవాలి. లోహంతో కూడిన ఈ గ్రహశకలం భూ అంతర్భాగ రహస్యాలను తెలుసుకోవటానికి తోడ్పడటం ఒక ప్రయోజనమైతే.. -
కృత్రిమ మేధ ఆసుపత్రి!
నేటి కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ప్రతీ అంతర్జాల పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఫొటోలు, వీడియోలు సృష్టించు కోవటం వంటివన్నీ చిటికెలో పనులుగా మారిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్