తెగిన కాలు పునః సృష్టి!
బల్లి తోక తెగిపోతే కొత్తది మొలుస్తుంది కదా. అలా మనుషులకూ తెగిన కాళ్లు, చేతులు తిరిగి మొలిస్తే? ఊహించుకోవటానికిది బాగానే ఉంటుంది. కాల్పనిక సైన్స్ సినిమాల్లో ఇలాంటివి చూస్తూనే ఉంటాం. నిజమైతే ఎంత బాగుంటుందోననీ
బల్లి తోక తెగిపోతే కొత్తది మొలుస్తుంది కదా. అలా మనుషులకూ తెగిన కాళ్లు, చేతులు తిరిగి మొలిస్తే? ఊహించుకోవటానికిది బాగానే ఉంటుంది. కాల్పనిక సైన్స్ సినిమాల్లో ఇలాంటివి చూస్తూనే ఉంటాం. నిజమైతే ఎంత బాగుంటుందోననీ అనుకుంటుంటాం. మున్ముందు ఇలాంటి విచిత్రం సాకారమైనా ఆశ్చర్యం లేదు. టఫ్ట్స్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన వీస్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల తాజా ప్రయోగ చికిత్సే దీనికి నిదర్శనం. మందుల మిశ్రమంతో ఒక కప్పకు తెగిపోయిన కాలును తిరిగి సృష్టించటంలో విజయం సాధించారు మరి.
కాళ్లు, చేతుల వంటి అవయవాలను తిరిగి సృష్టించటానికి మూలకణాలు, జన్యుచికిత్సలతో పరిశోధకులు ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇవి చాలా సంక్లిష్టమైన పద్ధతులు. వీటికి భిన్నంగా టఫ్ట్స్, హార్వర్డ్ యూనివర్సిటీల పరిశోధకులు ఓ తేలికైన మార్గంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ముందుగా కప్పకు కాలు తెగిపోయిన చోట చుట్టూరా కణజాలం గట్టిపడి, మచ్చగా మారకుండా సిలికాన్ మూత (బయోడోమ్) బిగించారు. ఇలా గాయం చుట్టూ రక్షణ వాతావరణం ఏర్పాటు చేశారు. బయోడోమ్లో ముందుగానే ఐదురకాల మందుల మిశ్రమాన్ని కూర్చారు. దీన్ని 24 గంటల తర్వాత తొలగించారు. మందుల ప్రభావం మూలంగా తొలిరోజుల్లో పిండంలో మాదిరిగానే కణ మార్గాలు ప్రేరేపితమయ్యాయి. అంటే పునరుజ్జీవ ప్రక్రియ మొదలైందన్నమాట. అప్పట్నుంచి క్రమంగా ఎముక నిర్మాణం, అంతర్గత కణజాలం, నాడులు, వేళ్ల వంటివన్నీ పుట్టుకొచ్చాయి. ఇందుకు దాదాపు 18 నెలలు పట్టింది. కేవలం 24 గంటల చికిత్సతోనే నెలల కొద్దీ పునరుజ్జీవ ప్రక్రియ కొనసాగటం గమనార్హం. కాకపోతే వేళ్లలో ఎముకలు మాత్రం ఏర్పడలేదు. అయితేనేం.. కొత్తగా పుట్టుకొచ్చిన కాలుకు స్పర్శజ్ఞానం తెలవటం.. కొత్త కాలు సాయంతో కప్ప ఈదుతుండటం విశేషం. కప్పలు, ఇతరత్రా జంతువులు అంతర్గతంగా పునరుజ్జీవ సామర్థ్యాలు కలిగుంటున్నట్టు ఇది సూచిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. వీటిని ప్రేరేపించటం సాధ్యమేనని తాజా ప్రయోగంతో రుజువైనట్టయ్యింది. గతంలో బయోడోమ్లో ప్రొజెస్టిరాన్ మందును కూర్చి కప్ప కాళ్లను తిరిగి సృష్టించాలని ప్రయత్నించారు. దీంతో కణజాలం బాగానే పుట్టుకొచ్చినా, పనికిరాని ముళ్ల వంటి భాగాలూ ఏర్పడ్డాయి. అందుకే ఈసారి వాపుప్రక్రియను అణచిపెట్టటానికి.. రక్తనాళాలు, కండరాలు, నాడుల వృద్ధిని ప్రోత్సహించటానికి, కణజాలం గట్టిపడి మచ్చ ఏర్పడకుండా ఉండటానికి ఐదురకాల మందులను ఉపయోగించారు. ఈ ప్రక్రియను మున్ముందు క్షీరదాల్లో, తర్వాత మానవుల మీద పరీక్షించి చూడాలని భావిస్తున్నారు. నిజానికి మనలోనూ కొంత పునరుజ్జీవ శక్తి ఉంటుంది. గాయం మానటానికి పుట్టుకొచ్చే కణజాలమే దీనికి ఉదాహరణ. కాలేయం సగం వరకు దెబ్బతినా తిరిగి పూర్తిగా కోలుకుంటుంది కూడా. అందువల్ల మందుల మిశ్రమంతో కూడిన ఇలాంటి చికిత్సతో ఏదో ఒకనాడు మనుషుల్లోనూ కోల్పోయిన కాళ్లు, చేతులను తిరిగి సృష్టించే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. -
బొగ్గు దాణా!
బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు -
ఏఐ స్టెతస్కోప్
డాక్టర్ దగ్గరికి వెళ్లగానే ముందుగా పరీక్షించేది స్టెతస్కోప్తోనే. గుండె చప్పుడును వినటం దగ్గరి నుంచి ఊపిరితిత్తి జబ్బుల ఆనవాళ్లను పసిగట్టటం వరకూ ఇది ఎన్నో విధాలుగా తోడ్పడుతోంది. అధిక రక్తపోటును కచ్చితంగా నిర్ధరించటానికీ డాక్టర్లు మణికట్టు వద్ద స్టెతస్కోప్ను ఆనించి పై, కింది సంఖ్యలను నమోదు చేస్తుంటారు. -
క్యాన్సర్ తీరును పసిగట్టే ఏఐ
ఆరోగ్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) కొత్త పుంతలు తొక్కుతోంది. క్యాన్సర్ తీరుతెన్నులను విశ్లేషించటంలోనూ సాయం చేస్తోంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్వెస్ట్రన్ మెడికల్ సెంటర్ పరిశోధకులు రూపొందించిన ‘సియోగ్రాఫ్’ ఏఐ మోడలే దీనికి నిదర్శనం. -
అంతరిక్ష వీడియో ప్రసారాలు!
ఒక దెబ్బకు రెండు పిట్టలు! సైకీ గ్రహశకలం మీదికి ఇటీవల నాసా ప్రయోగించిన వ్యోమనౌక గురించి ఇలాగే చెప్పుకోవాలి. లోహంతో కూడిన ఈ గ్రహశకలం భూ అంతర్భాగ రహస్యాలను తెలుసుకోవటానికి తోడ్పడటం ఒక ప్రయోజనమైతే.. -
కృత్రిమ మేధ ఆసుపత్రి!
నేటి కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ప్రతీ అంతర్జాల పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఫొటోలు, వీడియోలు సృష్టించు కోవటం వంటివన్నీ చిటికెలో పనులుగా మారిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?