ఎరుపు సాగు
పంట దిగుబడి పెరగటానికి రకరకాల ఎరువులు వాడటం కొత్తేమీ కాదు. కానీ ఉచితంగా లభించే కాంతి సాయంతోనూ దిగుబడి పెంచుకోగలిగితే? తేలికైన పరిజ్ఞానంతో దీన్ని సుసాధ్యం చేయొచ్చని ఆస్ట్రేలియా పరిశోధకులు నిరూపిస్తున్నారు.
పంట దిగుబడి పెరగటానికి రకరకాల ఎరువులు వాడటం కొత్తేమీ కాదు. కానీ ఉచితంగా లభించే కాంతి సాయంతోనూ దిగుబడి పెంచుకోగలిగితే? తేలికైన పరిజ్ఞానంతో దీన్ని సుసాధ్యం చేయొచ్చని ఆస్ట్రేలియా పరిశోధకులు నిరూపిస్తున్నారు. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు తీర్చటానికిది తోడ్పడగలదని భావిస్తున్నారు. పంటల రుచి, పోషకాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది తెలుసుకోవటానికి ఇంకా పరిశోధనలు చేయాల్సిన అవసరమున్నప్పటికీ ప్రస్తుతానికైతే దిగుబడి విషయంలో మంచి ఫలితమే కనిపిస్తుండటం విశేషం.
మొక్కల ఎదుగుదలలో ఎండలోని ఎర్ర కాంతిదైర్ఘ్యాలు గణనీయమైన పాత్ర పోషిస్తాయి. ఇవి పత్ర హరితాన్ని తయారుచేసుకునేలా ఆకులను ప్రేరేపిస్తాయి మరి. కిరణజన్య సంయోగక్రియకు పత్ర హరితమే కీలకం మరి. అందుకే కొన్ని వ్యవసాయ క్షేత్రాల్లో ఎర్ర ఎల్ఈడీ లైట్లతో పంట దిగుబడి పెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. డెన్మార్క్లోని నోర్డిక్ హార్వెస్ట్ క్షేత్రంలో నిలువుగా 14 అంతస్థుల్లో పంటలను సాగు చేయటమే కాదు. దీని లోపల లేత గులాబీ రంగు కాంతిని వెలువరించే లైట్లనూ అమర్చారు. మొక్కలకు కార్బన్ డయాక్సైడ్ అందేలా ఏర్పాట్లు చేశారు. హానికర క్రిములు దరిజేరకుండా చేయటం వల్ల ఎలాంటి పురుగు మందుల అవసరమూ ఉండదు. మామూలు వ్యవసాయ క్షేత్రాలతో పోలిస్తే దీనికి 250 రెట్లు, హరిత పందిరి సాగుతో పోలిస్తే 80 రెట్ల తక్కువ నీరు అవసరమవుతుంది. అయితే ఇలాంటి ప్రత్యామ్నాయ సాగుకు చాలా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఎల్ఈడీ లైట్లను అమర్చుకోవటం ఖర్చుతో కూడుకున్న పని. పైగా ఇవి వెలగటానికి నిరంతరం విద్యుత్తు ఉండాలి. లైట్లు వెలిగినా సూర్యరశ్మి మాదిరిగా మొక్కలపై అంతటా ఒకేలా కాంతి పడదు. ఇలాంటి ఇబ్బందులను పరిష్కరించటానికే ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్ పరిశోధకులు ఎల్లీఫ్ అనే పారదర్శక ప్లాస్టిక్ పదార్థాన్ని సృష్టించారు.
ఏమిటిది? ఎలా పనిచేస్తుంది?
ఫ్లోరోసెంట్ రంగుతో కూడిన ఎల్లీఫ్ ఎండలోని పచ్చ కాంతిదైర్ఘ్యాలను (ఇవి మొక్కల ఎదగటానికి అంత ముఖ్యం కాదు) పాక్షికంగా గ్రహించి వాటిని ఎర్ర కాంతిదైర్ఘ్యాలుగా మారుస్తుంది. దీన్ని పందిరి వ్యవసాయ క్షేత్రంలో పైన అమర్చాల్సి ఉంటుంది. దీనిలోంచి కిందికి వచ్చే కాంతి లోపల పడిన తర్వాత లేత గులాబీ రంగులోకి మారుతుంది. దీని మూలంగా పంటల దిగుబడి 37% పెరిగినట్టు పరిశోధకులు గుర్తించారు. అందుకే ఇప్పుడు వివిధ రకాల పంటలపై దీన్ని విస్తృతంగా పరీక్షించటం ఆరంభించారు. దీనికి ఖర్చు తక్కువ కావటం, ఇప్పటికే ఉన్న పందిరి వ్యవసాయ క్షేత్రాల్లో తేలికగా అమర్చుకునే వీలుండటం వల్ల మున్ముందు బాగా ఆదరణ పొందగలదని భావిస్తున్నారు.
ఇబ్బందులేవీ ఉండవా?
ఎల్లీఫ్తో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. ఆకుపచ్చని కాంతిని తొలగించి మొక్కలకు మరింత ఎక్కువ ఎర్ర కాంతిని అందిస్తే కొన్ని పంటలకు హాని కలగొచ్చు. దీని కింద సాగు చేసిన లెట్యూస్ ఆకులకు ఒకింత నారింజ వన్నె వచ్చినట్టు గుర్తించారు. పంటపై పడే కాంతి మారటం వల్ల వీటిల్లోని కెరొటినాయిడ్లు, ఇతర వర్ణద్రవ్యాల్లో మార్పులు తలెత్తటం దీనికి కారణమయ్యిండొచ్చని భావిస్తున్నారు. పోషకాలు, రుచిలోనూ ఏవైనా మార్పులు జరిగాయేమో చూడటానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. తృణధాన్యాల పంటలపై ఇవి ఎలాంటి ప్రభావం చూపుతాయన్నదీ ఇంకా తేలలేదు. ఏదేమైనా పంట దిగుబడి పెరగటం మాత్రం కొత్త ఆశలు రేపుతోంది.
విస్తృత పరీక్షలు
వివిధ పంటలకు అనుగుణంగా రకరకాల రంగులను రూపొందించటంపైనా పరిశోధకులు కృషి చేస్తున్నారు. ప్రపంచంలో ఆయా చోట్ల మాత్రమే పండే పంటలనూ దీంతో స్థానికంగా సాగు చేసుకునే వీలుంటుందని భావిస్తున్నారు. ఉదాహరణకు- ఇండోనేషియాలో పండే డచ్ స్ట్రాబెర్రీ దిగుబడిని ఎల్లీఫ్తో పెంచటం సాధ్యమేనని ఇటీవల నిరూపించారు. పగటి వేళ తక్కువగా ఉండే వాతావరణాన్ని అనుకరిస్తూ ఎండలోని ఎర్ర కాంతిదైర్ఘ్యాలను మరింత ఎర్రగా మార్చటం ద్వారా దీన్ని సాధించారు. అంటే నెదర్లాండ్స్లోనూ ఇండోనేషియాలో మాదిరి వాతావరణం ఉన్నట్టుగానే మొక్కలు భావించేలా బురిడీ కొట్టించారన్నమాట. ఇది విస్తృతంగా ఉపయోగపడుతున్నట్టు తేలితే ఏ పంటనైనా ఎక్కడైనా పండించుకునే వీలుంటుంది. దీంతో రవాణా ఖర్చులూ గణనీయంగా తగ్గుముఖం పడతాయి.
సముద్ర నీటి వరి!
అది సముద్ర తీర ప్రాంతం. నీరంతా ఉప్పుమయం. మట్టిలో క్షార గుణం కారణంగా పంటలు పండటం దాదాపు అసాధ్యం. మున్ముందు ఇలాంటి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఉప్పు నీటితోనూ సాగు చేయగల వరిని చైనా శాస్త్రవేత్తలు రూపొందించారు. ‘సముద్ర నీటి వరి’గా పిలుచుకుంటున్న ఇది ఆహార భద్రత కల్పించటానికి దోహదం చేయగలదని భావిస్తున్నారు.
రోజురోజుకీ భూతాపం, సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. అందుకే సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పు నీటితో సాగు చేయగల పంటల ఆవశ్యకత కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చైనా శాస్త్రవేత్తలు అడవిలో పెరిగే వరి ధాన్యంపై దృష్టి సారించారు. ఉప్పు, క్షార గుణాలనూ తట్టుకునే ఇందులో ఒక జన్యువు అతిగా వ్యక్తమవుతుంటుంది. దీంతోనే కొత్త సముద్ర నీటి వరిని సృష్టించారు. దీన్ని అక్కడి పంట పొలాల్లో పరీక్షించగా ఒక ఎకరానికి 4.6 మెట్రిక్ టన్నుల దిగుబడి రావటం విశేషం. ప్రామాణిక వరి వంగడాల సగటు జాతీయోత్పత్తితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ!
ఉప్పును తట్టుకొని మనగలిగే వరి మీద చైనా 1950ల్లోనే అధ్యయనాలు ఆరంభించింది. కానీ చైనా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త యువాన్ లాంగ్పింగ్ 2012లో దీని కోసం అన్వేషణ మొదలెట్టిన తర్వాతే సముద్ర నీటి వరి అనే పదం విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అక్కడ 2016లో ఆరు ప్రాంతాల్లో ఉప్పు నీటిని తట్టుకునే వరి రకాల సాగుపై పరీక్షలు ఆరంభించారు. ఓ ప్రత్యేక పరిశోధన కేంద్రాన్నీ నెలకొల్పారు. 67 లక్షల హెక్టార్ల బంజరు భూమిలో 3కోట్ల టన్నుల వరిని పండించాలనేదీ దీని లక్ష్యం. ఇలాంటి వరితో 8కోట్లకు పైగా మందికి ఆహార భద్రత కల్పించాలని భావిస్తున్నారు. వాతావరణ మార్పుతో దీన్ని ఇంకాస్త త్వరగా సాధించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మన భూ వాతావరణ ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకు పెరిగితే ఈ శతాబ్దం చివరికి సముద్ర మట్టాలు 59 సెంటీమీటర్లు పెరగొచ్చని అంచనా. ఇది సముద్ర తీర ప్రాంతాలకు పెను ముప్పుగా వాటిల్లుతుంది. సాధారణంగా ఉప్పుతో కూడిన మట్టిలో వరి పండించాలంటే సంప్రదాయ పద్ధతిలో మంచి నీటిని పారించి ఉప్పు మోతాదు తగ్గిస్తుంటారు. దీనికి పెద్దమొత్తంలో మంచి నీరు అవసరం. అంత కష్టపడ్డా దిగుబడి అంతంతే. కొత్త సముద్ర నీటి వరి వంగడంతో ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా సాగు చేసుకోవటానికి వీలుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Web Browser: డిఫాల్ట్ బ్రౌజర్ను మార్చుకోవడం ఎలాగో తెలుసా..?
ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని చాలా మంది డిఫాల్ట్ ఇంటర్నెట్ బ్రౌజర్కు బదులుగా ఇతర యాప్లు డౌన్లోన్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ వాట్సాప్లో వచ్చే లింక్ క్లిక్ చేస్తే మాత్రం.. -
Gmail: జీమెయిల్ యాక్సెస్ కోల్పోతే.. ఏం చేయాలి?
జీమెయిల్ యాక్సెస్ (ఐడీ, పాస్వర్డ్) కోల్పోతే ఎలా అని ఆలోచిస్తున్నారా..! ఖాతాను తిరిగి పునరుద్ధరించడానికి.. -
MIUI 13: షావోమి కొత్త ఓఎస్... పది కొత్త ఫీచర్లు ఇవే!
ఆండ్రాయిడ్ మొబైల్స్కు సంబంధించి కొత్త ఓఎస్ MIUI 13లో వచ్చే ఫీచర్లు, మార్పులపై ఓ లుక్కేద్దాం.. రండి! -
Samsung Galaxy: ఫిబ్రవరిలో శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్
శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్కి (Samsung Galaxy Unpacked Event) సన్నద్ధమవుతోంది. -
పొడవైన దారం బ్యాటరీ
ఆ దారాన్ని స్మార్ట్వాచీల వంటివాటికి చుట్టుకోవచ్చు. ఛార్జింగ్ చేసుకోవచ్చు. అది మామూలు దారం కాదు. పొడవైన బ్యాటరీ మరి. ఇలాంటి వినూత్నమైన లిథియం అయాన్ బ్యాటరీనే పరిశోధకులు రూపొందించారు. రీఛార్జ్ కాగల ... -
స్మార్ట్ బెంచీ
విరామ సమయంలో ఆఫీసు గదిలోంచి ఆరు బయటకు వచ్చాం. అత్యవసరంగా మెయిల్ పంపించుకోవాల్సి ఉంది. లేదూ ఆటవిడుపు కోసం యూట్యూబ్ చూడాలని అనుకున్నాం. -
Year Ender 2021:₹5 వేలలోపు ధర.. ఈ ఏడాదిటాప్ స్మార్ట్వాచ్లు ఇవే!
ఈ ఏడాది ₹5 వేల లోపు ధరల్లో విడుదలైన టాప్ 5 స్మార్ట్వాచ్ల జాబితా మీ కోసం.. -
యూఎస్బీ కేబుల్ తీస్తేల్యాప్టాప్ కిల్!
యూఎస్బీ కేబుల్ తీసేస్తే ల్యాప్టాప్ కిల్. అవును మీరు చదివింది నిజమే. ఇది మామూలు కేబుల్ కాదు మరి. ల్యాప్టాప్లోని సమాచారం దొంగల చేతికి చిక్కకుండా రూపొందించిన ప్రత్యేకమైన యూఎస్బీ కేబుల్. దీన్ని ల్యాప్టాప్కు తగిలించి ఉంచామనుకోండి. ఎవరైనా దాన్ని దొంగిలించి, -
వెనక తాకితే ఐఫోన్ టార్చ్లైట్
తెలిసినవి గోరంత. తెలియనివి కొండంత. ఐఫోన్ చిట్కాల గురించి ఇలాగే చెప్పుకోవాలి. ఎంత తెలుసుకున్నా తెలియని చిట్కాలు ఇంకెన్నో. వీటిల్లో ఒకటి టార్చ్లైట్ ఫీచర్. మామూలుగా ఫ్లాష్లైట్ను ఆన్ చేయాలంటే లాక్ స్క్రీన్ మూలకు ఎడమ వైపున కనిపించే గుర్తును నొక్కుతారు. కంట్రోల్ సెంటర్ ద్వారానూ ఆన్, ఆఫ్ చేస్తారు. -
Power Banks: ₹1000లోపే మంచి బ్యాకప్తో ది బెస్ట్ పవర్ బ్యాంక్స్!
మీ స్మార్ట్ఫోన్లో ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? మంచి పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా? ₹1,000 లోపు లభిస్తున్న బెస్ట్ పవర్ బ్యాంక్స్ ఇవే. అవేంటో చూసేయండి. -
OnePlus Buds: సింగిల్ ఛార్జ్తో 38 గంటల బ్యాకప్.. వన్ప్లస్ కొత్త ఇయర్బడ్స్ ధర, ఫీచర్లివే!
వన్ప్లస్ కంపెనీ టీడబ్ల్యూఎస్ శ్రేణితో కొత్త ఇయర్బడ్స్ను అంతర్జాతీయ మార్కెట్లోవి విడుదల చేసింది. మరి వీటి ధర, ఫీచర్ల వివరాలివే. -
Ray-Ban Stories: రేబాన్ స్టోరీస్ కొత్త ఫీచర్.. స్మార్ట్గ్లాసెస్తో ఫేస్బుక్ మెసేంజర్ మెసేజ్లు!
ఫేస్బుక్, రేబాన్ సంయుక్తంగా రూపొందించిన రేబాన్ స్టోరీస్ స్మార్ట్గ్లాసెస్లో మరో ముఖ్యమైన ఫీచర్ను యూజర్స్కు పరిచయం చేస్తున్నట్లు మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ పోస్టు ద్వారా వెల్లడించారు. -
Laptops: అదిరే ఫీచర్లతో ఇన్ఫినిక్స్ ల్యాప్టాప్లు.. ధరెంతంటే?
ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X1 సిరీస్ పేరుతో చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్.. భారత విపణిలోకి ల్యాప్టాప్లను విడుదల చేసింది. ధర.. వాటి ఫీచర్లేంటో తెలుసుకోండి! -
HP Laptops: గేమర్స్ కోసం హెచ్పీ కొత్త ల్యాప్టాప్.. ధర, ఫీచర్లివే!
గేమర్స్ కోసం హెచ్పీ కంపెనీ ఒమెన్ సిరీస్లో కొత్త ల్యాప్టాప్ను విడుదల చేసింది. హెచ్పీ ఒమెన్ 16 పేరుతో ఈ ల్యాప్టాప్ను తీసుకొచ్చారు. -
Nothing Ear 1: నథింగ్ కొత్త ఇయర్బడ్స్.. ధర, ఫీచర్లివే!
నథింగ్ కంపెనీ కొత్త ఇయర్బడ్స్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిని క్రిప్టో కరెన్సీ సాయంతో కూడా కొనుగోలు చేయొచ్చని తెలిపింది. అయితే భారత్లో క్రిప్టో కరెన్సీతో కొనుగోలు చేసే సదుపాయం లేదని వెల్లడించింది. -
విండోస్10లో ఆడియో రికార్డింగు ఇలా..
కంప్యూటర్లో ఆడియో రికార్డు చేయాలని అనుకుంటున్నారా? అయితే విండోస్ 10లో వాయిస్ రికార్డరును వాడి చూడండి. దీంతో ఆడియోను రికార్డు చేయటం చాలా తేలిక. మైక్రోఫోన్, శబ్దాన్ని గ్రహించే సాఫ్ట్వేర్ ఉంటే చాలు. -
Poco Laptop: పోకో ల్యాప్టాప్స్ వచ్చేస్తున్నాయ్.. ఫీచర్లివేనా!
పొకో కంపెనీ త్వరలోనే భారత మార్కెట్లో కొత్త ల్యాప్టాప్ను తీసుకురానుంది. అలానే పొకో బ్రాండ్ కింద స్మార్ట్వాచ్, ట్రూవైర్లెస్ ఇయరబడ్స్ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. -
రోబోల సందడి
రోబోలు నెమ్మదిగా మనుషుల ఉద్యోగాలను లాగేసుకుంటున్నాయా? అమెరికాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో రోబోల సందడిని చూస్తుంటే ఇలాంటి సందేహం కలగటం ఖాయం. ఒకటి కాదు, రెండు కాదు.. -
Tablets: అందుబాటు ధరలో అదిరే ఫీచర్స్తో ట్యాబ్స్.. ఇదిగో జాబితా!
మొబైల్, పీసీలకు పోటీగా ట్యాబ్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో వీటి వినియోగం పెరగడంతో గ్యాడ్జెట్ కంపెనీలు వీటి తయారీపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో డిస్ప్లే, బ్యాటరీ, కనెక్టివిటీ పరంగా ఉత్తమమైన ట్యాబ్ మోడల్స్ ఏంటో చూద్దాం. -
జార్విస్.. జుకర్ ప్రత్యేక అసిస్టెంట్
మెటా (ఫేస్బుక్) సృష్టికర్త మార్క్ జుకర్బర్గ్ అనగానే ముందుగా టెక్నాలజీయే గుర్తుకొస్తుంది. ఇంట్లో రకరకాల పరికరాలు పని చేయటానికీ ఆయన దీన్నే ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఎకో, సిరి వంటి పరికరాలు అందుబాటులోకి వచ్చాక అంతా కాలు మీద కాలేసుకొని