అంగారకుడి మీద ఏడాది!
మొత్తం 47.1 కోట్ల కిలోమీటర్ల దూరం. ఏడు నెలల సుదీర్ఘ ప్రయాణం. క్షేమంగా దిగుతుందో లేదోననే సంశయం. అన్నింటినీ అధిగమించి పర్సివియెరెన్స్ రోవర్ అంగారకుడి మీద దిగింది. చూస్తుండగానే ఏడాది పూర్తి చేసుకుంది.
మొత్తం 47.1 కోట్ల కిలోమీటర్ల దూరం. ఏడు నెలల సుదీర్ఘ ప్రయాణం. క్షేమంగా దిగుతుందో లేదోననే సంశయం. అన్నింటినీ అధిగమించి పర్సివియెరెన్స్ రోవర్ అంగారకుడి మీద దిగింది. చూస్తుండగానే ఏడాది పూర్తి చేసుకుంది. తనతో ఇంజెన్యూటీ హెలికాప్టర్నూ తీసుకెళ్లిన ఇది 50 గిగావాట్లకు పైగా డేటాను సేకరించింది. ఎన్నెన్నో కొత్త విషయాలను తెలియజేసింది. వీటిల్లో కొన్ని విశేషాలు ఇవీ..
లక్షకు పైగా ఫొటోలు
అంగారకుడి మీద కాలు పెట్టినప్పట్నుంచీ పర్సివియెరెన్స్ కెమెరాలు నిరంతరంగా ఫొటోలు తీస్తూనే ఉన్నాయి. దీనికి అమర్చిన 23 కెమెరాలు ఈ పనిలోనే నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకు లక్షకు పైగానే ఫొటోలు తీశాయి! నీటి ప్రవాహం మూలంగా అంగారకుడి ఉపరితలం ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవటానికివి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అక్కడ అతి పురాతన సూక్ష్మజీవుల ఆనవాళ్లను గుర్తించటానికీ ఈ ఫొటోలు దోహదం చేయనున్నాయని ఆశిస్తున్నారు. పర్సివియెరెన్స్ తీసిన ఫొటోలను నాసా అందరికీ అందుబాటులో ఉంచింది. ఎప్పటికప్పుడు వీటిని ఓపెన్ గ్యాలరీలో పోస్ట్ చేస్తూనే ఉంది. వీటిల్లో అన్నింటికన్నా ముఖ్యంగా ఇంజెన్యూటీతో కలిసి ఇటీవల తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.
3డీ పటం రూపకల్పన
అంగారకుడి మీద ఇంజెన్యూటీ హెలికాప్టర్ ఇప్పటివరకు 19 సార్లు విజయవంతంగా చక్కర్లు కొట్టింది. తాజాగా ఫిబ్రవరి 8న ఎగిరి, ఇంకా తాను పటిష్ఠంగానే ఉన్నానని చాటుకుంది. ఇతర గ్రహం మీద ఎగిరిన మొట్టమొదటి విమాన వాహనం ఇదే. దీనికి రెండు కెమెరాలున్నాయి. వీటి సాయంతోనే ఇంజెన్యూటీ హైరెజల్యూషన్ ఫొటోలు తీస్తోంది. అంతేకాదు, అంగారకుడి 3డీ పటాన్నీ రూపొందిస్తోంది.
నమూనాల సేకరణ
ఇప్పటివరకు పర్సివియెరెన్స్ అంగారకుడి రాయి, వాతావరణం నుంచి 6 నమూనాలను సేకరించింది. గత సంవత్సరం సెప్టెంబరులో అంగారకుడి ఉపరితలాన్ని తొలచి, రాతి లోపలి నుంచి నమూనాను తీసుకొని ఒక ట్యూబులో భద్రపరచింది. ఒక వ్యోమనౌక ఇతర గ్రహం మీద నమూనాలను సేకరించటం ఇదే తొలిసారి. అందుకే రోవర్ ఎప్పుడు తిరిగి వస్తుందా అని ఇక్కడి శాస్త్రవేత్తలు చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
నీటి జాడ నిర్ధరణ
అంగారకుడి మీద ఒకప్పుడు నీరు ఉండేదనే విషయాన్నీ పర్సివియెరెన్స్ నిర్ధరించింది. ప్రస్తుతం ఎండిపోయి, గాలులకు కోసుకుపోయిన జెజెరో అనే అగ్ని పర్వత బిలం వద్ద త్రిభుజాకారంలోని ఒండ్రు ప్రాంతాన్ని ఇది పరిశీలించిది. ఒకప్పుడిది సరస్సని, 370 కోట్ల ఏళ్ల క్రితం 120 మైళ్ల పొడవైన నది నుంచి దీనిలోకి నీరు వచ్చి చేరేదని తేలింది. నది తీర ప్రాంతం చాలావరకు ప్రశాంతంగా ఉండేదని భావిస్తున్నారు. కానీ భారీ వరదలు వచ్చిన జాడలు కనిపించాయి. వాతావరణంలో గణనీయమైన మార్పులు దీనికి కారణమై ఉండొచ్చని అనుకుంటున్నారు. దీనిలోంచి రోవర్ త్వరలో నమూనాలు సేకరించనుంది. వీటిల్లో జీవుల ఆనవాళ్లు ఉండొచ్చని ఆశిస్తున్నారు.
లావా ఆనవాళ్లు
పర్సివియెరెన్స్ పరిశీలిస్తున్న ప్రాంతాల్లో ‘సీటా’ ఒకటి. చుట్టుపక్కల పరిసరాలను బట్టి మొదట్లో దీనికి మూలం అవక్షేపం అని భావించారు. కానీ రోవర్ ఓ చిన్న పరికరం సాయంతో ఇక్కడి రాళ్ల ఉపరితలాన్ని తొలచి చూడగా.. అది అగ్నిశిల ఖనిజాలతో కూడుకొని ఉన్నట్టు బయటపడింది. అందువల్ల ఒకప్పుడు శిలాద్రవం ప్రవహించటం దీనికి కారణం కావొచ్చని అనుకుంటున్నారు. ఈ రాళ్లలో వివిధ రకాల లవణాలూ ఉన్నట్టు తేలింది.
సేంద్రియ అణువుల గుర్తింపు
రోవర్కు జోడించిన షెర్లాక్ పరికరం కొన్ని రాళ్లలో కర్బనంతో కూడిన సేంద్రియ రసాయనాలు ఉన్నట్టు గుర్తించింది. అరిగిపోయిన రాళ్ల లోపలే కాదు.. దుమ్ములో కూరుకుపోయి అరగని రాళ్లలోనూ కర్బనంతో కూడిన అణువులు ఉన్నట్టు బయటపెట్టింది. అంతమాత్రాన అక్కడ జీవుల ఉనికి ఉన్నట్టు కాదు. జీవులతో సంబంధంలేని ప్రక్రియలు సైతం సేంద్రియ అణువులను సృష్టించొచ్చు. ఇవి వేటికి సంబంధించినవి అనేది భూమికి వచ్చిన తర్వాత నమూనాలను పరిశీలిస్తే గానీ బయటపడదు. ఈ నమూనాలు చాలా ఏళ్లు శాస్త్రవేత్తల మెదళ్లకు పని కల్పించొచ్చని అనుకుంటున్నారు.
ఆక్సిజన్ సృష్టి
పర్సివియెరెన్స్ రోవర్లో అన్నింటికన్నా ఆసక్తికరమైన ప్రయోగం ఆక్సిజన్ తయారీ. ఇందుకోసం మార్స్ ఆక్సిజన్ ఇన్-సిటు రిసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్పెరిమెంట్ (మోక్సీ) పరికరాన్ని రోవర్కు జోడించారు. బంగారు రంగులో, కారు బ్యాటరీ సైజులో ఉండే ఇది అక్కడి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ నుంచి ఆక్సిజన్ను తయారు చేయటం విశేషం. మున్ముందు మనుషులు అక్కడికి వెళ్తే శ్వాసించటానికి అనువైన గాలిని సృష్టించుకోటానికి మోక్సీ సాయం చేస్తుందన్నమాట. ఇది వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి, దాన్ని శుద్ధిచేసి వేడి చేస్తుంది. దీంతో కార్బన్ డయాక్సైడ్.. ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్గా విడిపోతుంది. ఆక్సిజన్ను పట్టి ఉంచి, కార్బన్ మోనాక్సైడ్ను తిరిగి వాతావరణంలోకి వదిలేస్తుంది. ఇది ఒక గంటలో 5.4 గ్రాముల శుద్ధ ఆక్సిజన్ను పుట్టించి చరిత్ర సృష్టించింది. ఈ ఆక్సిజన్ ఒకరు సుమారు 10 నిమిషాల సేపు శ్వాస తీసుకోవటానికి సరిపోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. -
బొగ్గు దాణా!
బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు -
ఏఐ స్టెతస్కోప్
డాక్టర్ దగ్గరికి వెళ్లగానే ముందుగా పరీక్షించేది స్టెతస్కోప్తోనే. గుండె చప్పుడును వినటం దగ్గరి నుంచి ఊపిరితిత్తి జబ్బుల ఆనవాళ్లను పసిగట్టటం వరకూ ఇది ఎన్నో విధాలుగా తోడ్పడుతోంది. అధిక రక్తపోటును కచ్చితంగా నిర్ధరించటానికీ డాక్టర్లు మణికట్టు వద్ద స్టెతస్కోప్ను ఆనించి పై, కింది సంఖ్యలను నమోదు చేస్తుంటారు. -
క్యాన్సర్ తీరును పసిగట్టే ఏఐ
ఆరోగ్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) కొత్త పుంతలు తొక్కుతోంది. క్యాన్సర్ తీరుతెన్నులను విశ్లేషించటంలోనూ సాయం చేస్తోంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్వెస్ట్రన్ మెడికల్ సెంటర్ పరిశోధకులు రూపొందించిన ‘సియోగ్రాఫ్’ ఏఐ మోడలే దీనికి నిదర్శనం. -
అంతరిక్ష వీడియో ప్రసారాలు!
ఒక దెబ్బకు రెండు పిట్టలు! సైకీ గ్రహశకలం మీదికి ఇటీవల నాసా ప్రయోగించిన వ్యోమనౌక గురించి ఇలాగే చెప్పుకోవాలి. లోహంతో కూడిన ఈ గ్రహశకలం భూ అంతర్భాగ రహస్యాలను తెలుసుకోవటానికి తోడ్పడటం ఒక ప్రయోజనమైతే.. -
కృత్రిమ మేధ ఆసుపత్రి!
నేటి కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ప్రతీ అంతర్జాల పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఫొటోలు, వీడియోలు సృష్టించు కోవటం వంటివన్నీ చిటికెలో పనులుగా మారిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?