సైన్స్ సంగతులు..
దేనికైనా నకిలీలు పుట్టుకొస్తున్న రోజులివి. కరెన్సీ నోట్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దొంగ నోట్లను ముద్రించడం.. ఎంతో తెలివిగా వాటిని చలామణిలోకి తీసుకురావడం.. వాటిని గుర్తించడం చూస్తూనే ఉంటాం. అందుకే ఎవరైనా
కొత్తరకం సిరాతో నకిలీలకు చెక్!
దేనికైనా నకిలీలు పుట్టుకొస్తున్న రోజులివి. కరెన్సీ నోట్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దొంగ నోట్లను ముద్రించడం.. ఎంతో తెలివిగా వాటిని చలామణిలోకి తీసుకురావడం.. వాటిని గుర్తించడం చూస్తూనే ఉంటాం. అందుకే ఎవరైనా కొత్త నోటు తీసి ఇవ్వగానే అనుమానంతో ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తాం. ఇంకా ఎన్నేళ్లిలా దొంగనోట్ల విషయంలో జాగ్రత్త పడాలి? నకిలీ నోట్లు తయారు చేయకుండా చేయలేమా? అనే సందేహం వచ్చే ఉంటుంది. మన భారతీయ శాస్త్ర, సాంకేతిక పరిశోధనా మండలి శాస్త్రవేత్తలు అందుకో ఉపాయాన్ని కనుగొన్నారు. అదేంటంటే.. కొత్తరకం సిరా. ఆ ఇంకుతో కరెన్సీ నోట్లను ముద్రించేందుకు వాడొచ్చని ప్రతిపాదించారు. ప్రతిదీప్తి, చీకట్లో ప్రకాశించే ప్రక్రియల ఆధారంగా సిరాని తయారు చేశారు. ఇంకుని వాడడం కారణంగా తేజోవంతమైన కాంతితో రెట్టింపు ఉద్గారంతో నోట్లు తయారవుతాయి. వెలుతురుని బట్టి ఇవి రంగు మారుతుంటాయి. ప్రింట్ అయిన నోటుని వెలుతురులో చూస్తే ఒకలా.. అతినీలలోహితకాంతితో చూస్తే మరోలా కనిపించడం వీటి ప్రత్యేకత. అంటే.. వెలుతురులో తెల్లగా కనిపిస్తే.. యూవీలైట్తో ఎరుపు రంగులోనూ కనిపిస్తుంది. దొంగ నోట్లలో ఇలాంటి మార్పు ఉండదు. దీంతో నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేయడం అసాధ్యమే. ఒక్క నోట్ల విషయంలోనే కాదు. ఈ కొత్త రకం సిరాతో పాస్పోర్టులనూ తయారు చేయొచ్చు. అప్పుడు దొంగ పాస్పోర్టులతో ప్రయాణాలు చేసే వారికీ బ్రేక్ పడుతుంది.
పాల నాణ్యత చెప్పే కాగితం..
పాల స్వచ్ఛతను తెలిపేందుకు ఎన్నో పరికాలు ఉన్నాయి. కానీ, మనం ఇంట్లో వాడేందుకు తగినవి ఏమున్నాయ్. ఆలోచనలో పడ్డారా? చాలా సింపుల్గా పాల నాణ్యతను తెలుసుకునేందుకు మన శాస్త్రవేత్తలు కాగితపు సెన్సర్ కిట్ని వాడొచ్చని చెబుతున్నారు. ఒక చుక్క పాలను కాగితం ముక్కపై వేస్తే చాలు. పాలను పాశ్చరైజేషన్ చేసిందీ.. లేనిదీ తేల్చొచ్చు. సాధారణంగా ‘ఏఎల్పీ’ అనే పాల ఎంజైమ్ పాల నాణ్యతను తెలియజేసే ఒక సూచిక. పాలు పాశ్చరైట్ అయిన తర్వాత కూడా సూక్ష్మజీవుల ఉనికిని, వాటి చురుకుదనాన్ని ఏఎల్పీ సూచిస్తుంది. దీని శాతం పాలల్లో ఎంత ఉందో తెలుసుకునేందుకు సాధారణ ఫిల్టర్ కాగితాన్ని ఉపయోగించారు. దానిలోకి కొన్ని రసాయన శోధకాల్ని చొప్పించారు. ఆ శోధకాలతో ఏఎల్పీ కలిసిందంటే చాలు. కాగితం రంగు మారిపోతుంది. ఇలా మారిన కాగితాన్ని స్మార్ట్ఫోన్ కెమెరాతో ఫొటో తీసి, మార్పు చెందిన రంగుని ప్రాసెస్ చేసి ఫలితాన్ని పొందొచ్చు. అందుకు ప్రత్యేక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. చాలా తక్కువ సమయంలోనే సులభమైన పద్ధతిలో పాల నాణ్యతను తెలుసుకునేందుకు ఇదో స్మార్ట్ మార్గమే!
- డాక్టర్ సి.వి.సర్వేశ్వర శర్మ ప్రెసిడెంట్, కోనసీమ సైన్స్ పరిషత్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. -
బొగ్గు దాణా!
బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు -
ఏఐ స్టెతస్కోప్
డాక్టర్ దగ్గరికి వెళ్లగానే ముందుగా పరీక్షించేది స్టెతస్కోప్తోనే. గుండె చప్పుడును వినటం దగ్గరి నుంచి ఊపిరితిత్తి జబ్బుల ఆనవాళ్లను పసిగట్టటం వరకూ ఇది ఎన్నో విధాలుగా తోడ్పడుతోంది. అధిక రక్తపోటును కచ్చితంగా నిర్ధరించటానికీ డాక్టర్లు మణికట్టు వద్ద స్టెతస్కోప్ను ఆనించి పై, కింది సంఖ్యలను నమోదు చేస్తుంటారు. -
క్యాన్సర్ తీరును పసిగట్టే ఏఐ
ఆరోగ్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) కొత్త పుంతలు తొక్కుతోంది. క్యాన్సర్ తీరుతెన్నులను విశ్లేషించటంలోనూ సాయం చేస్తోంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్వెస్ట్రన్ మెడికల్ సెంటర్ పరిశోధకులు రూపొందించిన ‘సియోగ్రాఫ్’ ఏఐ మోడలే దీనికి నిదర్శనం. -
అంతరిక్ష వీడియో ప్రసారాలు!
ఒక దెబ్బకు రెండు పిట్టలు! సైకీ గ్రహశకలం మీదికి ఇటీవల నాసా ప్రయోగించిన వ్యోమనౌక గురించి ఇలాగే చెప్పుకోవాలి. లోహంతో కూడిన ఈ గ్రహశకలం భూ అంతర్భాగ రహస్యాలను తెలుసుకోవటానికి తోడ్పడటం ఒక ప్రయోజనమైతే.. -
కృత్రిమ మేధ ఆసుపత్రి!
నేటి కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ప్రతీ అంతర్జాల పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఫొటోలు, వీడియోలు సృష్టించు కోవటం వంటివన్నీ చిటికెలో పనులుగా మారిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్