కనిష్ట ఉష్ణోగ్రతలో విడ్డూరం..
చలికాలం వచ్చిందంటే చాలు.. వణికిపోతాం. ఇక మైనస్ డిగ్రీల్లోకి చేరిపోతే.. వేరే చెప్పక్కర్లేదు.. ఇంట్లో నుంచి బయటికే రాలేం. ఇలా మంచు దుప్పట్లు కప్పే సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల్ని చూస్తున్నాంగానీ.. మైనస్ 150.. మైనస్ 273 సెల్సియస్ డిగ్రీల్ని ఊహించగలరా? అసలు అలాంటి స్థితిని ఏమంటారు? అక్కడ వాయు పదార్థాలు ఎలా ఉంటాయి?
సైన్స్ సంగతులు
చలికాలం వచ్చిందంటే చాలు.. వణికిపోతాం. ఇక మైనస్ డిగ్రీల్లోకి చేరిపోతే.. వేరే చెప్పక్కర్లేదు.. ఇంట్లో నుంచి బయటికే రాలేం. ఇలా మంచు దుప్పట్లు కప్పే సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల్ని చూస్తున్నాంగానీ.. మైనస్ 150.. మైనస్ 273 సెల్సియస్ డిగ్రీల్ని ఊహించగలరా? అసలు అలాంటి స్థితిని ఏమంటారు? అక్కడ వాయు పదార్థాలు ఎలా ఉంటాయి? జీవుల్ని అంతటి అల్ప ఉష్ణోగ్రతల్లో ఉంచితే ఏం జరుగుతుంది? విచిత్రాలు.. విడ్డూరాలు చేసుకుంటాయేమో!! ఎస్.. శాస్త్రవేత్తలు అత్యంత అల్ప ఉష్ణోగ్రతల్ని సృష్టించి ఓ అద్భుతమే చేశారు. అదేంటో తెలుసుకుందాం!!
అది ‘క్రయోజనిక్స్’ మాయ..
సామాన్యుల ఊహకందని అల్ప ఉష్ణోగ్రతల్ని సృష్టించి.. వాటిని కొలిచేందుకు ఓ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడారు. అదే ‘క్రయోజనిక్స్’. మనకి తెలిసిన మంచు ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలు. అదే మంచుకు ఉప్పు కలిపితే ఉష్ణోగ్రత ఇంకా తగ్గిపోతుంది. ఈ విధంగా సున్నాకి 20 డిగ్రీల సెలిసియస్ దిగువకు వెళ్లిపోవచ్చు. దీన్నే మైనస్ 20 డిగ్రీలు అంటున్నాం. ఇలా ఎంత తక్కువ ఉష్ణోగ్రత వరకూ వెళ్లగలం? మైనస్ 273 డిగ్రీల సెల్సియస్ వరకూ వెళ్లొచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. నిజానికి అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రతల అవసరం ఉండదు. ఎందుకంటే.. ఆ ఉష్ణోగ్రతకి చేరే సరికి వాయు పదార్థాల ఉనికి ఉండదు. అనేక ప్రయోగాలు చేసి అల్ప ఉష్ణోగ్రతలు సృష్టించారుగానీ.. అతి కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 273 డిగ్రీల సెల్సియస్కు మాత్రం చేరుకోలేకపోయారు. ఇదే పరమ శూన్య ఉష్ణోగ్రత. అయితే, ఈ క్రయోజనిక్ వ్యవహారం ఎక్కడ మొదలవుతుంది. మైనస్ 150 డిగ్రీల సెల్సియస్ వద్ద రిఫ్రిజిరేషన్ ఉష్ణోగ్రత అంతమయ్యి క్రయోజనిక్ వ్యవహారం ప్రారంభమవుతుంది. శాశ్వత వాయువులైన ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్.. చివరకు గాలిని కూడా ఈ క్రయోజెనిక్స్ కారణంగా ద్రవరూపంలోకి వచ్చేస్తాయి. ఈ స్థితిలో చేప పిల్లతో శాస్త్రవేత్తలు ఓ ప్రయోగం చేశారు. ద్రవ నైట్రోజన్లో చేపని వదిలేసరికి అది తక్షణమే ఘనీభవించింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చేప చనిపోతుంది. కానీ, శాస్త్రవేత్తలు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. అదేంటంటే.. ఘనీభవించిన చేప ఉన్న ద్రవ నైట్రోజన్ని వేడి చేసి గది ఉష్ణోగ్రతకి తీసుకొచ్చారు. దీంతో చేప తిరిగి బతికింది. అంటే.. చేప ఘనీభవించినప్పుడు తిరిగి మామూలు స్థితికి వచ్చినప్పుడు దాని సెల్యులార్ కణాలకు హాని జరగలేదు. దీంతో ఇది సాధ్యమైందని ఈ ప్రయోగ ఫలితాల్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రయోజనిక్ టెక్నాలజీ పరిశ్రమల్లో, ఆహార పదార్థాల రవాణాలో, రాకెట్ ప్రయోగాల్లో ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇంకా ఈ టెక్నాలజీపై శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు.
దోమలకు గాలే విమానం..
రోగాలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎలా వ్యాపిస్తాయి. ఉదాహరణకు దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా. ఇది అనేక ప్రాంతాల్లో వ్యాప్తి చెందుతోందంటే.. దోమలు ఒక చోటు నుంచి మరో చోటుకి వేగంగా ప్రయాణం చేయడం వల్లే. మరైతే.. అన్నేసి కిలోమీటర్ల దూరం దోమలు ఎలా ప్రయాణం చేస్తాయి? ఇది ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలకు ఓ ప్రశ్నగా ఉంది. అందుకే వీటిపై పరిశోధనలు చేయగా... మలేరియాను వ్యాప్తి చేసే దోమలు ప్రతికూల పరిస్థితులు ఎదురైతే.. అనుకూల ప్రాంతాలకు వెళ్లిపోతుంటాయని తేలింది. అసలీ దోమలు ఎలా సుదూర ప్రాంతాలకు వెళ్తున్నాయా? అని నిశిత పరిశీలన చేశారు. హీలియం వాయువు నింపిన బెలూన్లను నేలకు 290 మీటర్ల ఎత్తుకు వదిలారు. ఈ బెలూన్ల ఉపరితలంపై జిగురు అట్టల్ని అమర్చారు. ఎత్తులో ఎగరుతున్న బెలూన్ల జిగురు అట్టలకు వేలాది మలేరియా వ్యాప్తి చెందించే దోమలు అంటుకున్నాయి. ఇవి వీచే గాలిలో కొట్టుకుని పోతూ వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయని తేల్చారు. అనుకూల ప్రదేశాల్లో నేల మీదకు దిగి అక్కడ మలేరియా వ్యాప్తికి కారణం అవుతున్నాయట. సహారా ఎడారి వంటి పొడి ప్రాంతాల్లో కూడా ఈ దోమలు సజీవంగా ఉండడానికి కారణాలను ఈ పరిశోధన వల్ల వివరించారు. వీటి ఫలితంగా దోమల ద్వారా వ్యాప్తి చెందే రోగాలను అదుపు చేయగల సరికొత్త విధానాల్ని అన్వేషించడం సాధ్యం అవుతుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
విద్యుత్ కార్లకో వరం..
రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాల్ని చూస్తున్నాం. మార్కెట్లో వీటి సందడి బాగా పెరుగుతోంది. అయితే, వీటి బ్యాటరీల విషయంలోనే ఇంకా అనేక ఛాలెంజ్లు ఎదురవుతున్నాయి. వాటికి చెక్ పెట్టే క్రమంలో వాహనాల్లో వాడుతున్న బ్యాటరీలకు కొత్త శక్తిని అందించేందుకు పలు ప్రయత్నాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త రకం బ్యాటరీలను అమెరికాలోని పెన్ రాష్ట్రానికి చెందిన ఇంజినీర్లు రూపకల్పన చేశారు. వారు రూపొందించిన లిథియం ఐరన్ పాస్ఫేట్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి కేవలం పది నిమిషాలు సరిపోతుంది. ఇలా తక్కువ సమయంలో ఛార్జ్ అవ్వడానికి కారణం అది వేగంగా 145 డిగ్రీల ఫారన్హీట్ ఉష్ణోగ్రతకు వేడెక్కగల సమర్థత కలిగి ఉండడం. అంతేకాదు.. వాహనం ఆపగానే ఈ బ్యాటరీ అత్యంత వేగంగా చల్లారగలుతుంది. ఇలా ఛార్జ్ చేసిన వాహనం 250 మైళ్లు వరకూ ప్రయాణిస్తుంది. ఈ బ్యాటరీ జీవిత కాలంలో వాహనాన్ని రెండు మిలియన్ మైళ్లు ప్రయాణింప చేయగలదు. అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడుకునేలా తక్కువ ధరలో వీటిని రూపొందించినట్టుగా రూపకర్తలు చెబుతున్నారు.
ఎలా పని చేస్తుంది?
బ్యాటరీకి సెల్ఫ్ హీటింగ్ పరికరం ఒకటి అమర్చారు. దాంట్లో నికెల్తో చేసిన ఒక పలుచని రేకు ఉంటుంది. దీని ఒక కొన బ్యాటరీ రుణ ధ్రువానికి కలుపబడుతుంది. రెండో కొన వెలుపల వైపు ఉండి మూడో ధ్రువముగా ఉపయోపడుతుంది. దీని గుండా ఎలక్ట్రాన్ల ప్రవాహం మొదలైతే స్పీడుగా ఈ నికెల్ రేకు వేడెక్కుతుంది. ఫలితంగా బ్యాటరీ లోపల వేడి ఎక్కువ అవుతుంది. బ్యాటరీ లోపల ఉష్ణోగ్రత 145 డిగ్రీలు ఫారన్హీట్కు చేరగానే దీని స్విచ్ తెరచుకుని చాలా తొందరగా బ్యాటరీ ఛార్జ్ లేదా డిశ్చార్చి అవుతుంది. ఈ బ్యాటరీ నిర్మాణంలో అతి తక్కువ ఖరీదుగల ఎలక్ట్రోలైట్, ధన, రుణ ధ్రువాలను ఏర్పరచవచ్చు. ఈ సెల్ఫ్ హీటింగ్ పరికరం వల్ల లీథియం ధన ధ్రువంపై ఎటువంటి ప్రమాదకరమైన అవక్షేపాలు ఏర్పడవని ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ బ్యాటరీని ఉపయోగించిన వాహనం కేవలం మూడు సెకన్ల కాలంలో 0 నుంచి 60 మైళ్ల వేగానికి పుంజుకుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. -
బొగ్గు దాణా!
బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా