రాకెట్లకు మరింత మెరుపు వేగం..
భూమిపై ఒక చోటు నుంచి మరో చోటుకి వేగంగా వెళ్లేందుకు అనేక సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయ్. కొన్ని గంటలు.. రోజుల్లోనే ప్రపంచం నలు మూలలకు చేరుకోగలుగుతున్నాం. మరైతే.. ఎప్పటి నుంచో భూమి నుంచి ఇతర గ్రహాలకు
భూమిపై ఒక చోటు నుంచి మరో చోటుకి వేగంగా వెళ్లేందుకు అనేక సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయ్. కొన్ని గంటలు.. రోజుల్లోనే ప్రపంచం నలు మూలలకు చేరుకోగలుగుతున్నాం. మరైతే.. ఎప్పటి నుంచో భూమి నుంచి ఇతర గ్రహాలకు పయనించేందుకు చేస్తున్న ప్రయత్నాల సంగతేంటి? ఉదాహరణకు మనకి ఎంతో ఇష్టమైన, భూమిని పోలిన అంగారక గ్రహం. ఇది సూర్యుడి దగ్గర్లో ఉన్న నాలుగో గ్రహం. భూమికి సమీపంలో ఉంటుంది. దీనికి సంబంధించిన అనేక విశేషాలు 1972లో మెరైనర్ 9 ప్రయోగం ద్వారా లభించాయి. మొదటిసారి అంగారక గ్రహం ఫొటోలు తీసింది మెరైనరే. తర్వాత వైకింగ్-1.. వైకింగ్-2.. పాత్ఫైండర్.. లాంటి మరిన్ని నౌకల్ని పలు దేశాలు ఈ గ్రహం పైకి పంపాయి. నాసా అయితే.. 2012లో క్యూరియాసిటీ రోవర్ను ప్రయోగించింది. మనదేశం ‘మామ్’ అనే హ్యోమనౌకను పంపగా అది 2014 సెప్టెంబరులో అంగారకుడి కక్ష్యలో చేరింది. ఈ నెల మొదటి వారంలో తొలిసారి అరబ్దేశాలు పంపిన అమల్ ఉపగ్రహం ఏడు నెలలు ప్రయాణం చేసి అంగారకుడి కుడి కక్ష్యలోకి ప్రవేశించింది. మరో అడుగు ముందుకేసి నాసా 2035 నాటికి మానవ సహిత హ్యోమ నౌకను మార్స్పైకి పంపాలనుకుంటోంది. బాగానే ఉందిగానీ.. మార్స్ అంత దగ్గర్లో ఏమీ లేదు. భూమికి 14 కోట్ల మైళ్ల దూరంలో ఉంది.
అంత దూరం ప్రయాణం చేయడం తేలికైన విషయం కాదు. పైగా అంగారక గ్రహంపై అంటార్కిటికా కన్నా కొన్ని రెట్ల ఎక్కువ చల్లదనం ఉంటుంది. అందువల్ల సుదీర్ఘ ప్రయాణం చేసి మార్స్పై మనిషి ఎక్కువ రోజులు ఉండడం ప్రమాదకరం. అందుకే ప్రయాణ కాలం తగ్గించే పద్ధతుల్ని శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. అల్ట్రాసేఫ్ న్యూక్లియర్ టెక్నాలజీస్ సంస్థ దీనికి ఒక కొత్త విధానం ప్రతిపాదించింది. అదేంటంటే.. రాకెట్కు న్యూక్లియర్ థర్మల్ ప్రొపల్షన్ ఇంజన్ని ఏర్పాటు చేయడం. దీంతో భూమి నుంచి బయలుదేరిన రాకెట్ అంగారక గ్రహానికి హ్యోమగామిని కేవలం మూడు నెలల్లోనే తీసుకెళ్తుందంటున్నారు. ఈ సంస్థ డైరెక్టర్ మైకెల్ ఈడ్స్ ప్రకారం.. న్యూక్లియర్ పవర్తో నడిచే రాకెట్ల సామర్థ్యం, పనితీరు ప్రస్తుతం వినియోగిస్తున్న రసాయన ఇంజన్ల సామర్థ్యం కన్నా రెండు రెట్లు ఎక్కువ. తక్కువ ఇంధన ఖర్చుతో వేగంగా ప్రయాణించేందుకు న్యూక్లియర్ పవర్ చక్కని ప్రత్యామ్నాయం అవుతుందట!
ప్రస్తుతం మానవ రహిత అంతరిక్ష నౌకలు మార్స్ను చేరుకోవటానికి ఏడు నెలలు పడుతోంది. అదే మానవ సహిత ప్రయాణానికి కనీసం తొమ్మిది నెలలు పడుతుంది.
చెట్టు వయసు 2 కోట్లు
చరిత్రకు దర్పణాలు శిలాజాలు. గతంలో వైభవంగా జీవించి, కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో వృక్ష, జంతు జాలాల జ్ఞాపక చిహ్నాలే ఈ శిలాజాలు. ఇవి బయటపడిన ప్రతిసారీ గతం తాలూకు వైభవం, వైవిధ్యం మనల్ని అవాక్కయ్యేలా చేస్తుంది. కానీ, చీకటి కాలం గురించి మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి క్లూ దొరకలేదు. అంటే.. 60 కోట్ల ఏళ్ల ముందు కాలం అన్నమాట. అప్పుడు ఎలాంటి మార్పులు సంభవించాయో తెలుసుకోవడానికి ఎలాంటి శిలాజ ఆధారాలు శాస్త్రవేత్తలకు దొరకలేదు. ఈ 60 కోట్ల సంవత్సరాల్ని మూడు మహాయుగాలుగా అనుకుంటే.. వాటిల్లో ఒకటి పురాజీవ మహాయుగం.. రెండోది మాధ్యమిక జీవ మహాయుగం.. మూడోది ఆధునిక జీవ మహాయుగం. ఈ మూడో యుగ కాలంలో అంటే.. 2 కోట్ల సంవత్సరాల క్రితం నాటి ఓ మహావృక్షం ఇప్పుడు బయటపడింది. ఇప్పటికీ అది ఏ మాత్రం చెక్కు చెదరలేదు. అగ్ని పర్వత ద్వీపం అయిన లెస్బాస్లో గ్రీకు శాస్త్రవేత్తలు ఈ మహా వృక్షాన్ని వెలికి తీశారు. ఇది ఇప్పటికీ చెడిపోకుండా ఉండడం ఓ అద్భుతమని, 2 కోట్ల ఏళ్ల నాటి చరిత్రకు సాక్ష్యంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆనాడు అరణ్య ప్రాంతాల్లో ఏయే వృక్షజాతులు జీవించి ఉండేవో తెలుసుకోవడానికి ఈ వృక్షం ఓ లైబ్రరీ అనుకోవచ్చని.. ఆయా వృక్షజాతుల్ని తిరిగి సృష్టించేందుకు, ఆధునిక జీవ మహాయుగం నాటి విశేషాల్ని తెలుసుకోవడానికి సాధ్య పడుతుందని శిలాజ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యునెస్కో సంరక్షణలో ఉన్న 15 వేల హెక్టార్ల అడవి ప్రాంతంలో ఈ వృక్షాన్ని కనుగొన్నారు. 2 కోట్ల సంవత్సరాల క్రితం అగ్ని పర్వతం పేలడంతో అరణ్యంగా ఉండే ఆ ప్రాంతం అంతా నాశనం అయ్యింది. లావా, బూడిదలతో నిండిపోయింది. 1995లో శిలాజ శాస్త్రవేత్తలు అక్కడ తవ్వకాలు మొదలు పెట్టారు. గత జనవరిలో రోడ్డు నిర్మాణం కోసం తవ్వుతున్న తవ్వకాలలో ఈ శిలాజ వృక్షం బయటపడింది.
సమృద్ధిగా వృక్షజాతులున్న అరణ్య ప్రాంతం అగ్నిపర్వత విజృంభణ వల్లనో.. జల ప్రళయాల కారణంగానో.. భూ సమాధి అయిపోతాయి. ఇలా శిలాజాలుగా మిగిలిపోయిన అడవుల్ని ఇంగ్లిష్లో పెర్ట్రి ఫయిడ్ ఫారెస్ట్లు అని పిలుస్తారు.
మంచు తుపానుల్లో బుడగ రక్ష
మైనస్ 5 డిగ్రీల సెల్సియస్ని మనం ఊహించగలమా? అప్పుడు కురిసే మంచుని చూడగలమా? ఇక్కడ మనకి అలాంటి అనుభవం లేదుగానీ.. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా అదే పరిస్థితి. భారీగా కురుస్తున్న మంచు తుపాను వల్ల అక్కడ పరిస్థితి విషమంగా మారింది. రహదారులపై భారీగా మంచు పేరుకుపోయింది. సరస్సులు గడ్డకట్టుకుపోయాయి. అత్యంత ప్రమాదకరమైన మంచు తుపానుల్లో అనుకోకుండా మనిషి చిక్కుకుంటే బయటపడడం అంత తేలిక కాదు. మంచు కింద కూరుకుపోయి ఊపిరి ఆడక మరణించే పరిస్థితి వస్తుంది. అదెలాగంటే.. మంచు తుపాను తొలిదశలో మంచుపైనే ఉంటారు. మంచు కింది భాగం కరిగి ప్రవహించడం మొదలుపెట్టాక మనుషులు బరువు వల్ల కిందికి దిగబడిపోతుంటారు. అలాంటప్పుడు ఎక్కడైనా మంచులో ఇరుక్కుపోతే ఎక్కడ ఉన్నారనేది గుర్తించడం కూడా సాధ్యపడదు. ఒకవేళ గుర్తించినా మంచు పొరల కింద నుంచి బయటకు తీయడం కష్ట సాధ్యం. ఈ పరిస్థితిని అధిగమించేందుకు జర్మనీ శాస్త్రవేత్తలు ఎయిర్ బ్యాగుని రూపొందించారు. దీనికి ఏర్పాటు చేసిన సిస్టంతో మంచు కింద మనుషులు సమాధి కాకుండా కాపాడొచ్చు. నడుముకు కట్టుకునే ఈ బ్యాగులో ముడుచుకుని ఉన్న బెలూన్, నైట్రోజన్ సిలెండర్, రిప్కార్డు ఉంటాయి. ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పుడైనా మంచు తుపానులో చిక్కుకుంటే రిప్కార్డుని లాగితే నైట్రోజన్ వాయువు సిలెండర్ నుంచి విడుదలై బెలూన్లో నిండిపోతుంది. రెండు సెకన్లలో బెలూన్ ఘన పరిమాణం 150 లీటర్ల స్థాయికి చేరుతుంది. బెలూన్ మనిషిని పైకి లేపుతుంది. ఫలితంగా మనిషి మంచు కింద నలిగిపోకుండా ఉంటాడు.
మంచు తుపానుల రాకను ముందుగానే గుర్తించి, ప్రజల్ని అప్రమత్తం చేసే అధ్యయన కేంద్రం హిమాచల్ప్రదేశ్లోని మనాలిలో ఉంది. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి వాతావరణ కేంద్రం లేదు. మంచు తుపాను రాకపోకల్ని చెప్పడమే కాకుండా వాటి నుంచి రక్షణ పొందే విధానాల్లో కూడా ఈ సంస్థ శిక్షణ అందిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. -
బొగ్గు దాణా!
బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు -
ఏఐ స్టెతస్కోప్
డాక్టర్ దగ్గరికి వెళ్లగానే ముందుగా పరీక్షించేది స్టెతస్కోప్తోనే. గుండె చప్పుడును వినటం దగ్గరి నుంచి ఊపిరితిత్తి జబ్బుల ఆనవాళ్లను పసిగట్టటం వరకూ ఇది ఎన్నో విధాలుగా తోడ్పడుతోంది. అధిక రక్తపోటును కచ్చితంగా నిర్ధరించటానికీ డాక్టర్లు మణికట్టు వద్ద స్టెతస్కోప్ను ఆనించి పై, కింది సంఖ్యలను నమోదు చేస్తుంటారు. -
క్యాన్సర్ తీరును పసిగట్టే ఏఐ
ఆరోగ్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) కొత్త పుంతలు తొక్కుతోంది. క్యాన్సర్ తీరుతెన్నులను విశ్లేషించటంలోనూ సాయం చేస్తోంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్వెస్ట్రన్ మెడికల్ సెంటర్ పరిశోధకులు రూపొందించిన ‘సియోగ్రాఫ్’ ఏఐ మోడలే దీనికి నిదర్శనం. -
అంతరిక్ష వీడియో ప్రసారాలు!
ఒక దెబ్బకు రెండు పిట్టలు! సైకీ గ్రహశకలం మీదికి ఇటీవల నాసా ప్రయోగించిన వ్యోమనౌక గురించి ఇలాగే చెప్పుకోవాలి. లోహంతో కూడిన ఈ గ్రహశకలం భూ అంతర్భాగ రహస్యాలను తెలుసుకోవటానికి తోడ్పడటం ఒక ప్రయోజనమైతే.. -
కృత్రిమ మేధ ఆసుపత్రి!
నేటి కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ప్రతీ అంతర్జాల పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఫొటోలు, వీడియోలు సృష్టించు కోవటం వంటివన్నీ చిటికెలో పనులుగా మారిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!