చిరంజీవ.. చిరంజీవ
దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తాం. చిరంజీవ అని ఆశీర్వదిస్తాం. జరామరణాలను జయించాలనే మనలోని నిగూఢ ఆకాంక్షకివి ప్రత్యక్ష నిదర్శనాలు. అమరత్వాన్ని సాధించాలనే ఆశ ఈనాటిది కాదు. అనాదిగా మనిషిని ఊరిస్తున్నదే. కొందరికిది ఉత్త ఊహ.
దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తాం. చిరంజీవ అని ఆశీర్వదిస్తాం. జరామరణాలను జయించాలనే మనలోని నిగూఢ ఆకాంక్షకివి ప్రత్యక్ష నిదర్శనాలు. అమరత్వాన్ని సాధించాలనే ఆశ ఈనాటిది కాదు. అనాదిగా మనిషిని ఊరిస్తున్నదే. కొందరికిది ఉత్త ఊహ. కొందరికి మాత్రం సాధన. ప్రయత్నిస్తే అసాధ్యమేమీ కాదనే తపన. అందుకే ఎన్నెనో బయోటెక్ కంపెనీలు మరణాన్ని జయించటంపై దృష్టి సారించాయి. ప్రపంచ కోటీశ్వరులు సైతం వృద్ధాప్యాన్ని ఓడించటానికి సై అంటున్నారు. జీవ రీప్రోగ్రామింగ్తో కణాలను పునరుత్తేజం చేయటానికి సంకల్పించిన ఆల్టోస్ ల్యాబ్లో ఇటీవల అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ పెట్టుబడి పెట్టటమే దీనికి నిదర్శనం. దీంతో అమరత్వ సాధన మరోసారి చర్చనీయాంశమైంది.
* పళ్లు తోముకోవటానికి స్మార్ట్ బ్రష్ను నోట్లో పెట్టుకున్నారు. అది లాలాజలంలోని సూక్ష్మక్రిముల ద్వారా సమాచారాన్ని సేకరించి.. ఒంట్లో, చర్మం మీద అమర్చిన అతిసూక్ష్మ ఐఓటీ పరికరాలకు చేరవేస్తుంది. వీటి నుంచి అందే డేటాను చుట్టుపక్కల పరికరాలు విశ్లేషించి మరుక్షణంలో ఆరోగ్యం ఎలా ఉందో తెలియజేస్తాయి.
* ఒంట్లో ఏదో భాగం చెడిపోయింది. ఆసుపత్రికి వెళ్లగానే దాన్ని తీసేసి, 3డీ ముద్రిత భాగాన్ని అమర్చారు. లేదూ.. అందులోని అవకరాన్ని సరిచేసి, బిగించారు.
* రక్తనాళంలో పూడిక ఏర్పడింది. లోపల్నుంచే అతిసూక్ష్మ రోబోలు దాన్ని తొలగించేశాయి. ఎక్కడో కంతి ఏర్పడింది. దీన్నీ నానోబోట్లు లోలోపలే కత్తిరించేశాయి. అవసరమైన చోటుకు అవసరమైనంత వరకే మందులను చేరవేశాయి.
* జన్యు సవరణతో పుట్టుకతో తలెత్తే లోపాలన్నీ మాయమయ్యాయి. మనుషులు మరింత బలంగా, దృఢంగా మారారు. క్యాన్సర్, మధుమేహం, అల్జీమర్స్ వంటి జబ్బుల బెడద అసలే లేదు.
- ఇలాంటివి ఊహించుకుంటేనే ఎంతో ఆనందంగా ఉంది కదా. మరి ఇవే నిజమైతే? వ్యాధులను, వృద్ధాప్యాన్ని, మరణాన్ని జయించి మనిషి దీర్ఘాయుష్షును సొంతం చేసుకుంటే ఇంకెంత ఆనందంగా ఉంటుంది? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడెన్నో సంస్థలు ఈ పనిలోనే నిమగ్నమయ్యాయి. జెఫ్ బెజోస్ పెట్టుబడి పెట్టిన ఆల్టోస్ ల్యాబ్స్ ఇలాంటి ప్రయత్నమే చేస్తోంది. చాలా బయోటెక్ సంస్థలు వృద్ధాప్యంతో ముడిపడిన జబ్బులను ఎదుర్కోవటం మీద దృష్టి సారిస్తుండగా.. ఆల్టోస్ ల్యాబ్స్ మాత్రం కణస్థాయిలో మొత్తం శరీరాన్ని పునరుత్తేజితం చేయాలని సంకల్పించింది. ఇలా మరణాన్ని నిలువరించాలని ఆశిస్తోంది. ఇందుకోసం ప్రథమంగా ప్రయోగశాలలో జీవ రీప్రోగ్రామింగ్ ద్వారా కణాలను పునరుత్తేజం చేయటానికి శ్రీకారం చుట్టింది. ఈ పరిజ్ఞానాన్ని అన్ని జంతువులకు వర్తింపజేయాలనీ భావిస్తోంది. చివరికిలా మనిషి శారీరక వయసును ఆపేసి, ఆయుష్షును వీలైనంత ఎక్కువగా పెంచటంపై కృషి చేస్తోంది. ఇందుకోసం పెద్ద పెద్ద జీతాలిస్తూ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను నియమించుకుంటోంది.
15 ఏళ్ల క్రితం ఆవిష్కరణే ఆధారం
అది 2006. షిన్య యమనక అనే శాస్త్రవేత్త వినూత్న పరిశోధనలో మునిగిపోయారు. కేవలం నాలుగు ప్రొటీన్లను (యమనక ఫ్యాక్టర్స్) అదనంగా జతచేస్తే ఏ కణాన్నయినా మూలకణంగా మార్చొచ్చని గుర్తించారు. ఇది ఎలుకల్లో వృద్ధాప్య లక్షణాలను తగ్గించటమే కాదు.. వీటి జీవనకాలాన్ని సగటున ఆరు వారాల వరకు పొడిగించినట్టు 2016లో నిరూపితమైంది కూడా. ఈ పద్ధతితోనే 2020లో ఎలుకలకు తిరిగి కంటిచూపును రప్పించటం గమనార్హం. ప్రస్తుతం ఆల్టోస్ ల్యాబ్స్ చేపట్టిన జీవ రీప్రోగ్రామింగ్కు ఆధారం ఇదే. ఎలుకల్లో సాధించిన విజయాలు ఏనాటికైనా మనుషుల ఆయుష్షును పెంచటానికి ఉపయోగపడగలవని ఆశిస్తున్నారు. అయితే ఇదంత తేలికైందేమీ కాదు. సాధించాల్సింది ఇంకా చాలానే ఉంది. ఈ పద్ధతితో ఎలుకల ఆయుష్షు పెరిగినా కొన్ని ఎలుకల్లో కణితులు ఏర్పడ్డాయనే సంగతిని మరవరాదని శాస్త్రవేత్తలు గుర్తుచేస్తున్నారు.
* ఆల్టోస్ ల్యాబ్స్ ‘జీవ గడియార’ పరిజ్ఞానాన్నీ వినియోగించుకోనుంది. దీన్ని స్టీవ్ హార్వత్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. దీంతో కణాల, జీవుల వయసును కచ్చితంగా కొలవచ్చు. వయసును మళ్లించే చికిత్సల ప్రభావాలను, సామర్థ్యాన్ని గుర్తించటానికి దీన్ని వాడుకోవాలని భావిస్తున్నారు.
ఎన్నెన్నో సంస్థలు
మరణాన్ని జయించే ప్రయత్నం ఆల్టోస్ ల్యాబ్స్తో తాజాగా చర్చలోకి వచ్చింది గానీ దీనిపై ఇంతకుముందు నుంచే ఎన్నెన్నో సంస్థలు కృషి చేస్తున్నాయి.
* కాలిఫోర్నియాలోని యూనిటీ బయోటెక్నాలజీ అనే అంకుర సంస్థ వృద్ధాప్య లక్షణాలను వెనక్కి మళ్లించటానికి, తగ్గించటానికి మందులు రూపొందిస్తోంది. ఇది తయారుచేసిన యూబీఎక్స్0101 మందుపై నిర్వహించిన రెండో దశ ప్రయోగ పరీక్షలు సకాలంలో పూర్తికాలేదు గానీ లేకపోతే దీని ఫలితాలు ఇప్పటికే తెలిసి ఉండేవి.
* గూగుల్ దన్నుతో పనిచేస్తున్న కాలికో ల్యాబ్స్ 2013 నుంచీ ముసలితనాన్ని జయించే మందుల ఆవిష్కరణపై దృష్టి సారించింది. వృద్ధాప్యం ఎలా సంభవిస్తుంది? వయసుతో పాటు తలెత్తే జబ్బులను ఎదుర్కోవటమెలా? అనేవి గుర్తించటం దీని ఉద్దేశం.
* ఏజ్ఎక్స్థెరపెటిక్స్, బ్రిటన్కు చెందిన షిఫ్ట్ బయోసైన్సెస్, అమెరికాకు చెందిన లైఫ్ బయోసైన్సెస్ వంటి సంస్థలూ కణాల రీప్రోగ్రామింగ్ ద్వారా జీవనకాలాన్ని పొడిగించటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?
‘‘మీరు చేయాల్సిన పని మరణాన్ని అరికట్టటం. చావును నివారించటానికి జీవులు చురుకుగా పనిచేయకపోతే అవి చివరకు తమ పరిసరాల్లో కలిసిపోతాయి. స్వయం ప్రతిపత్తి గల జీవులుగా అస్తిత్వం కోల్పోతాయి. మరణించినప్పుడు జరిగేది ఇదే.’’ జీవశాస్త్రవేత్త రిచర్డ్ డాకిన్స్ రాసిన పుస్తకంలోని పంక్తులివి. జెఫ్ బెజోస్ తమ వాటాదారులకు రాసిన చివరి ఉత్తరంలో వీటినే ఉటంకించారు. విశిష్టత, వాస్తవికత, ప్రత్యేకతలను కాపాడుకోవటానికి దేశాలు, కంపెనీలు, వ్యక్తులు పోరాడాల్సి ఉంటుందనేది ఆయన భావన. బెజోస్ ఉద్దేశం ఏదైనా మరణాన్ని జయించాలనే మానవాళి చిరకాల కాంక్ష ఇందులో గోచరిస్తుందనటం నిస్సందేహం. ఇంతకుముందెన్నడూ ఇన్ని పరికరాలు, ఇంత విజ్ఞానం, ఇంత టెక్నాలజీ లేవు. ఇంత సమాచార స్రవంతీ లేదు. వైద్యశాస్త్రం ప్రజా బాహుళ్యంలోకి చొచ్చుకెళ్లింది. జన్యు సవరణ పద్ధతులు సరళమవుతున్నాయి. అధునాతన చికిత్సలు రోజురోజుకీ కచ్చితత్వాన్ని సాధిస్తున్నాయి. అందరికీ అందుబాటులో ఉండేలా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాధించకపోతే మరణాన్ని ఇంకెప్పుడు జయిస్తామన్నదే శాస్త్రవేత్తలు, పరిశోధకుల మనసుసులో మెదులుతున్న ప్రశ్న.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. -
బొగ్గు దాణా!
బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు -
ఏఐ స్టెతస్కోప్
డాక్టర్ దగ్గరికి వెళ్లగానే ముందుగా పరీక్షించేది స్టెతస్కోప్తోనే. గుండె చప్పుడును వినటం దగ్గరి నుంచి ఊపిరితిత్తి జబ్బుల ఆనవాళ్లను పసిగట్టటం వరకూ ఇది ఎన్నో విధాలుగా తోడ్పడుతోంది. అధిక రక్తపోటును కచ్చితంగా నిర్ధరించటానికీ డాక్టర్లు మణికట్టు వద్ద స్టెతస్కోప్ను ఆనించి పై, కింది సంఖ్యలను నమోదు చేస్తుంటారు. -
క్యాన్సర్ తీరును పసిగట్టే ఏఐ
ఆరోగ్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) కొత్త పుంతలు తొక్కుతోంది. క్యాన్సర్ తీరుతెన్నులను విశ్లేషించటంలోనూ సాయం చేస్తోంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్వెస్ట్రన్ మెడికల్ సెంటర్ పరిశోధకులు రూపొందించిన ‘సియోగ్రాఫ్’ ఏఐ మోడలే దీనికి నిదర్శనం. -
అంతరిక్ష వీడియో ప్రసారాలు!
ఒక దెబ్బకు రెండు పిట్టలు! సైకీ గ్రహశకలం మీదికి ఇటీవల నాసా ప్రయోగించిన వ్యోమనౌక గురించి ఇలాగే చెప్పుకోవాలి. లోహంతో కూడిన ఈ గ్రహశకలం భూ అంతర్భాగ రహస్యాలను తెలుసుకోవటానికి తోడ్పడటం ఒక ప్రయోజనమైతే.. -
కృత్రిమ మేధ ఆసుపత్రి!
నేటి కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ప్రతీ అంతర్జాల పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఫొటోలు, వీడియోలు సృష్టించు కోవటం వంటివన్నీ చిటికెలో పనులుగా మారిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల