ఈల్.. విద్యుత్తు.. బ్యాటరీ!
మొబైల్ ఫోన్లు, ఒంటికి ధరించే పరికరాలు.. అధునాతన ఎలక్ట్రిక్ వాహనాల వెల్లువతో ఎక్కువకాలం పనిచేసే బ్యాటరీల అవసరం రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. శాస్త్రవేత్తలు కూడా ఎప్పటికప్పుడు వినూత్న బ్యాటరీలను రూపొందిస్తున్నారు. ఇంతకీ...
మొబైల్ ఫోన్లు, ఒంటికి ధరించే పరికరాలు.. అధునాతన ఎలక్ట్రిక్ వాహనాల వెల్లువతో ఎక్కువకాలం పనిచేసే బ్యాటరీల అవసరం రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. శాస్త్రవేత్తలు కూడా ఎప్పటికప్పుడు వినూత్న బ్యాటరీలను రూపొందిస్తున్నారు. ఇంతకీ మొట్టమొదటి బ్యాటరీని ఎవరు తెలుసా? ఇటలీ భౌతిక శాస్త్రవేత్త అలెసాండ్రో వోల్టా. ఆయన 1800లో ప్రాథమిక విద్యుత్రసాయన సూత్రాల ఆధారంగా దీన్ని రూపొందించారు. దీనికి స్ఫూర్తి ఈల్ చేపలు కావటం విశేషం!
రెండు వేర్వేరు పదార్థాలు (లోహాలను) అనుసంధానమైనప్పుడు రసాయన ప్రతిచర్య పుట్టుకొచ్చి, ఒక పదార్థం నుంచి మరోదానికి ఎలక్ట్రాన్లు ప్రసరిస్తాయి. బ్యాటరీల్లో విద్యుత్తు ఉత్పత్తికి మూలం ఈ ఎలక్ట్రాన్ల ప్రవాహమే. ఇందుకోసం వాడుకున్న తొలి లోహాలు రాగి, జింక్. ప్రస్తుతం నాణ్యమైన బ్యాటరీల్లో వివిధ లోహ మిశ్రమాలతో కూడిన లిథియాన్ని ఉపయోగిస్తున్నారు. శతాబ్దాలుగా మెరుగు పడుతూ వస్తున్నప్పటికీ ఆధునిక బ్యాటరీలు కూడా అలెసాండ్రో వోల్టా పద్ధతి మీద ఆధారపడ్డవే. లోహాల అనుసంధానం, విద్యుత్రసాయన ప్రతిచర్య జరగటం, పుట్టుకొచ్చే ఎలక్ట్రాన్లను ఒడిసి పట్టటం.. ఇప్పటికీ బ్యాటరీల తయారీలో అనుసరిస్తున్న సూత్రం ఇదే. అయితే దీన్ని కనుగొనటానికి వోల్టాకు స్ఫూర్తిని ఇచ్చినవి మాత్రం ఈల్ చేపలే. ఇవి నీటిలో ఈదుతూ మెరుపులాంటి విద్యుత్తును పుట్టించి, శత్రువును షాక్కు గురిచేస్తాయి. ఇలా విద్యుత్తును పుట్టించటానికి ఈల్ చేపల్లో ప్రత్యేక అవయవం ఉందని వోల్టా గుర్తించారు. దీని రహస్యాన్ని ఛేదించగలిగితే విద్యుత్తు తయారీకి కొత్త మార్గం దొరికినట్టే కదా అన్నది ఆయన ఆలోచన. ఈల్ చేపల్లో విద్యుత్తును పుట్టించే అవయవం పొడవైన కణాల కుప్పలా.. నాణాల దొంతరలా ఉంటుంది.
అందుకే వివిధ లోహాలను బిళ్లల మాదిరిగా కత్తిరించి, పొడవుగా పేరుస్తూ ప్రయోగాలు చేశారు. వేటితోనూ ఫలితం కనిపించలేదు. చివరికి ఉప్పునీటితో తడిపిన కాగితంతో రాగి, జింక్ బిళ్లలను వేరు చేస్తున్నప్పుడు విద్యుత్తు పుట్టుకొస్తున్నట్టు కనుగొన్నారు. బిళ్లల వరుస ఎంత ఎత్తుగా ఉంటే అంత ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి అయ్యింది. దీన్ని బట్టి ఈల్ చేపలో విద్యుత్తును తయారుచేసే అవయవం రహస్యాన్ని కనిపెట్టేశానని వోల్టా సంబర పడిపోయారు. అందుకే తాను తయారుచేసిన పరికరాన్ని మొదట్లో ‘కృత్రిమ విద్యుత్ అవయవం’ అనీ పిలుచుకునేవారు. కానీ వోల్టా ఊహించినట్టు ఈల్ చేపల్లోని విద్యుత్ అవయవానికీ, విద్యుత్ రసాయన ప్రతిచర్యలకూ సంబంధమేమీ లేదని తర్వాత శాస్త్రవేత్తలు గుర్తించారు. మన నాడీ కణాలు విద్యుత్ సంకేతాలను ఉత్పత్తి చేసినట్టుగానే ఈల్ చేపలు విద్యుత్తును పుట్టిస్తాయి. కాకపోతే పెద్దమొత్తంలో ఉత్పత్తి చేస్తాయి. ఇవి ప్రత్యేకమైన కణాల సాయంతో సోడియం, పొటాషియం అయాన్లను వేగంగా పంప్ చేస్తాయి. ఇవి విద్యుత్తు అవయవం పొరల నుంచి బయటకు వచ్చే క్రమంలో విద్యుత్తు ప్రవాహంగా మారతాయి. దీంతోనే శత్రువులను బెదర గొడతాయి. ఆహారాన్ని వేటాడతాయి. తీరు ఏదైతేనేం? ఈల్ చేపలు విద్యుత్తు పుట్టించే మాట నిజం. వీటిని అనుకరించే ప్రయత్నంలో బ్యాటరీల రూపకల్పనకు బీజం పడ్డ మాట నిజం. వోల్టా మాదిరిగానే ఇప్పుడు అమెరికా, స్విట్జర్లాండ్ పరిశోధకులు కూడా ఈల్ చేపల స్ఫూర్తితో బ్యాటరీ పరిజ్ఞానాలను రూపొందించారు. మృదువైన, తేలికగా వంగే తమ బ్యాటరీ ఏదో ఒకనాడు శరీరంలో అమర్చే పరికరాలకు, మెత్తటి రోబోలకు ఉపయోగపడగలదనీ భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. -
బొగ్గు దాణా!
బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM