వేలిముద్రల పరిజ్ఞాన మార్గదర్శి
ధన, కనక, వస్తువులనే కాదు.. ఆంగ్లేయులు మన మేధా సంపత్తులనూ దోచుకున్నారు. మన శాస్త్రవేత్తల ఆవిష్కరణలను తమవిగా ప్రచారం చేసుకోవటానికీ వెనకాడలేదు.
ఖాన్ బహదూర్ ఖాజీ అజిజుల్ హఖ్
ధన, కనక, వస్తువులనే కాదు.. ఆంగ్లేయులు మన మేధా సంపత్తులనూ దోచుకున్నారు. మన శాస్త్రవేత్తల ఆవిష్కరణలను తమవిగా ప్రచారం చేసుకోవటానికీ వెనకాడలేదు. దీంతో సర్ జగదీశ్ చంద్రబోస్, రాధానాథ్ సిక్దర్, కిశోరీ మోహన్ బంధోపాధ్యాయ్, హేమంత బోస్ వంటి ఎంతోమంది శాస్త్రవేత్తలకు లభించాల్సిన గౌరవం, గుర్తింపు దక్కకుండా పోయాయి. ఖాన్ బహదూర్ ఖాజీ అజిజుల్ హఖ్ సైతం ఇలా అన్యాయానికి గురైనవారే. వేలిముద్రల పరిజ్ఞానాన్ని ఆవిష్కరించినవారిలో ఆయన ఒకరు. కానీ ఆ కీర్తి ఆంగ్లేయుడైన సర్ ఎడ్వర్డ్ రిచర్డ్ హెన్రీకి దక్కింది. ఇది ఖాన్ బహదూర్ ఖాజీ అజిజుల్ హఖ్ 150వ జయంతి. ఈ సందర్భంగా ఆయన గురించి, ఆయన కృష్టి గురించి తెలుసుకుందాం.
ఖాన్ బహదూర్ ఖాజీ అజిజుల్ హఖ్ 1872లో బెంగాల్ ప్రెసిడెన్సీలోని ఖులానా జిల్లా పైగ్రామ్ కస్బా గ్రామంలో (ప్రస్తుత బంగ్లాదేశ్) జన్మించారు. చిన్నతనంలోనే ఆయన తల్లిదండ్రులు పడవ ప్రమాదంలో మరణించారు. కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. పెద్దన్నయ్య ఇంటి బాధ్యతలు తీసుకున్నాడు. హఖ్కు లెక్కలంటే చాలా ఇష్టం. తిండి ప్రియుడు కూడా. ఒకరోజు అన్నయ్య పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. హఖ్కు పెట్టిందే కాదు, తన పళ్లెంలోంచీ బాగానే తినేయటంతో తమ్ముడి మీద కోప్పడి, తోసేశాడు. దీన్ని అవమానంగా భావించిన హఖ్ ఇల్లు విడిచి వచ్చేశారు. రైలు ఎక్కి 1884లో కలకత్తాకు చేరుకున్నాడు. అతడి స్థితిని చూసి ఒక ధనవంతుడు చేరదీశాడు. ఇంటి పనులు చేస్తూ, హఖ్ అక్కడే ఉండేవాడు. పిల్లలకు మాస్టారు చదువు చెబుతుంటే పక్కనే కూర్చొని శ్రద్ధగా వినేవాడు. అలా లెక్కలు బాగా చేయటం నేర్చుకున్నాడు. దీనికి ఆశ్చర్యపోయిన మాస్టారు ఆ విషయాన్ని ఇంటి యజమానికి చెప్పాడు. ఆయన హఖ్ వివరాలు తెలుసుకొని, స్కూలుకు పంపించాడు. అలా ప్రఖ్యాత ప్రెసెడెన్సీ కాలేజీలో చేరాడు. గణితం, సైన్స్లో ప్రావీణ్యం సంపాదించాడు.
పోలీసు బాధ్యతల్లో భాగంగా..
అప్పట్లో సర్ ఎడ్వర్డ్ రిచర్డ్ హెన్రీ బెంగాల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్గా ఉండేవారు. సాంఖ్యక శాస్త్రం, సైన్స్ తెలిసిన ఒక విద్యార్థిని సూచించమని ప్రిన్సిపల్కు ఉత్తరం రాశాడు. ఆయన వెంటనే హఖ్ పేరును సిఫారసు చేశారు. అలా హఖ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరాడు. ఆయనతో పాటు హేమంత బోస్ కూడా చేరాడు. అప్పటివరకు నేరగాళ్లను గుర్తించటానికి శరీర భాగాల నిష్పత్తి కొలతల (ఆంత్రోపామెట్రీ) మీద ఆధారపడేవారు. దీని స్థానంలో వేలి ముద్రలను ప్రవేశపెట్టాలని హెన్రీ భావించారు. ఇందుకోసం ఫింగర్ ప్రింట్స్ బ్యూరోను ఆరంభించారు. వేలి ముద్రలను గుర్తించే సిస్టమ్ను రూపొందించటం మీద పనిచేయాలని హఖ్, బోస్లను హెన్రీ పురమాయించాడు. దీనికి హఖ్ గణిశాస్త్ర పునాదిని వేయగా, బోస్ టెలిగ్రాఫిక్ సంకేతాన్ని అందించారు. ఇదే చివరికి వేలి ముద్రలకు సంబంధించిన ‘హెన్రీ క్లాసిఫికేషన్ సిస్టమ్’గా పేరొందింది. దీన్ని మొదట్లో బెంగాల్ పోలీస్ విభాగంలో అమలు చేశారు. బాగా ఉపయోగపడుతుండటంతో దేశమంతటా విస్తరించారు. అప్పటికి హెన్రీ ప్రముఖ వ్యక్తి. తన క్లాసిఫికేషన్ వ్యవస్థ మీద పరిశోధన సదస్సుల్లో ప్రసంగించటం, పుస్తకాలు రాయటం మొదలెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని హఖ్ తదనంతర పరిశోధన నుంచి వైదొలిగారు. బెంగాల్ ప్రెసిడెన్సీ నుంచి బిహార్ వేరయ్యాక బిహార్ పోలీస్ సర్వీస్లో చేరారు. ఉద్యోగ విరమణ దశలో తన కృషి గురించి ప్రభుత్వానికి నివేదించారు. ‘ద స్టేట్స్మన్’ పత్రికలో తన ప్రస్తావనతో కూడిన కథనాన్ని అందులో చేర్చారు. ప్రభుత్వం దాన్ని తిరస్కరించటమే కాదు, చివరికి హెన్రీకే దాన్ని సిఫారసు చేసింది. అప్పటికి ఆయన వయసు మీరిందేమో మనసూ మారింది. వేలిముద్రల క్లాసిఫికేషన్ సిస్టమ్లో అందరికన్నా ఎక్కువగా కృషి చేసింది హఖేనని ఎట్టకేలకు అంగీకరించారు. ఈ పద్ధతి కాల పరీక్షకు నెగ్గిందని, చాలా దేశాల అంగీకారాన్ని పొందిందని మెచ్చుకున్నారు. అలా హఖ్కు తగిన గుర్తింపు, గౌరవ వేతనం లభించాయి. తర్వాత బోస్కూ ఇలాంటి గౌరవమే దక్కింది.
సొంత గణిత సూత్రంతో..
వేలి ముద్రల తీరుతెన్నుల మీద ప్రత్యేకంగా అధ్యయనం చేయటం యూరప్లో 1600ల మధ్యలో ఆరంభమైంది. కానీ వీటిని వ్యక్తులను గుర్తించటానికి వాడుకోవటం 19వ శతాబ్దం మధ్యలో గానీ మొదలు కాలేదు. వేలిముద్రలు కొంతకాలం వరకు స్థిరంగా ఉంటున్నాయని, ఇవి ఒకరిలో ఒకోలా ఉంటున్నాయని సర్ విలియం జేమ్స్ హెర్షల్ 1859లో గుర్తించారు. హుగ్లీ జిల్లాలో ప్రధాన న్యాయమూర్తి కూడా అయిన ఆయన తొలిసారిగా వేలి ముద్రలను వ్యక్తులను గుర్తించటానికి, న్యాయ పత్రాల మీద సంతకాలకు, లావాదేవీల ధ్రువీకరణకు వాడుకున్నారు. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ 1892లో ‘ఫింగర్ ప్రింట్స్’ అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో ప్రధానమైన మూడు రకాల వేలిముద్రల గురించి ప్రస్తావించారు. నేరగాళ్లను గుర్తించటానికి వీటిని వాడుకోవాలని హెన్రీ అనుకున్నారు. అయితే గాల్టన్ ప్రతిపాదించిన వ్యవస్థ హఖ్కు పూర్తిగా సంతృప్తి కలిగించలేదు. వేలి ముద్రలను వాటి తీరును బట్టి 32 నిలువు వరుసలు, 32 అడ్డం వరుసల్లో విభజించి ‘1024 పీజియన్హోల్స్’ సిద్ధాంతంలో ఇమిడేలా సొంత గణిత సూత్రాన్ని రూపొందించారు. దీని ఆలోచన యాదృచ్ఛికంగా పుట్టుకురావటం విశేషం. హఖ్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో వేలి ముద్రల వర్గీకరణకు సంబంధించిన ఆలోచన తళుక్కున మెరిసింది. దాన్ని రాసుకోవటానికి దగ్గర కాగితం కూడా లేదు. దీంతో ఆయన చొక్కా మీదే రాసుకున్నారు. ఆంత్రోపామెట్రీ కన్నా హఖ్ రూపొందించిన సూత్రం మెరుగ్గా పనిచేస్తుండటంతో హెన్రీ బ్రిటన్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అలా నేరగాళ్లను గుర్తించటానికి వేలి ముద్రలు కొత్త సాధనంగా మారిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. -
బొగ్గు దాణా!
బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్