అతి చిన్న స్పెక్ట్రోమీటర్
మైక్రోచిప్ మీద అమర్చటానికి వీలైన అత్యంత శక్తిమంతమైన, అతి పలుచటి స్పెక్ట్రోమీటర్ను శాస్త్రవేత్తలు రూపొందించారు.
మైక్రోచిప్ మీద అమర్చటానికి వీలైన అత్యంత శక్తిమంతమైన, అతి పలుచటి స్పెక్ట్రోమీటర్ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది కృత్రిమ మేధ సాయంతో పనిచేస్తుండటం గమనార్హం. కాంతిని విశ్లేషించటానికి, తరంగ దైర్ఘ్యాలను గణించటానికి తోడ్పడే స్పెక్ట్రోమీటర్లను ఖగోళం దగ్గర్నుంచి వజ్రాల వరకూ వివిధ రంగాల్లో ఉపయోగి స్తుంటారు. ఇవి కాంతిని గ్రహించి, దాన్ని వర్ణపటం భాగాలుగా విడగొడతాయి. తరంగదైర్ఘ్య సంకేతాలుగా డిజిటల్ రూపంలోకి మార్చి విశ్లేషిస్తాయి. వాటిని కంప్యూటర్ తెర మీద కనిపించేలా చేస్తాయి. కాకపోతే ఇవి చాలా పెద్దగా ఉంటాయి. ఖరీదూ ఎక్కువే. తాజా స్పెక్ట్రోమీటర్ దీనికి భిన్నం. అతి చిన్నగా ఉండటం వల్ల దీన్ని స్మార్ట్ఫోన్లోనూ అమర్చొచ్చు. దీంతో ఫోన్తోనే కొన్నిరకాల వైద్య పరీక్షలూ చేయొచ్చు. చుట్టుపక్కల పరిస్థితులను స్కాన్ చేసి, వాతావరణ స్థితిగతులనూ తెలుసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Odisha: ఏఎస్సై కాల్పుల ఘటన.. తూటా గాయాలతో ఒడిశా ఆరోగ్య మంత్రి కన్నుమూత
-
World News
Pakistan: పౌరులకు పాకిస్థాన్ షాక్.. పెట్రోల్పై ఒకేసారి రూ.35 పెంపు!
-
Sports News
U 19 World Cup: అండర్ - 19 మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా టీమ్ఇండియా
-
General News
Ts News: గుజరాత్లో పంచాయతీ సర్వీస్ పరీక్ష పేపర్ లీక్.. హైదరాబాద్లో ముగ్గురి అరెస్టు
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!