చాలా వస్తున్నాయ్... వెయిట్ చేయండి
గతేడాది కొవిడ్-19 ప్రభావంతో మార్కెట్లు మందగించినప్పటికీ సరికొత్త ఆవిష్కరణలతో టెక్ కంపెనీలు గ్యాడ్జెట్ ప్రియులను ఆకట్టుకున్నాయి. అలానే రాబోయే రోజుల్లో వివిధ విభాగాల్లో మరొకొన్ని కొత్త మొబైల్స్ మార్కెట్లోకి రానున్నాయి....
ఇంటర్నెట్ డెస్క్: గతేడాది కొవిడ్-19 ప్రభావంతో మార్కెట్లు మందగించినప్పటికీ సరికొత్త ఆవిష్కరణలతో టెక్ కంపెనీలు గ్యాడ్జెట్ ప్రియులను ఆకట్టుకున్నాయి. కొత్త సంవత్సరంలో కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ జనవరి నెలలో బడ్జెట్, మిండ్ రేంజ్, 5జీ, ఫ్లాగ్షిప్ మోడళ్లను తీసుకొచ్చాయి మొబైల్ కంపెనీలు. అలానే రాబోయే రోజుల్లో వివిధ విభాగాల్లో మరికొన్ని కొత్త మొబైల్స్ మార్కెట్లోకి రానున్నాయి. అవేంటో.. వాటిలో ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారు.. ఎప్పుడు విడుదల చేస్తారో ఒక్కసారి చూద్దాం. ఇన్ని మొబైల్స్ వస్తున్నాయ్ కాబట్టి కొత్త ఫోన్ కొందామంటే వెయిట్ చేయొచ్చేమో!
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ సిరీస్లో కొత్త మోడల్ను తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్లో గెలాక్సీ ఎఫ్ 41 ఫోన్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలో దానికి కొనసాగింపుగా గెలాక్సీ ఎఫ్62 మోడల్ రానుంది. ఫిబ్రవరి 15న భారత మార్కెట్లోకి విడుదల చేస్తారని సమాచారం. ఈ ఫోన్లో ఎక్సినోస్ 9825 ప్రాసెసర్ ఉపయోగించారు. 6.7-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ 3.1 ఓఎస్తో పనిచేస్తుంది. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. క్వాడ్ కెమెరా ఉన్న ఈ ఫోన్లో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా అందిస్తున్నారు. సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ రీడర్ ఉంటుంది. 8జీబీ/128జీబీ వేరియంట్ ధర రూ. 25,000 ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.
నోకియా 5.4
హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా 5.4 మోడల్ను ఫిబ్రవరి 10న భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ ఫోన్ 4జీబీ/ 64జీబీ, 4జీబీ/128జీబీ, 6జీబీ/64జీబీ వేరియంట్లో లభిస్తుందని సమాచారం. దీని ప్రారంభ ధర రూ.16,000 ఉంటుందని అంచనా. ఆండ్రాయిడ్ 10తో పనిచేసే ఈ ఫోన్లో 6.39 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ ఉపయోగించారు. వెనుకవైపు గుండ్రటి డిజైన్ ఆకృతిలో 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు నాలుగు కెమెరాలు ఇస్తున్నారు. ముందు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. అద్భుతమైన ఆడియో అనుభూతి కోసం ఓజో ఆడియోతో రెండు మైక్రోఫోన్లు ఉన్నాయి. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది.
వన్ప్లస్ 9 ప్రో
(Photo Credit: Dave2D)
9 ప్రో పేరుతో వన్ప్లస్ కంపెనీ మరో కొత్త ఫ్లాగ్షిప్ మోడల్ను తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను డేవ్2డీ అనే యూట్యూబ్ ఛానెల్ వెల్లడించింది. ఇందులో రెండు పెద్ద కెమెరాలతో పాటు రెండు సాధారణ కెమెరాలు ఇస్తున్నారు. అంటే వెనుకవైపు మొత్తం నాలుగు కెమెరాలు ఉంటాయన్నమాట. ఈ ఫోన్లో కెమెరాల కోసం వన్ప్లస్ కంపెనీ స్వీడన్కు చెందిన హ్యాసెల్బ్లాడ్తో కలిసి పనిచేసింది. ఇందులో ఎల్ఈడీ ఫ్లాష్, లేజర్ ఆటోఫోకస్ ఉన్నాయి. 129Hz రిఫ్రెష్ రేట్తో క్యూహెచ్డీ+ డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉపయోగించారు. 12జీబీ /256 జీబీ వేరియంట్లో ఈ ఫోన్ లభిస్తుంది.
వివో ఐక్యూఓఓ నియో5
మార్చి నెలలో వివో కంపెనీ కూడా కొత్త మోడల్ ఫోన్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వి2055ఏ పేరుతో ఈ మోడల్ వివరాలు గూగుల్ ప్లే కన్సోల్లో నమోదైనట్లు టెక్ వర్గాలు తెలిపాయి. ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ను ఉపయోగించారని సమాచారం. ఆండ్రాయిడ్ 11 ఓఎస్తో పనిచేస్తుందట. 8జీబీ /128జీబీ, 12జీబీ ర్యామ్/ 256జీబీ వేరియంట్లలో తీసుకొస్తున్నారని తెలుస్తోంది. 2400x1080 పిక్సెల్ రిజల్యూషన్తో అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారట. అలానే 88 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందట.
మోటోరోలా ఇబిజా
మోటోరోలా కంపెనీ తొలి బడ్జెట్ 5జీ ఫోన్ మార్చి నెలలో భారత మార్కెట్లోకి తీసుకురానుంది. మోటోరోలా ఇబిజా పేరుతో ఈ ఫోన్ విడుదల కానుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఓఎస్తో పనిచేస్తుంది. 90Hz రిఫ్రెష్ రేటుతో హెచ్డీ+ డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్ను ఉపయోగించారు. మొత్తం నాలుగు కెమెరాలు ఉంటాయి. వెనుకవైపు 48 ఎంపీ ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం 13 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 4జీబీ/ 128జీబీ, 6జీబీ/128జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ధర గురించి తెలియాల్సి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ52
(Photo Credit: Oneleaks Voice)
గతంలో విడుదల చేసిన గెలాక్సీ ఏ51 మోడల్కు కొనసాగింపుగా శాంసంగ్ కంపెనీ మరో కొత్త మోడల్ను తీసుకొస్తోంది. గెలాక్సీ ఏ52 పేరుతో రానున్న ఈ ఫోన్ వన్ప్లస్ నార్డ్, రియల్మీ ఎక్స్7లతో పోటీపడనుంది. మార్చిలో ఈ ఫోన్ను విడుదలచేయనున్నారు. 5జీ, 4జీ వేరియంట్లలో లభిస్తుందని సమాచారం. పంచ్ హోల్ కటౌట్తో 6.52 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్డ్రాగన్ 750జీ ప్రాసెసర్ ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్యూఐ 3.0 ఓఎస్తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు అల్ట్రా-వైడ్, మాక్రో, డెప్త్ సెన్సర్ కెమెరాలు ఇస్తున్నారు. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. 6జీబీ / 128జీబీ వేరియంట్లో తీసుకొస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ.40,000 ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.
వివో ఎస్9 & ఎస్7టీ 5జీ
వివో కంపెనీ ఎస్ సిరీస్లో రెండు 5జీ ఫోన్లను తీసుకొస్తోంది. ఎస్9, ఎస్7టీ పేరుతో వీటిని విడుదల చేయనున్నారు. ఎస్9 మోడల్లో 90Hz రిఫ్రెష్ రేట్తో ఫుల్ హెచ్డీ ఓఎల్ఈడీ డిస్ప్లే ఇస్తున్నారట. ఆండ్రాయిడ్ 11 ఓఎస్తో పనిచేస్తుందని సమాచారం. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేయనుంది. సెల్ఫీల కోసం 44 ఎంపీ కెమెరా, వెనక వైపు 64 ఎంపీ డిజిటల్ కెమెరా ఇస్తున్నారట. మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ప్రాసెసర్ ఉపయోగించారని తెలుస్తోంది. 12జీబీ /256 జీబీ వేరియంట్లో తీసుకొస్తున్నారని సమాచారం.
ఎస్7టీలో 6.44-అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 820 ప్రాసెసర్ ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఓఎస్తో పనిచేస్తుంది. వెనుకవైపు 64 ఎంపీ, సెల్ఫీల కోసం 44+8 డ్యూయల్ కెమెరాలు అమర్చినట్లు సమాచారం. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. 8జీబీ/ 128జీబీ ధర రూ. 30వేలు పైనే ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.
ఒప్పో ఎఫ్19
ఒప్పో కూడా ఎఫ్ 19 సిరీస్లో రెండు కొత్త ఫోన్లను మార్చి నెలలో మార్కెట్లోకి విడుదల చేయనుంది. గతేడాది సెప్టెంబర్ నెలలో విడుదల చేసిన ఎస్17 మోడల్కు కొనసాగింపుగా ఎఫ్19, ఎఫ్19 ప్రో ఫోన్లను తీసుకొస్తున్నారు. వీటిలో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఇస్తున్నారట. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 64 ఎంపీ/48 ఎంపీ కలయికలో ట్రిపుల్ లేదా క్వాడ్ కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ ఫోన్కు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ12
మధ్యశ్రేణి మార్కెట్ కోసం శాంసంగ్ గెలాక్సీ ఏ12 మోడల్ను వచ్చే వారంలో భారత్లో విడుదల చేయనుంది. మొత్తం మూడు వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. 3జీబీ/ 32జీబీ, 4జీబీ /64జీబీ, 6జీబీ /128జీబీ వేరియంట్లో తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 16,000 ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఈ ఫోన్లో ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉపయోగించారు. 6.5 అంగుళాల హెచ్డీ+ ఇన్ఫినిటీ-వి డిస్ప్లే ఇస్తున్నారు. ఇందులో మొత్తం ఐదు కెమెరాలున్నాయి. వెనుకవైపు 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 5 ఎంపీ అల్ట్రా- వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ కెమెరాలు రెండు ఇస్తున్నారు. ముందు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉండనుంది.
ఐఫోన్ ఎస్ఈ3
గతేడాది ఎస్ఈ సిరీస్లో యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 2 మోడల్ను తీసుకొచ్చింది. ఇందులో బయోనిక్ ఏ13 ప్రాసెసర్ను ఉపయోగించారు. అయితే డిస్ప్లే, కెమెరాలో పెద్దగా మార్పులు లేకపోవడంతో యూజర్స్ నిరాశ చెందారు. దీంతో ఐఫోన్ ఎస్ఈ3 మోడల్లో కీలక మార్పులు చేయనున్నట్లు టెక్ వర్గాల సమాచారం. ఈ మేరకు ఎస్ఈ3లో 6.1 అంగుళాల ఎల్సీడీ నాచ్ డిస్ప్లే ఇవ్వనున్నారట. 120 డిగ్రీ అల్ట్రా-వైడ్ యాంగిల్ రెండు 12 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారట. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ని కూడా సపోర్ట్ చేస్తుందట. బయోనిక్ ఏ14 ప్రాసెసర్ను ఉపయోగిస్తారని సమాచారం. 5జీ సపోర్ట్ చేస్తుందట. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుందని తెలుస్తోంది. 2022 నాటికి ఈ మోడల్ని విడుదల చేస్తారని మార్కెట్లో వర్గాల అంచనా.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
కంప్యూటర్కు బుర్ర!
మన మెదడు అద్భుతమైంది. హేతుబద్ధంగా వ్యవహరిస్తుంది. కార్య కారణాలను విశ్లేషించి ఒక నిర్ణయానికి వస్తుంది. ఉచితానుచితాలను బేరీజు వేస్తుంది. ఏ పని ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో పసిగడుతుంది. -
ఫోన్ ట్యాప్ అయ్యిందా?
నేటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రత అతి కీలకమయ్యాయి. అధునాతన నిఘా పద్ధతుల నేపథ్యంలో ఇవి మరింత ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి. నిత్య జీవితంలో విడదీయలేని పరికరంగా మారిన ఫోన్ల మీదా నిఘా వేయటం, ట్యాపింగ్ చేయటమూ చూస్తున్నాం. -
రోబో సేవలు చేసేనే..
మనిషికి మనిషి తోడంటారు. ఇప్పుడు మర మనిషీ (రోబో) చేయందిస్తోంది. ఒకపక్క అధునాతన హ్యూమనాయిడ్ రోబోల వెల్లువ సంచలనం సృష్టిస్తుండగా.. మరోపక్క మామూలు రోబోలూ సేవలకు సిద్ధమవుతున్నాయి. -
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది. -
గాజు బిందువు ఇంద్రజాలం
ఎప్పుడైనా గాజు కన్నీటి చుక్కల గురించి విన్నారా? అవి స్టీలు కన్నా దృఢంగా ఉంటే? బుల్లెట్ దెబ్బనైనా తట్టుకుంటే? సైన్స్ సూత్రాలనూ ధిక్కరిస్తే? అంత విచిత్రమైన గాజు బిందువు లేంటని అనుకుంటున్నారా? అవే ప్రిన్స్ రూపర్ట్స్ డ్రాప్స్.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ