Smartphone Technology: 2022 స్మార్ట్ఫోన్ మోడల్స్.. ఎలాంటిఫీచర్లతో వస్తాయంటే..!
2022లో స్మార్ట్ఫోన్లలో ఫీచర్స్ పరంగా కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ ఏడాది యూజర్స్ఖు అందుబాటులోకి రానున్న మొబైల్ ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.
ఇంటర్నెట్డెస్క్: కొత్త ఒక వింత.. పాత ఒక రోత అన్నట్లుగా ఉంటాయి ప్రతి ఏడాది మార్కెట్లోకి వచ్చే స్మార్ట్ఫోన్ మోడల్స్. మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడళ్లను తీసుకొస్తూ యూజర్స్ను ఆకట్టుకుంటున్నాయి. అలా 2021లో స్మార్ట్ఫోన్ మోడళ్లలో ఎన్నో రకాల మార్పులు చోటుచేసుకున్నాయి. మరి 2021 ముగిసి.. 2022లోకి వచ్చేశాం. కొత్త ఏడాదిలో స్మార్ట్ఫోన్లలో రాబోతున్న కొత్త ఫీచర్లు, మార్పులపై ఓ లుక్కేద్దాం.
5జీ కనెక్టివిటీ
దశాబ్ద కాలం నిరీక్షణకు తెరదించుతూ 2022లో భారత్లోని 13 ప్రధాన నగరాల్లో (హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, లఖ్నవూ, ముంబయి, పుణె, అహ్మదాబాద్, చండీగఢ్, దిల్లీ, గాంధీనగర్, గుర్గావ్, జామ్నగర్, కోల్కతా) 5జీ నెట్వర్క్ అందుబాటులోకి రానున్నట్లు టెలికాం విభాగం (డాట్) తెలిపింది. మొబైల్ నెట్వర్క్ టెక్నాలజీలో విప్లవాత్మకమైన సాంకేతికతగా చెప్పుకొనే 5జీ నెట్వర్క్ భారత్లో అందుబాటులోకి రానుండటం కొత్త ఏడాదిలో మొబైల్ ఫోన్ రంగంలో పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు. గతేడాది నుంచే మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు 5జీ సాంకేతికతతో కూడిన ఫోన్లలను మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించాయి. 2022లో విడుదలయ్యే అన్ని మోడల్స్ 5జీ నెట్వర్క్ను సపోర్ట్ చేస్తాయని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే
గతేడాదిలో వచ్చిన మొబైల్ డిస్ప్లేలలో 60 హెర్జ్ రిఫ్రెష్ రేట్ నుంచి 144 హెర్జ్ రిఫ్రెష్ రేట్తో వచ్చాయి. వీటిలో 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లేలే ఎక్కువగా ఉన్నాయి. అయితే 2022లో 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో ఎక్కువ ఫోన్లు రానున్నాయి. ఇప్పటికే షావోమి, వన్ప్లస్, రియల్మీ, ఐక్యూ వంటి మొబైల్ కంపెనీలు కొత్త ఏడాదిలో విడుదల చేయబోయే మోడల్స్లో హై రిజల్యూషన్ డిస్ప్లే ఇస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో 2022లో 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్ సాధారణ కేటగిరిలో, 120 హెర్జ్ స్టాండర్డ్లో, 144 హెర్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ప్రీమియం ఫోన్లలో ఇస్తారని టెక్ వర్గాల అంచనా.
పంచ్ హోల్ & అండర్ డిస్ప్లే
ఇప్పటి వరకు విడుదలైన ఫోన్లలో ఎక్కువ శాతం నాచ్, వాటర్ డ్రాప్ డిస్ప్లేతో వచ్చాయి. తర్వాత పంచ్ డిప్ప్లేతో స్మార్ట్ఫోన్లు విడుదలయ్యాయి. దీంతో 2022లో పంచ్ హోల్ డిస్ప్లే మొబైల్ ఇండస్ట్రీ స్టాండర్డ్గా టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం మొబైల్ తయారీ కంపెనీలు నాచ్, డ్యూ డ్రాప్/వాటర్ డ్రాప్, పంచ్ హోల్ డిస్ప్లే రకాలను ఉపయోగిస్తున్నాయి. అయితే త్వరలో మొబైల్ కంపెనీలు విడుదల చేసే ఫోన్లలో ఎక్కువగా పంచ్ హోల్ డిస్ప్లేకే మొగ్గు చూపుతున్నాయట. ఈ డిస్ప్లే వల్ల స్క్రీన్లో ఎక్కువ భాగం డిస్ప్లే ఉంటుంది. యాపిల్ కంపెనీ 2022లో విడుదల చేయబోయే ఐఫోన్ 14 సిరీస్లో నాచ్ డిస్ప్లే స్థానంలో పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుందని సమాచారం. వీటితోపాటు 2022లో కెమెరా అండర్ డిప్ప్లే ఫోన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.
మరిన్ని మడత ఫోన్లు
2022లో మొబైల్ మార్కెట్లో మడత ఫోన్లు ఎక్కువగా రానున్నాయి. ఈ సెగ్మెంట్లో ముందు వరుసలో ఉన్న శాంసంగ్, మోటోరోలా, ఎల్జీ కంపెనీలకు పోటీగా షావోమి, రియల్మీ, వివో, ఒప్పో వంటి కంపెనీలు మడత పోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం శాంసంగ్ ఫోల్డింగ్ ఫోన్ల ధర రూ.లక్ష పైనే ఉండటంతో, యూజర్స్ను ఆకర్షించేందుకు అంతకన్నా తక్కువ ధరకే కొత్త ఫోన్లలను విడుదల చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒప్పో తన తొలి మడత ఫోన్ ఫైండ్ఎన్ను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది.
కెమెరాలు
గతేడాది స్మార్ట్ఫోన్ కెమెరాల్లో ఎక్కువగా వెనుకవైపు మూడు కెమెరాలున్న మోడల్స్ వచ్చాయి. 2022లో వాటి స్థానంలో క్వాడ్ కెమెరా (నాలుగు కెమెరాలు) ఫీచర్ ప్రామాణికం కానుంది. వాటిలో ఒక కెమెరా 50 ఎంపీగా ఉండటం సర్వసాధారణం అవుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలానే 8 ఎంపీ, 16 ఎంపీగా ఉన్న సెల్ఫీ కెమెరాల స్థానంలో ఇక మీదట 32 ఎంపీ కెమెరాలు వస్తాయని అంచనా. ఇప్పటికే రూ.20 వేల లోపు ధరల్లో అందుబాటులో ఉన్న కొన్ని మోడల్స్లో 64 ఎంపీ, 50 ఎంపీ, 32 ఎంపీ సెల్ఫీ కెమెరాలను అమర్చారు. ఈ ఏడాదిలో విడుదలయ్యే మోడల్స్లో కెమెరా పరంగా మరింత మెరుగైన ఫీచర్స్ యూజర్స్కు అందుబాటులోకి రానున్నాయి.
ఫాస్ట్ బ్యాటరీ ఛార్జింగ్ సపోర్ట్
కొత్తగా స్మార్ట్ఫోన్ కొంటున్నామంటే ముందు చూసేది బ్యాటరీ. 2022లో విడుదలయ్యే మోడల్స్లో అదిరే బ్యాటరీ ఫీచర్స్ యూజర్స్కు పరిచయం కానున్నాయి. మొబైల్ కంపెనీలు. ఇప్పటి వరకు 50 వాట్, 60 వాట్గా ఉన్న బ్యాటరీ ఛార్జింగ్ సామర్థ్యాన్ని ఏకంగా 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు పెంచేశారు. దీంతో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ కేవలం 15 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. త్వరలో విడుదల కానున్న షావోమి 11ఐ సిరీస్ ఫోన్లలో 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని పరిచయం చేస్తోంది.
► Read latest Gadgets & Technology News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త సర్ఫేస్ ల్యాప్టాప్లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్ను ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్వర్డ్లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్వర్డ్ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్వర్డ్లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్ను అమ్ముతున్నారా?
ప్రింటర్తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్బాట్స్ను రూపొందించి సంచలనం సృష్టించారు. -
ఫోన్ బ్యాటరీ ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది?
స్మార్ట్ఫోన్ బ్యాటరీ పూర్తిగా.. అంటే 0 నుంచి 100% వరకు ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది? ఎవరు లెక్కపెట్టొచ్చారని పెదవి విరవకండి. దీని గురించి తెలిస్తే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నేలా కాపాడుకోవచ్చు మరి -
చిటికెలో పీసీ లాక్
పీసీ మీద ముఖ్యమైన పని చేస్తున్నారు. అదేమో అత్యంత రహస్యమైంది. అంతలో ఎవరైనా వస్తే? లేదూ ఎవరైనా వెనక నుంచి చేస్తున్న పనిని చూస్తున్నారని అనుమానం వస్తే? ఇలాంటి సమయంలో చిటికెలో పీసీని లాక్ చేసే సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. -
పీసీ వేగానికి
-
ఫోన్ డిటాక్స్
ఆరోగ్యంగా ఉండటానికి ఉపవాసం చేసినట్టుగా స్మార్ట్ఫోన్లకూ అప్పుడప్పుడు విశ్రాంతి ఇవ్వటం మంచిది. ఇది డిజిటల్ డిటాక్స్కు బాగా ఉపయోగపడుతుంది. ఫోన్కు బానిసలు కాకుండా కాపాడుతుంది. కానీ మనసు మాట వినటం లేదంటారా? అయితే సెటింగ్స్లోనే మార్పులు చేసుకొని చూడండి. వీటితో నిర్ణీత సమయం మేరకైనా ఫోన్లకు విశ్రాంతి ఇవ్వచ్చు. -
ఇమేజ్లోంచీ అక్షరాలు కాపీ
ఇమేజ్లోనో, వీడియోలోనో టెక్స్ట్ సందేశం ఆకట్టుకోవచ్చు. దాన్ని టైప్ చేసుకోవాలనీ అనిపించొచ్చు. అంత కష్టం ఎందుకు? కాపీ చేస్తే పోలా. -
కంటెంట్ మాత్రమే ప్రింట్
డిజిటల్ డాక్యుమెంట్లు ప్రామాణికంగా మారిపోతున్న రోజులివి. ఇందుకోసం బ్రౌజర్లో తరచూ ప్రింట్ ఆప్షన్తో పీడీఎఫ్లను సృష్టించుకుంటూనే ఉంటాం.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్