త్వరలో మైక్రోమ్యాక్స్‌ 5జీ మొబైల్‌

ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చిన దేశీయ మొబైల్‌ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్‌ శుక్రవారం ఓ కీలక ప్రకటన చేసింది. సరికొత్త హంగులతో ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో 5జీ మొబైల్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తామని ప్రకటించింది. ధర కూడా అందుబాటులోనే ఉంటుందని ఆ సంస్థ... 

Published : 26 Feb 2021 23:10 IST

దిల్లీ: ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చిన దేశీయ మొబైల్‌ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్‌ శుక్రవారం ఓ కీలక ప్రకటన చేసింది. సరికొత్త హంగులతో ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో 5జీ మొబైల్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తామని ప్రకటించింది. ధర కూడా అందుబాటులోనే ఉంటుందని ఆ సంస్థ సహా వ్యవస్థాపకుడు రాహుల్‌ శర్మ పేర్కొన్నారు. అలాగే ఇయర్‌ఫోన్స్‌ను కూడా (టీడబ్ల్యూస్‌ ఇయర్‌ బడ్స్‌) త్వరలో తీసుకొస్తామని వెల్లడించారు.

5జీ నెట్‌వర్క్‌పై ప్రజలు ఎంతో ఆసక్తితో ఉన్నారని, అందుకే 5జీ స్మా్ర్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు తమ కంపెనీ పనిచేస్తోందని రాహుల్‌ శర్మ తెలిపారు. ఏప్రిల్‌లో మైక్రోమ్యాక్స్‌ నుంచి మరో మొబైల్‌ రానుందన్నారు. ప్రసుత్తం నెలకు 2 మిలియన్ల స్మార్ట్‌ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నామని, ఈ సామర్థ్యాన్ని 3 మిలియన్లకు పెంచేలా తమ బృందం కృషి చేస్తోందని తెలిపారు. అలాగే అమ్మకాలు పెంచేలా వచ్చే వారం నుంచి 15 రాష్ట్రాల్లో 18 వేల మైక్రోమ్యాక్స్‌ రిటైల్‌ కౌంటర్లు అందుబాటులోకి వస్తాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని