Motoroal Edge 20 Series: విడుదలకు ముందే ఫీచర్లు.. ధరెంతంటే?

కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసే ముందు వినయోగదారుల్లో ఆసక్తి రేకెత్తించేందుకు ఆయా కంపెనీలు వాటికి సంబంధించిన వివరాలను టిప్‌స్టర్ల ద్వారా ఒక్కొక్కటిగా వెల్లడిస్తాయి. ఇదే తరహాలో మోటోరోలా ఆగస్టు 17న విడుదల చేయనున్న మోటోరోలా ఎడ్జ్‌ 20, ఎడ్జ్‌ 20 ఫ్యూజన్‌ మోడల్స్‌ గురించిన సమాచారాన్ని లీక్ చేస్తూ వస్తోంది...

Updated : 05 Aug 2022 16:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసే ముందు వినియోగదారుల్లో ఆసక్తి రేకెత్తించేందుకు ఆయా కంపెనీలు వాటికి సంబంధించిన వివరాలను టిప్‌స్టర్ల ద్వారా ఒక్కొక్కటిగా వెల్లడిస్తాయి. ఇదే తరహాలో మోటోరోలా ఆగస్టు 17న విడుదల చేయనున్న మోటోరోలా ఎడ్జ్‌ 20, ఎడ్జ్‌ 20 ఫ్యూజన్‌ మోడల్స్‌ గురించిన సమాచారం బయటికొచ్చింది. ఈ ఫోన్ల విడుదల తేదీ, ఫీచర్లు గత వారమే బయటకు రాగా.. తాజాగా వాటి ధరకు సంబంధించిన వివరాలూ వెల్లడయ్యాయి. ఎడ్జ్‌ 20 మోడల్‌ను ఒకే వేరియంట్లో తీసుకొస్తుండగా, ఎడ్జ్ 20 ఫ్యూజన్‌ను రెండు వేరియంట్లలో తీసుకొస్తున్నారు. ఎడ్జ్‌ 20 8జీబీ ర్యామ్‌/128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 29,999 ఉంటుందని సమాచారం. ఇక ఎడ్జ్ 20 ఫ్యూజన్ 6జీబీ/128జీబీ ధర రూ.21,999, 8జీబీ/128జీబీ వేరియంట్ ధర రూ.23,999గా ఉంటుందని తెలుస్తోంది.    

ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో పనిచేస్తాయి. ఈ మోడల్స్‌లో వెనుకవైపు 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 16ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌, 8ఎంపీ టెలీఫొటో లెన్స్‌ ఇస్తున్నారు. అయితే ఫ్యూజన్ మోడల్‌లో 8ఎంపీ కెమెరా స్థానంలో 2 ఎంపీ కెమెరా ఉంటుంది. మందుభాగంలో సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా అమర్చారు. మోటోరోలా ఎడ్జ్‌ 20లో 144 Hz రిఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లే, ఎడ్జ్‌ 20 ప్యూజన్‌లో 90Hz రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఎడ్జ్‌ 20లో స్నాప్‌డ్రాగన్ 778జీ, ఫ్యూజన్‌లో డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఎడ్జ్‌లో 4,000 ఎంఏహెచ్‌, ఎడ్జ్‌ 20 ఫ్యూజన్‌లో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇవి 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. అలానే యూజర్స్ మొబైల్‌లోని యాప్‌లను పీసీలో ఉపయోగించుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని