Twitter: ట్విటర్ అల్గారిథమ్పై మస్క్ ట్వీట్, డోర్సే ఆసక్తికర రిప్లై!
ఇంటర్నెట్డెస్క్: ట్విటర్ కొనుగోలు చేసేందుకు 44 బిలియన్ డాలర్లతో మొగ్గు చూపిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. శుక్రవారం అనూహ్యంగా ప్రణాళికను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ట్విటర్లోని లోపాలను ఆయన మరోసారి ఎత్తి చూపారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో వినియోగానికి సబంధించి యూజర్లకు కీలక సూచన చేశారు. అయితే మస్క్ చేసిన ట్వీట్పై ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్ డోర్సే స్పందించారు. అసలేం జరిగిందంటే..
‘‘యూజర్లకు ముఖ్యమైన సూచన.. మీ ఫీడ్కు సంబంధించి అల్గారిథమ్తో ట్విటర్ మిమ్మల్ని ఏమారుస్తోంది. దానివల్ల యూజర్లు తాజా ట్వీట్లను చూడలేపోతున్నారు. దాన్ని సరి చేసుకునేందుకు ట్విటర్ హోమ్ బటన్పై క్లిక్ చేస్తే స్క్రీన్ పైభాగంలో కుడివైపున స్టార్స్ కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేస్తే లేటెస్ట్ ట్వీట్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీరు తాజా ట్వీట్లను చూడొచ్చు’’ అని మస్క్ ట్వీట్ చేశారు.
మస్క్ చేసిన ట్వీట్కు ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే రిప్లై ఇచ్చారు. ‘‘ట్విటర్ అల్గారిథమ్లో ఎలాంటి లోపాలు లేవు. యాప్ను ఉపయోగించనప్పుడు యూజర్ల సమయం ఆదా చేసేందుకు, చాలా కాలంగా ట్వీట్లు చూడని యూజర్ల కోసం అల్గారిథమ్ను అలా డిజైన్ చేశారు. తాజా ట్వీట్లు చూసేందుకు పేజ్ను రీఫ్రెష్ చేస్తే సరిపోతుంది’’ అని ట్వీట్ చేశారు. దీనికి మస్క్ రిప్లై ఇచ్చారు. ‘‘అల్గారిథమ్ గురించి నాకు ఎలాంటి దురాలోచనలేదు. మీరు ఏం అనుకుంటున్నారో దాన్నే చదువుతున్నారు. బహుశా ఇలా జరుగుతోందని మీకు తెలియకపోవచ్చు’’ అని చెప్పారు.
ట్విటర్ డీల్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మస్క్ ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఈ సంభాషణ జరగడం నెటిజన్లలో ఆసక్తిని కలిగించింది. మరోవైపు ట్విటర్లో నకిలీ/స్పామ్ ఖాతాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మస్క్ తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో నకిలీ/స్పామ్ ఖాతాల సంఖ్య 5 శాతం కన్నా తక్కువేనని కంపెనీ నివేదికలో పేర్కొన్నట్లు ఉన్న వార్తను ట్వీట్ చేశారు. అలానే నకిలీ/స్పామ్ ఖాతాలను గుర్తించేందుకు తమ బృందం 100 మంది యూజర్లను శాంపిల్ సైజ్గా ఎంచుకుని సర్వే నిర్వహిస్తున్నట్లు మస్క్ తెలిపారు. అయితే సర్వేకు సంబంధించి శాంపిల్ సైజ్ను బహిర్గతం చేయడం ద్వారా తాను ఎన్డీఏ నిబంధనలు ఉల్లంఘించానని ట్విటర్ న్యాయవాదులు తనకు లీగల్ నోటీసులు పంపినట్లు మస్క్ వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Lokesh Kanagaraj: సూర్య, కార్తిలతో ‘అయ్యప్పనుమ్ కోషియం’ చేస్తా: లోకేశ్ కనగరాజ్
-
Sports News
Scott Styris: భవిష్యత్తులో అతడిని టీమ్ఇండియా కెప్టెన్గా చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు: స్కాట్ స్టైరిస్
-
Technology News
Gift Ideas: రాఖీ పండగకి గిఫ్ట్ కొనాలా..? ₹5 వేల లోపు ధరలో ఉన్న వీటిపై ఓ లుక్కేయండి!
-
General News
Srisailam-Sagar: ఎగువ నుంచి వరద.. శ్రీశైలం, సాగర్ గేట్లు ఎత్తివేత
-
Movies News
AlluArjun: బన్నీ.. మీరు కెమెరా ముందుకొస్తే చాలు.. రూ.10 కోట్లు ఇస్తాం..!
-
India News
India Corona: దిల్లీలో 17.83 శాతానికి పాజిటివిటీ రేటు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Hanumakonda: రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- Rohit sharma: ఈ ప్లాన్తోనే భారత క్రికెట్కు మంచి భవిష్యత్ను అందిస్తాం: రోహిత్ శర్మ
- సెక్స్ కోరే అమ్మాయిలు వేశ్యలతో సమానం: నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు
- Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్ఖాన్
- Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
- Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?