OnePlus: నార్డ్‌ సిరీస్‌లో వన్‌ప్లస్‌ కొత్త 5జీ ఫోన్‌.. ఫీచర్లేంటి?

వన్‌ప్లస్ నార్డ్‌ సిరీస్‌లో కొత్త 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఈ ఫోన్‌లో ఎలాంటి పీచర్లున్నాయి, ధరెంత వంటి వివరాలు తెలుసుకుందాం. 

Published : 17 Feb 2022 22:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వన్‌ప్లస్‌ (OnePlus) కంపెనీ నార్డ్ సిరీస్‌లో మరో కొత్త 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వన్‌ప్లస్ నార్డ్‌ సీఈ-2 5జీ (OnePlus Nord CE 2 5G) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ను గతేడాది విడుదల చేసిన నార్డ్‌ సీఈ 5జీకి కొనసాగింపుగా తీసుకొచ్చారు. మరి ఈ ఫోన్‌ ఫీచర్లు, ధర, ఎక్కడ కొనుగోలు చేయొచ్చు వంటి వివరాల గురించి తెలుసుకుందాం.. 

వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ 2 5జీ ఫీచర్లు (OnePlus Nord CE 2 5G) 

ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌ 11తో పనిచేస్తుంది. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఫ్లూయిడ్ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్‌లో నాలుగు కెమెరాలున్నాయి. వెనుకవైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రా-వైడ్‌ యాంగిల్‌, 2 ఎంపీ కెమెరా ఉన్నాయి. ముందుభాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 65 వాట్ సూపర్‌ వూక్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6 జీబీ ర్యామ్‌/ 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.23,999. 8 జీబీ/128 జీబీ ధర రూ.24,999. ఫిబ్రవరి 22 నుంచి అమెజాన్‌, వన్‌ప్లస్ వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చేయొచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని