Samsung: గెలాక్సీ ‘A’ సిరీస్‌లో శాంసంగ్ కొత్త 5జీ ఫోన్‌.. వివరాలివే!

శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఏ సిరీస్‌లో కొత్త 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఈ ఫోన్‌ ఫీచర్లు, ధర వంటి వివరాలను తెలుసుకుందాం. 

Updated : 21 Mar 2022 17:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో 5జీ సేవలు ప్రారంభం కాకముందే మొబైల్‌ తయారీ కంపెనీలు 5జీ మోడల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. తాజాగా శాంసంగ్ (Samsung) కంపెనీ ‘A’ సిరీస్‌లో మరో కొత్త 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ ఏ53 5జీ (Samsung Galaxy A53 5G) పేరుతో వస్తున్న ఈ మోడల్‌ ఫీచర్లు, ధర వంటి వివరాలపై ఓ లుక్కేద్దాం. 

శాంసంగ్ గెలాక్సీ ఏ53 5జీ 

ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఓఎస్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే సూపర్‌ అమోలెడ్‌ ఇన్ఫీనిటీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆక్టాకోర్ ఎక్సినోస్‌ 1280 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గెలాక్సీ ఏ53 5జీలో మొత్తం ఐదు కెమెరాలున్నాయి. వెనుక నాలుగు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనుకవైపు 64 ఎంపీ పైమరీ కెమెరాతోపాటు, 12 ఎంపీ అల్ట్రా-వైడ్‌ యాంగిల్, రెండు 5 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందు భాగంలో 32 ఎంపీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 

శాంసంగ్‌ గెలాక్సీ ఏ53 5జీ ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6 జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 34,499. 8 జీబీ/128 జీబీ ధర రూ. 35,999. మార్చి 21 నుంచి 31వ తేదీ మధ్య ముందస్తు బుకింగ్  చేసుకున్న వినియోగదారులకు, మార్చి 25 నుంచి అమ్మకాలు ప్రారంభించనున్నట్లు శాంసంగ్ తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని