Smart Mobiles: శాంసంగ్ సరికొత్త ట్యాబ్స్, వీవో 5జీ మొబైల్ వచ్చేశాయ్.. ధర, ఫీచర్లివే..!
శాంసంగ్ నుంచి ఫ్లాగ్షిప్ రేంజ్లో సరికొత్త ట్యాబ్ సిరీస్, వీవో 5జీ మొబైల్ ఇవాళ విడుదలయ్యాయి. వీటి ధరను..
ప్రముఖ కంపెనీ శాంసంగ్ నుంచి ఫ్లాగ్షిప్ రేంజ్లో సరికొత్త ట్యాబ్ సిరీస్.. మిడ్ రేంజ్లో వీవో 5జీ మొబైల్.. బడ్జెట్ ధరలో డీజో నెక్బ్యాండ్ ఇవాళ భారత మార్కెట్లో విడుదలయ్యాయి. మరి వీటి ఫీచర్లేంటి, ధరెంతో తెలుసుకుందాం.. రండి..
ఇది సెల్ఫీ స్పెషల్
వీవో కంపెనీ V23 సిరీస్లో ‘వీవో వీ23ఈ (Vivo V23e)’ పేరిట కొత్త 5జీ మొబైల్ను ఇవాళ లాంచ్ చేసింది. 44MP ఫ్రంట్ కెమెరా, ట్రిపుల్ రియల్ కెమెరా సెటప్ (50MP ప్రధాన, 8MP అల్ట్రావైడ్, 2MP మాక్రో షూటర్), ఆండ్రాయిడ్ 12 ఓఎస్, వాటర్డ్రాప్-స్టైల్ 6.44 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్తో ఇది లభిస్తుంది. 8జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజీతో పాటు 44W ఫాస్ట్ ఛార్జింగ్, 4,050mAh బ్యాటరీకి మద్దతిస్తుంది. ఫోన్ అండర్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్తో వచ్చే ఈ కొత్త మొబైల్.. మిడ్నైట్ బ్లూ, సన్షైన్ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంది.
వీవో ఇండియాతో పాటు ప్రముఖ రిటైల్ స్టోర్లలో ఈ కొత్త మొబైల్ అమ్మకాలు ప్రారంభమయ్యాయని కంపెనీ తెలిపింది. ప్రారంభ ధర రూ.25,990గా ఉండగా, లాంచ్ ఆఫర్ కింద ఐసీఐసీఐ క్రెడిట్ కార్డును ఉపయోగించి గరిష్ఠంగా 10 శాతం వరకు క్యాష్బ్యాక్ పొందవచ్చు.
గేమ్ మోడ్లో డీజో నెక్బ్యాండ్
డిజో కంపెనీ తన కొత్త నెక్బ్యాండ్ ఇయర్ఫోన్లను భారత్లో విడుదల చేసింది. ‘డిజో వైర్లెస్ పవర్ (Dizo Wireless Power)’గా వీటికి నామకరణం చేసింది. సెంట్రిక్ ఆడియో డ్రైవర్లు, బ్లూటూత్ ఫాస్ట్ పెయిర్ టెక్నాలజీతో ఇది లభిస్తుంది. శ్రవణ అనుభావాన్ని మరింత మెరుగుపరచడానికి Bass Boost+ అల్గారిథమ్, 88mm సూపర్ లేటెన్సీ గేమ్ మోడ్తో దీనిని తీసుకొచ్చారు. 150mAh బ్యాటరీ కారణంగా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 గంటల ప్లేబ్యాక్ సంగీతాన్ని ఈ నెక్బ్యాండ్ అందించగలదని డిజో పేర్కొంది.
ఈ నెక్బ్యాండ్ అసలు ధర రూ.1,399 ఉండగా, పరిచయ ఆఫర్ కింద రూ.999కే లభించనుంది. వైలెట్ బ్లూ, హంటర్ గ్రీన్, క్లాసిక్, బ్లాక్ కలర్లలో.. ఫ్లిప్కార్ట్తో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో డీజో నెక్బ్యాండ్ను కొనుగోలు చేయకోవచ్చు.
ఒక్కొక్కటిగా ముందుకు..
ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తన అన్ప్యాక్డ్ ఈవెంట్ (ఫిబ్రవరి 9న)లో ఆవిష్కరించిన కొత్త ఉత్పత్తులను ఒక్కొక్కటిగా మన వద్దకు తీసుకొచ్చేస్తోంది. ఇప్పటికే గెలాక్సీ ఎస్22 సిరీస్లో మూడు మొబైల్ వేరియంట్లను భారత్లో విడుదల చేసిన కంపెనీ.. తాజాగా ఫ్లాగ్షిప్ రేంజ్లో ‘గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8’ పేరిట మరో మూడు ట్యాబ్లను ఇవాళ లాంచ్ చేసింది. వీటిలో గెలాక్సీ ట్యాబ్ ఎస్8తో పాటు ఎస్8+, ఎస్8 అల్ట్రా ట్యాబ్లెట్లు ఉన్నాయి. ఈ మూడు కూడా స్నాప్డ్రాగన్ 8 జనరేషన్-1 చిప్, వన్ 4.1 యూఐ ఆండ్రాయిడ్ 12 ఓఎస్, S-పెన్ బండిల్తో వస్తున్నాయి.
ప్రత్యేకతలు
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8 అల్ట్రా (Galaxy Tab S8 Ultra).. 14.6 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్తో లభిస్తుంది. ముందువైపు రెండు 12MP షూటర్లతో పాటు వెనుకల 13MP ప్రధాన, 6MP అల్ట్రా-వైడ్ సూపర్ కెమెరాలు ఉన్నాయి. ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్, 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 11,200mAh బ్యాటరీ మరిన్ని ప్రత్యేకతలు. 12జీబీ/256 జీబీ స్టోరేజ్తో లభించే ఈ మోడల్ గ్రాఫైట్ రంగులో అందుబాటులో ఉంది.
గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8+ వేరియంట్ 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 12.4 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ముందుభాగంలో ఒకే 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. వెనుకల ఎస్8 అల్ట్రా వలె డ్యూయల్ కెమెరాలతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్, 10,090mAh బ్యాటరీకి మద్దతిస్తుంది. మరోవైపు సైడ్ ఫింగర్ ప్రింట్ రీడర్తో కూడినది ట్యాబ్ ఎస్ 8. ఇది 11 అంగుళాల వాటర్-డౌన్ డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ రెండు వేరియంట్లు 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్తో అందుబాటులో ఉన్నాయి.
ధర ఎంతంటే..?
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8 వైఫై వేరియంట్ ధర రూ.58,999 ఉండగా, 5జీ వేరియంట్ ధర రూ.70,999గా ఉంది. అలాగే ట్యాబ్ ఎస్8+ వైఫై వేరియంట్ ధరను కంపెనీ రూ.74,999గా నిర్ణయించిగా, 5జీ వేరియంట్ రూ.87,999కు అందుబాటులో ఉంది. ఇక ట్యాబ్ ఎస్8 అల్ట్రా వైఫై వేరియంట్ ధర రూ.1,08,999ను నిర్ణయించగా, 5జీ ట్యాబ్ రూ. 1,22,999కి కొనుగోలు చేయవచ్చు.
లాంచ్ ఆఫర్లు
గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8 సిరీస్ ప్రీ-బుకింగ్పై రూ.22,999 విలువైన కీబోర్డ్ కవర్ బండిల్ను ఉచితంగా పొందవచ్చు. Samsung.com వైబ్సైట్లో ఫిబ్రవరి 22 - మార్చి 10 మధ్య ప్రీ-ఆర్డర్ అందుబాటులో ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్కార్డులను ఉపయోగించి ఎస్8 అల్ట్రా కొనుగోలుపై రూ. 10,000, ట్యాబ్ ఎస్8+పై రూ.8,000, ట్యాబ్ ఎస్8పై రూ. 7,000 క్యాష్బ్యాక్ పొందవచ్చు. వీటిపై నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉన్నాయి.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు. -
పిక్సెల్ ఫోన్లలో లుకప్ ఫీచర్
గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడేవారికి శుభవార్త. తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించే లుకప్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీన్ని ఇంతకుముందు జపాన్లో పరిచయం చేశారు గానీ ఇతర ప్రాంతాల్లో విడుదల చేయలేదు. -
మొబైల్ రోబో
వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త టూల్స్తో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అలాంటి టూల్ ఒకటి ఇటీవలే విడుదలైంది. దీని పేరు ఎల్ఓఓఐ. ఇదో చిన్న డెస్క్టాప్ రోబో. -
మిమిక్రీ ఇంజిన్!
ప్రముఖ కృత్రిమ మేధ కంపెనీ ఓపెన్ఏఐ తాజాగా వాయిస్ అసిస్టెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా వాయిస్ ఇంజిన్ అనే వినూత్న టూల్ను పరిచయం చేసింది. -
కొత్త సర్ఫేస్ ల్యాప్టాప్లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్ను ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్వర్డ్లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్వర్డ్ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్వర్డ్లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్ను అమ్ముతున్నారా?
ప్రింటర్తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్బాట్స్ను రూపొందించి సంచలనం సృష్టించారు. -
ఫోన్ బ్యాటరీ ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది?
స్మార్ట్ఫోన్ బ్యాటరీ పూర్తిగా.. అంటే 0 నుంచి 100% వరకు ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది? ఎవరు లెక్కపెట్టొచ్చారని పెదవి విరవకండి. దీని గురించి తెలిస్తే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నేలా కాపాడుకోవచ్చు మరి
తాజా వార్తలు (Latest News)
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్