Samsung Galaxy Tab A8: బడ్జెట్‌ శ్రేణిలో శాంసంగ్ కొత్త ట్యాబ్‌..ధర, ఫీచర్లివే!

శాంసంగ్‌ కంపెనీ బడ్జెట్‌ శ్రేణిలో కొత్త గెలాక్సీ ట్యాబ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఈ ట్యాబ్‌లో ఎలాంటి పీచర్లున్నాయి, ధరెంత, ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయనేది చూద్దాం.

Published : 13 Jan 2022 17:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శాంసంగ్‌ గెలాక్సీ సిరీస్‌లో కొత్త ట్యాబ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ8 (Samsung Galaxy Tab A8) పేరుతో దీన్ని పరిచయం చేసింది. బడ్జెట్‌ శ్రేణిలో తీసుకొచ్చిన ఈ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయి.. ధరెంత.. ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయనేది చూద్దాం.

ఈ ట్యాబ్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇందులో 10.5 అంగుళాల డబ్ల్యూఎక్స్‌జీఏ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆక్టాకోర్ ప్రాసెసర్‌ ఉపయోగించారు. ఇందులో రెండు కెమెరాలున్నాయి. వెనుకవైపు 8 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ముందుభాగంలో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. డాల్బీ అట్‌మోస్‌ సపోర్ట్‌తో క్వాడ్ స్పీకర్‌ ఇస్తున్నారు. 7,040 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ట్యాబ్‌ను వైఫై, ఎల్‌టీఈ వేరియంట్లలో తీసుకొచ్చారు. 3 జీబీ ర్యామ్‌/32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వైఫై వేరియంట్‌ ధర రూ. 17,999 కాగా, వైఫై+ఎల్‌టీఈ వేరియంట్‌ ధర రూ. 21,999. 4 జీబీ ర్యామ్‌/64 జీబీ వైఫై వేరియంట్‌ ధర రూ. 19,999, వైఫై+ఎల్‌టీఈ మోడల్‌ ధర రూ. 23,999గా కంపెనీ నిర్ణయించింది. జనవరి 17 నుంచి శాంసంగ్‌, అమెజాన్‌ వెబ్‌సైట్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని