Latest Mobiles: ₹9 వేలలోపే టెక్నోనుంచి మరో మొబైల్‌.. ఫీచర్లివే!

టెక్నో కంపెనీ నుంచి మరో సరికొత్త బడ్జెట్‌ మొబైల్‌ భారత మార్కెట్‌లోకి వచ్చేసింది...

Updated : 19 Jan 2022 19:14 IST

దిల్లీ: టెక్నో కంపెనీ నుంచి మరో సరికొత్త బడ్జెట్‌ మొబైల్‌ భారత మార్కెట్‌లోకి వచ్చేసింది. ‘టెక్నో పాప్‌ 5 ఎల్‌టీఈ (Tecno Pop 5 LTE)’ సక్సెసర్‌గా ‘టెక్నో పాప్‌ 5 ప్రో (Tecno Pop 5 Pro)’ 4 జీ మొబైల్‌ను కంపెనీ ఇవాళ విడుదల చేసింది. ఆండ్రాయిడ్‌ 11 HiOS 7.6పై ఇది రన్‌ అవుతుంది. 6000mAh బ్యాటరీ, IPX2 స్ప్లాష్ రెసిస్టెన్స్ వీటిలో ప్రత్యేకతలు. 6.52 అంగుళాల హెచ్‌డీ+ 269 PPI పిక్సెల్ డెన్సిటీతో దీనిని తీసుకొచ్చారు. 120Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 3జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ ఉంది. ఎస్‌డీ కార్డ్‌ ద్వారా మెమొరీని 256జీబీ వరకు పెంచుకోవచ్చు. 

వెనుక 8 మెగా పిక్సెల్‌ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్‌తో పాటు ఫ్రంట్‌లో ఫ్లాష్‌తో కూడిన 5 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అమర్చారు. వాల్ట్ 2.0, స్మార్ట్ ప్యానెల్ 2.0, కిడ్స్ మోడ్, డార్క్ థీమ్‌లు, పీక్ ప్రూఫ్, యాంటీ థెఫ్ట్ అలారం వంటివి ఇందులో మరిన్ని ఫీచర్లు. ఈ మొబైల్‌ ధరను కంపెనీ రూ.8,499గా నిర్ణయించింది. ఇటీవల జనవరి 12న టెక్నో పాప్‌ 5 మొబైల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. 2 జీబీ, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీతో వచ్చే దీని ధరను కంపెనీ రూ.6,299గా ఖరారు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని