WhatsApp: ఒక్కసారి మాత్రమే చూడగలరు.. 

వాట్సాప్‌..ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్స్‌ ఉన్న ఇన్‌స్టాట్ మెసేజింగ్ యాప్. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తూ యాప్‌ను యూజర్‌ ఫ్రెండ్లీగా మార్చి మరింత మంది వినియోగదారులకు దగ్గరవుతోంది. తాజాగా..వ్యూ వన్స్‌ పేరుతో మరో కొత్త ప్రైవసీ-ఫ్రెండ్లీ ఫీచర్‌ను తీసుకొచ్చింది...

Published : 30 Jun 2021 17:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రైవసీకి పెద్ద పీట వేస్తాం అంటూ వాట్సాప్‌ చాలా రోజులుగా చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది.వ్యూ వన్స్‌’ పేరుతో ప్రైవసీ-ఫ్రెండ్లీ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ తీసుకొచ్చారు. త్వరలో అందరికీ ఈ సదుపాయం తీసుకొస్తారు. ఈ ఫీచర్‌ ఏంటి, ఎలా పని చేస్తుందంటే? 


* ఏదైనా ఫొటో/వీడియో/గిఫ్‌లను వాట్సాప్‌లో ఇతరులకు పంపితే, అవతలి వ్యక్తి వాటిని కేవలం ఒక్కసారే చూసేలా చేయటమే ఈ ‘వ్యూ వన్స్‌’ ఫీచర్‌ ఉపయోగం. ఈ ఫీచర్‌ ఎనేబుల్‌ చేసుకుంటే...  రిసీవర్‌ ఛాట్‌ స్క్రీన్‌ నుంచే కాకుండా, పంపినవారి ఛాట్ స్క్రీన్‌ నుంచి కూడా పూర్తిగా డిలీట్‌ అయిపోతుంది. ఆ మాటకొస్తే సెండ్‌ బటన్‌ క్లిక్‌ చేశాక ... పంపినవారికి కూడా ప్రివ్యూ కనిపించదు. అయితే ప్రతిసారి ఫొటోలు/వీడియోలు పంపినప్పుడు ఈ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి. (ఎనేబుల్‌ కోసం క్లిక్‌ చేయాల్సిన బటన్‌ పైన ఇమేజ్‌లో రౌండ్‌ చేసి ఉంది)

* గ్రూప్‌ ఛాట్‌లలోనూ  ఈ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవచ్చు. గ్రూపు సభ్యులు అందరూ చూసేంతవరకు ఆ ఇమేజ్‌ స్టేటస్‌ (ఇన్ఫోలో కనిపించేది) మారదు. అందరూ చూశాకనే ‘వన్స్‌ వ్యూ’ ఫీచర్‌ ఎనేబుల్‌ చేసుకున్న ఇమేజ్‌ డిస్‌పియర్‌ అవుతుంది. అలాగే ఆ ఫొటో/వీడియోలను గ్రూపులో ఎవరెవరు చూశారనేది మెసేజ్‌ ఇన్ఫో సెక్షన్‌లో తెలుస్తుంది. గ్రూప్‌ సభ్యుల్లో మీరు గతంలో బ్లాక్‌ చేసిన వ్యక్తులు కూడా... వ్యూ వన్స్‌ ఫీచర్ ద్వారా పంపిన ఫొటో/వీడియోలను చూడొచ్చు.

* ఇప్పటికే ఇన్‌స్టాగ్రాంలో ఎక్స్‌పైరింగ్ మీడియా, సిగ్నల్‌లో ఎక్స్‌పైరింగ్ మీడియా మెసేజెస్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో సీక్రెట్‌ మెసేజింగ్‌ పేరుతో ఈ తరహా ఫీచర్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని