WhatsApp: ఒక వాట్సాప్‌ గ్రూప్‌లో.. 1024 మంది... ఇంకా!

వాట్సాప్‌ గ్రూపులకు సంబంధించి రెండు కొత్త ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. వీటితో గ్రూపుల నిర్వహణ సులభతరమవుతుందని వాట్సాప్‌ భావిస్తోంది. 

Updated : 10 Oct 2022 20:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గ్రూప్స్‌ విషయంలో వాట్సాప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూపులో సభ్యుల సంఖ్యను రెండింతలు చేయనుంది. దీంతో త్వరలో వాట్సాప్‌ గ్రూపులో వెయ్యి మందికిపైగా సభ్యులు ఉండొచ్చు. గతంలో ఓ గ్రూపులో గరిష్ఠంగా 256 మందిని సభ్యులుగా చేర్చుకోవచ్చు. కొన్ని రోజుల క్రితం ఆ సంఖ్యను 512కు పెంచింది. త్వరలో ఆ సంఖ్యను 1024కి పెంచనుంది. ఇప్పటికే కొంతమంది వాట్సాప్‌ బీటా యూజర్లకు ఈ అప్‌డేట్‌ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే సాధారణ యూజర్లకూ ఈ అప్‌డేట్‌ ఇవ్వనున్నారు. 

ఈ ఫీచర్లు కూడా...

  • గ్రూప్‌ అడ్మిన్‌ల కోసం అప్రూవల్ సిస్టమ్‌ (Approval System)ను తీసుకురానుంది. అంటే ఎవరైనా గ్రూపులో చేరాలి అనుకుంటే.. అడ్మిన్‌ అప్రూవ్‌ చేయాల్సి ఉంటుంది. గ్రూపులో చేరేందుకు వచ్చిన రిక్వెస్టులన్నీ.. ఒక చోట లిస్ట్‌లా కనిపిస్తాయి. వాటిని అడ్మిన్‌ చెక్‌ చేసుకుని.. ఆ వ్యక్తి గ్రూపు సభ్యుడిగా వద్దు అనుకుంటే రిక్వెస్ట్‌ను రిజెక్ట్‌ చేయొచ్చు. 
  • యూజర్‌ ప్రైవసీ కోసం ‘వ్యూ వన్స్‌’లో స్క్రీన్‌షాట్‌ బ్లాక్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. యూజర్లు వ్యూ వన్స్ ద్వారా పంపే మెసేజ్‌లు / ఇమేజ్‌లను అవతలి వ్యక్తి స్క్రీన్‌షాట్‌ తీయలేరు. 
  • వాట్సాప్‌ కాల్‌ లింక్స్‌ ఫీచర్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. దీంతో వీడియో కాన్ఫరెన్స్‌నిర్వహించాలనుకునే వ్యక్తి కాల్‌ లింక్‌ క్రియేట్ చేసి.. కాల్‌ మాట్లాడాలి అనుకునేవారికి పంపాలి. ఆ లింక్‌ను క్లిక్‌ చేసి నేరుగా ఆ వీడియో సమావేశంలో పాల్గొనొచ్చు. ఈ మొత్తం ప్రాసెస్‌ జూమ్‌, గూగుల్ మీట్ తరహాలో ఉంటుందని సమాచారం.
  • యూజర్లు వాట్సాప్‌ స్టేటస్‌లో ఆడియో మెసేజ్‌లను కూడా పెట్టుకోవచ్చు. స్టేటస్‌ బటన్‌ క్లిక్‌ చేస్తే.. వాయిస్‌ రికార్డ్‌ చేసే ఆప్షన్‌ వస్తుంది. దాని ద్వారా వాయిస్‌ స్టేటస్‌ పెట్టొచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని