Xiaomi Pad 5: ఏడేళ్ల తర్వాత షావోమి కొత్త స్మార్ట్‌ ట్యాబ్‌... ధర, ప్రత్యేకతలివే!

చైనా టెక్‌ దిగ్గజం షావోమి నుంచి మరో కొత్త స్మార్ట్‌ ట్యాబ్‌ రాబోతుంది. దీనికి సంబంధించిన విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

Updated : 11 May 2022 18:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనా టెక్‌ దిగ్గజం షావోమి నుంచి మరో కొత్త స్మార్ట్‌ ట్యాబ్‌ రాబోతుంది. దీనికి సంబంధించిన విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్‌ 27న జరగబోయే ఈవెంట్‌లో షావోమి 12 ప్రోతో పాటు కొత్త మోడల్‌ ‘స్మార్ట్‌ ప్యాడ్‌ 5’ను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించింది. దాదాపు ఏడేళ్ల తర్వాత తిరిగి స్మార్ట్‌ ట్యాబ్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనుండటం గమనార్హం. మరి ఈ కొత్త స్మార్ట్‌ ప్యాడ్‌ 5, షావోమి 12 ప్రో ఫీచర్లు ఏంటో చూద్దాం..


ప్యాడ్ 5 స్పెసిఫికేషన్లు..

షావోమి కొత్తగా విడుదల చేసే స్మార్ట్‌ ప్యాడ్‌5 11 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్‌ 860 ప్రాసెసర్‌ను వాడారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ (MIUI) 12.5 ఓఎస్‌తో ఇది పనిచేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌, 240Hz స్యాంప్‌లింగ్‌ రేట్‌, డాల్బీ విజన్‌,  హెచ్‌డీఆర్‌10 ప్లేబ్యాక్‌ సపోర్ట్ చేస్తుంది. దీని వెనుకభాగంలో 13ఎంపీ కెమెరా, ముందుభాగంలో సెల్ఫీల కోసం 8ఎంపీ కెమెరాను అమర్చారు. డాల్బీ అట్మోస్‌ ఫీచర్‌తో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ప్యాడ్‌ 5లో క్వాడ్ స్పీకర్ సెటప్‌ కూడా ఉంటుంది. 8,720ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతోపాటు 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేస్తోంది. 6జీబీ+128జీబీ వేరియంట్, 8జీబీ+256జీబీ  వేరియంట్లలో ఈ స్మార్ట్ ప్యాడ్ లభిస్తోంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధరను కంపెనీ రూ.24,000గా, 6జీబీ+256జీబీ వేరియంట్‌ ధరను రూ.27,600గా నిర్ణయించినట్లు టెక్‌ వర్గాల సమాచారం.


షావోమి 12 ప్రో ఫీచర్లు..

షావోమి 12 ప్రో మోడల్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 480 హెర్జ్‌ టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.73 అంగుళాల డబ్లూక్యూహెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీని వెనుకవైపు మూడు 50 ఎంపీ కెమెరాలు. ముందుభాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50 వాట్‌ వైర్‌లెస్‌, 10 వాట్‌ రివర్స్ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని ధర గురించి పూర్తి స్పష్టత లేదు. కానీ, భారత్‌లో దీని ధర రూ.55,190గా ఉంటుందని అంచనా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని