Crime News: గచ్చిబౌలిలో పేకాట శిబిరం గుట్టురట్టు.. 12మంది స్థిరాస్తి వ్యాపారుల అరెస్టు

నగరంలోని గచ్చిబౌలిలో పేకాట శిబిరం గుట్టు రట్టైంది. పేకాట ఆడుతున్న 12 మంది స్థిరాస్తి వ్యాపారులను

Published : 22 Jan 2022 11:31 IST

హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలిలో పేకాట శిబిరం గుట్టు రట్టైంది. పేకాట ఆడుతున్న 12 మంది స్థిరాస్తి వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.9 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. శిబిరంపై దాడి చేసిన మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు పాపిరెడ్డి(అల్వాల్), కార్తీక్‌ గౌడ్‌, సంతోష్‌(ఎల్బీనగర్‌), సతీష్‌(సంతోష్‌ నగర్‌), సీర్లరెడ్డి(సిద్దిపేట), రామయ్య(మెదక్‌), వెంకట నర్సింహరాజు(అల్వాల్‌), సద్గురురెడ్డి(బీరంగూడ), కృష్ణ(బీరంగూడ), అప్పలరాజు(గండిపేట)లను అదుపులోకి తీసుకున్నారు.  అంబర్‌పేట్‌కు చెందిన మర్కారెడ్డి గచ్చిబౌలిలో ఫ్లాట్‌ అద్దెకు తీసుకొని పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని