Tollywood Drugs Case: మరోసారి తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు
టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన రికార్డులు సమర్పించాల్సిందిగా
హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన రికార్డులు సమర్పించాల్సిందిగా తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) లేఖ రాసింది. డిజిటల్ రికార్డులు, కాల్ డేటా, సాక్షులు, నిందితుల వాంగ్మూలానికి సంబంధించిన వివరాలు అందజేయాలని లేఖలో ఈడీ అధికారులు కోరారు. ఈడీ అధికారులు అడిగిన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది.
అసలేం జరిగిందంటే..
కొందరు సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నారని, డ్రగ్పెడ్లర్ కెల్విన్తో వాటి లావాదేవీలు నిర్వహించారన్న అభియోగాల నేపథ్యంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఇప్పటికే పలువురిని పిలిచి విచారించిన సంగతి తెలిసిందే. ఎక్సైజ్ శాఖ దీనికి సంబంధించి మొత్తం 12 కేసులను నమోదు చేయగా.. ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ వాటి అభియోగ పత్రాలనూ సమర్పించి, ఈ కేసుల్లో సినీ ప్రముఖులకు సంబంధాలు లేవని తేల్చింది. ఈడీ కేసు మాత్రం ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. అయితే, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు సందర్భంగా సేకరించిన డిజిటల్ రికార్డులను ఇప్పటివరకు తమకు సమర్పించలేదని ఈడీ కొద్దిరోజుల క్రితం న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని ఎంపీ రేవంత్రెడ్డి గతంలో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ క్రమంలో డిజిటల్ రికార్డుల అంశం తెరపైకి వచ్చింది. తాము దర్యాప్తు చేస్తామంటూ ఈడీ ఇదివరకే కేసులో ఇంప్లీడ్ అయింది. ఈ క్రమంలో దర్యాప్తు వివరాల్ని ఈడీకి అప్పగించాలని న్యాయస్థానం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ను ఆదేశించింది. ఎఫ్ఐఆర్లు, అభియోగపత్రాలను మాత్రమే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తమకు అప్పగించిందని, డిజిటల్ రికార్డుల్ని ఇవ్వలేదంటూ ఈడీ న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. కేసుల్లో మనీలాండరింగ్ జరిగిందా? లేదా? అన్న అంశాన్ని తేల్చేందుకు ఆ రికార్డులు తప్పనిసరి అని తెలిపింది. దీంతో వాటిని ఈడీకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై ఛీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి