Hyderabad News: బేగంబజార్‌ హత్య కేసు.. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు

బేగంబజార్‌లో యువ వ్యాపారి​నీరజ్ పన్వార్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అభినందన్‌ను పోలీసులు

Updated : 23 May 2022 14:39 IST

హైదరాబాద్: బేగంబజార్‌లో యువ వ్యాపారి​ నీరజ్ పన్వర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అభినందన్‌ను పోలీసులు మహారాష్ట్రలో అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు పరారీలో ఉన్న మరో నిందితుడు మహేశ్‌నూ పట్టుకున్నారు. హత్య తర్వాత మహేశ్ ​పుణె పారిపోగా.. షాహినాజ్ ​గంజ్ పోలీసులు అతడిని హైదరాబాద్‌కు రప్పించి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నలుగురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ముగ్గురు నిందితులు విజయ్, సంజయ్, రోహిత్‌లను చంచల్‌గూడ జైలుకు తరలించగా.. నిందితుగా ఉన్న బాలుడిని జువైనల్ హోంకు తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని