Hyderabad: బేగంబజార్ హత్య కేసు: పోలీసు కస్టడీకి ఇద్దరు నిందితులు
బేగంబజార్లో యువ వ్యాపారి నీరజ్ పన్వర్ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయ్, సంజన్ అనే ఇద్దరు నిందితులను కోర్టు 4 రోజుల కస్టడీకి అనుమతించింది.
హైదరాబాద్: బేగంబజార్లో యువ వ్యాపారి నీరజ్ పన్వర్ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయ్, సంజన్ అనే ఇద్దరు నిందితులను కోర్టు 4 రోజుల కస్టడీకి అనుమతించింది. చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇద్దరు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకొని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఈ నెల 21వ తేదీన జరిగిన నీరజ్ హత్య కేసులో షాహినాయత్ గంజ్ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. 22వ తేదీన నలుగురిని అరెస్టు చేశారు. ఇందులో విజయ్, సంజయ్, రోహిత్, ఒక మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అభినందన్, మహేష్ పరారీలో ఉండటంతో మరుసటి రోజు వాళ్లిద్దరితో పాటు... మరో మైనర్ బాలుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 22న అరెస్టు చేసిన నలుగురిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరినా.. హత్యతో నేరుగా సంబంధం ఉన్న విజయ్, సంజయ్లను మాత్రమే కస్టడీకి అనుమతించింది.
విజయ్, సంజయ్లను ప్రశ్నించి హత్యకు గల కారణాలను పూర్తిగా తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హత్యతో ఇంకెవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. 22న అరెస్టు చేసిన అభినందన్, మహేష్, ప్రశాంత్లను కూడా కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతిస్తే వీళ్లను కూడా కస్టడీలోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించేందుకు అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్