Hyd News: ఎంజీబీఎస్లో కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతం
నగరంలోని ఎంజీ బస్స్టేషన్(ఎంజీబీఎస్)లో కిడ్నాప్కు గురైన నాలుగేళ్ల బాలుడు నవీన్ కథ సూఖాంతమైంది. నిన్న రాత్రి ఎంజీబీఎస్ వద్ద నల్గొండ బస్సులో బాలుడు కనిపించాడు.
హైదరాబాద్: నగరంలోని ఎంజీ బస్స్టేషన్(ఎంజీబీఎస్)లో కిడ్నాప్కు గురైన నాలుగేళ్ల బాలుడు నవీన్ కథ సుఖాంతమైంది. మంగళవారం రాత్రి సీబీఎస్ బస్ స్టేషన్ వద్ద నల్గొండ డిపోకు చెందిన బస్సులో బాలుడు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి ఎంజీబీఎస్లో గుర్తుతెలియని వ్యక్తి బాలుడిని తనవెంట తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాకు చెందిన లక్ష్మణ్ కుమారుడు నవీన్ హైదరాబాద్ కాచిగూడలోని తన బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. ఈనెల 9వ తేదీన లక్ష్మణ్ తన కుమారుడిని తీసుకెళ్లేందుకు హైదరాబాద్కు వచ్చారు. ఈ క్రమంలో ఎంజీబీఎస్లోని ప్లాట్ ఫామ్ నంబర్ 44కు చేరుకున్నాడు. బాలుడిని అక్కడే కూర్చోబెట్టి.. లక్ష్మణ్ మూత్రశాలకు వెళ్లాడు. వచ్చేసరికి బాలుడు కనిపించకుండా పోయాడు. దీంతో బాధితుడు లక్ష్మణ్ ఎంజీబీఎస్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో గుర్తుతెలియని వ్యక్తితో బాలుడు నడుచుకుంటూ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
తాను బాలుడిని తీసుకెళ్లినట్లు పోలీసులకు తెలిసిపోయిందని భావించిన వ్యక్తి... నల్గొండలో బాలుడిని బస్సు ఎక్కించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిర్యాలగూడలో బయలుదేరిన బస్సు నల్గొండ మీదుగా రాత్రి హైదరాబాద్కి చేరుకున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. మిర్యాలగూడ నుంచి వచ్చిన బస్సులో నిద్రపోతున్న బాలుడిని గమనించిన కండక్టర్.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అఫ్జల్గంజ్ పోలీసులు బాలుడిని కుటుంబసభ్యులకు అప్పగించారు. నవీన్ను తీసుకువెళ్లిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం