Hyderabad: హైదరాబాద్లో దారుణం.. ప్రేమ వివాహం చేసుకున్నాడని చంపేశారు
భాగ్యనగరం నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. నగరంలోని మచ్చి మార్కెట్ వద్ద వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నీరజ్ పన్వార్ అనే వ్యక్తిని నలుగురు దుండగులు
హైదరాబాద్: భాగ్యనగరం నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. నగరంలోని మచ్చి మార్కెట్ వద్ద వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నీరజ్ పన్వార్ అనే వ్యక్తిని నలుగురు దుండగులు కత్తులతో అత్యంత దారుణంగా పొడిచి హతమార్చారు. ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో దుండగులు హత్య చేసినట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం నీరజ్ ప్రేమ వివాహం చేసుకోవడంతో యువతి కుటుంబసభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసులో మొత్తం ఐదుగురు నిందితుల ప్రమేయం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రంగంలోకి టాస్క్ఫోర్స్ సహా నాలుగు బృందాలు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు గుర్తించారు.
మాకు న్యాయం కావాలి: నీరజ్ తండ్రి
‘‘మా అబ్బాయి ఏడాది క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. నీరజ్ ప్రేమ వివాహం చేసుకున్నాడని యువతి కుటుంబసభ్యులు కక్ష పెట్టుకొని కిరాతకంగా హత్య చేశారు. ఇంటి సమీపంలోని ఫిల్ఖానా వద్దనున్న ఓ షాప్కు నీరజ్ వెళ్ళాడు. అంతలోనే రెండు బైక్ల మీద వచ్చిన ఐదుగురు యువకులు నీరజ్ను 5 నిమిషాల్లోనే హతమార్చారు. నీరజ్ ప్రేమ వివాహం అనంతరం యువతి కుటుంబసభ్యులతో ఇబ్బందులున్నట్లు గతంలోనే అఫ్జల్గంజ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాం. మాకు న్యాయం కావాలి. అమ్మాయి కుటుంబసభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టారు’’ అని నీరజ్ తండ్రి ఆరోపించారు.
‘‘ఏడాది క్రితం నీరజ్ ఆర్య సమాజ్లో కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి 4 నెలల బాబు ఉన్నాడు. అమ్మాయి కుటుంబసభ్యులే నీరజ్ను హత్య చేశారని ప్రాథమికంగా గుర్తించాం. మృతుడి తండ్రి ఫిర్యాదు ఇచ్చారు. ఈ హత్య కేసులో ఐదుగురు ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించాం. కేసు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం’’ - గోషామహల్ ఏసీపీ సతీష్ కుమార్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె