
TS News: తెరాస జిల్లా అధ్యక్షులను నియమించిన కేసీఆర్.. ఏ జిల్లాకు ఎవరంటే!
హైదరాబాద్: తెరాస అధినేత, సీఎం కేసీఆర్ జిల్లాలకు ఆ పార్టీ అధ్యక్షులను నియమించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షుల పేర్లను ఆయన ప్రకటించారు. సూర్యాపేటకు లింగయ్య యాదవ్, యాదాద్రి- కంచర్ల రామకృష్ణారెడ్డి, నల్గొండ- రవీంద్ర కుమార్, రంగారెడ్డి- మంచిరెడ్డి కిషన్రెడ్డి, వికారాబాద్- మెతుకు ఆనంద్, మేడ్చల్- శంభీపూర్ రాజు, నాగర్ కర్నూల్- గువ్వల బాలరాజు, మహబూబ్నగర్- సి.లక్ష్మారెడ్డి, వనపర్తి- ఏర్పుల గట్టు యాదవ్, జోగులాంబ గద్వాల- బి. కృష్ణమోహన్రెడ్డి, నారాయణపేట- ఎస్. రాజేందర్రెడ్డిని నియమించారు.
హైదరాబాద్కు మాగంటి గోపీనాథ్, ఆదిలాబాద్- జోగు రామన్న, మంచిర్యాల- బాల్క సుమన్, నిర్మల్- విఠల్రెడ్డి, కుమురంభీం అసిఫాబాద్- కోనేరు కోనప్ప, నిజామాబాద్- జీవన్రెడ్డి, కామారెడ్డి- ఎం.కె.ముజీబుద్దీన్, కరీంనగర్- రామకృష్ణారావు, రాజన్న సిరిసిల్ల- తోట ఆగయ్య, జగిత్యాల- విద్యాసాగర్రావు, పెద్దపల్లి- కోరుకంటి చందర్, మెదక్- పద్మాదేవేందర్రెడ్డి, సంగారెడ్డి- చింతా ప్రభాకర్, సిద్దిపేట- కొత్త ప్రభాకర్రెడ్డి, వరంగల్- ఆరూరి రమేశ్, హనుమకొండ- దాస్యం వినయ్భాస్కర్, జనగామ- సంపత్రెడ్డి, మహబూబాబాద్- మాలోతు కవిత, ములుగు- కుసుమ జగదీశ్, జయశంకర్ భూపాల్పల్లి- గండ్ర జ్యోతి, ఖమ్మం- తాతా మధుసూదన్, భద్రాద్రి కొత్తగూడెం- రేగా కాంతారావులను కేసీఆర్ నియమించారు. ఈ మేరకు తెరాస పార్టీ వారి పేర్లను వెల్లడించింది.