TS News: తెరాస జిల్లా అధ్యక్షులను నియమించిన కేసీఆర్‌.. ఏ జిల్లాకు ఎవరంటే!

తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ జిల్లాలకు ఆ పార్టీ అధ్యక్షులను నియమించారు.

Updated : 26 Jan 2022 12:58 IST

హైదరాబాద్‌: తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ జిల్లాలకు ఆ పార్టీ అధ్యక్షులను నియమించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షుల పేర్లను ఆయన ప్రకటించారు. సూర్యాపేటకు లింగయ్య యాదవ్‌, యాదాద్రి- కంచర్ల రామకృష్ణారెడ్డి, నల్గొండ- రవీంద్ర కుమార్‌, రంగారెడ్డి- మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, వికారాబాద్‌- మెతుకు ఆనంద్‌, మేడ్చల్‌- శంభీపూర్‌ రాజు, నాగర్‌ కర్నూల్‌- గువ్వల బాలరాజు, మహబూబ్‌నగర్‌- సి.లక్ష్మారెడ్డి, వనపర్తి- ఏర్పుల గట్టు యాదవ్‌, జోగులాంబ గద్వాల- బి. కృష్ణమోహన్‌రెడ్డి, నారాయణపేట- ఎస్‌. రాజేందర్‌రెడ్డిని నియమించారు.

హైదరాబాద్‌కు మాగంటి గోపీనాథ్‌, ఆదిలాబాద్‌- జోగు రామన్న, మంచిర్యాల- బాల్క సుమన్, నిర్మల్‌- విఠల్‌రెడ్డి, కుమురంభీం అసిఫాబాద్‌- కోనేరు కోనప్ప, నిజామాబాద్‌- జీవన్‌రెడ్డి, కామారెడ్డి- ఎం.కె.ముజీబుద్దీన్‌, కరీంనగర్‌- రామకృష్ణారావు, రాజన్న సిరిసిల్ల- తోట ఆగయ్య, జగిత్యాల- విద్యాసాగర్‌రావు, పెద్దపల్లి- కోరుకంటి చందర్‌, మెదక్‌- పద్మాదేవేందర్‌రెడ్డి, సంగారెడ్డి- చింతా ప్రభాకర్‌, సిద్దిపేట- కొత్త ప్రభాకర్‌రెడ్డి, వరంగల్‌- ఆరూరి రమేశ్‌, హనుమకొండ- దాస్యం వినయ్‌భాస్కర్‌, జనగామ- సంపత్‌రెడ్డి, మహబూబాబాద్‌- మాలోతు కవిత, ములుగు- కుసుమ జగదీశ్‌, జయశంకర్‌ భూపాల్‌పల్లి- గండ్ర జ్యోతి, ఖమ్మం- తాతా మధుసూదన్‌, భద్రాద్రి కొత్తగూడెం- రేగా కాంతారావులను కేసీఆర్‌ నియమించారు. ఈ మేరకు తెరాస పార్టీ వారి పేర్లను వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని