CM KCR: చిరంజీవికి సీఎం కేసీఆర్‌ ఫోన్‌

అగ్ర కథానాయకుడు చిరంజీవికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేశారు. ఇటీవల చిరంజీవికి కరోనా సోకడంతో కేసీఆర్‌ ఫోన్‌లో

Updated : 27 Jan 2022 13:01 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేశారు. ఇటీవల చిరంజీవికి కరోనా సోకడంతో కేసీఆర్‌ ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

 తనకు కరోనా సోకినట్లు చిరంజీవి బుధవారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని