TS News: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర దంపతులకు కరోనా.. నిన్న మంత్రులతో పర్యటన

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన భార్య జ్యోతి కరోనా బారిన పడ్డారు. 

Updated : 19 Jan 2022 10:13 IST

భూపాలపల్లి: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన భార్య జ్యోతి కరోనా బారిన పడ్డారు. జ్వరం రావడంతో వీరు నిన్న రాత్రి కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ఎమ్మెల్యే దంపతులు నిన్న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లితో కలిసి పర్యటించారు. అనంతరం నిరంజన్‌రెడ్డితో పాటే గండ్ర హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని