Thagulla Gopal: పశువులు కాసి చదువుకొని..పేదరికాన్ని అక్షరబద్ధం చేసి
అది 2007 సంవత్సరం. ఎనిమిదో తరగతి చదువుతున్న రోజులు.. నాగార్జునసాగర్ వద్ద బీసీ హాస్టల్లో ఉన్నా. వాన పడుతోంది. ఆ సమయంలోనూ నా తల్లి ఒక పచ్చడి డబ్బా పట్టుకుని నాకోసం
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత తగుళ్ల గోపాల్
తల్లి ఎల్లమ్మతో గోపాల్
ఈనాడు, హైదరాబాద్ - న్యూస్టుడే, మాడ్గుల: అది 2007 సంవత్సరం. ఎనిమిదో తరగతి చదువుతున్న రోజులు.. నాగార్జునసాగర్ వద్ద బీసీ హాస్టల్లో ఉన్నా. వాన పడుతోంది. ఆ సమయంలోనూ నా తల్లి ఒక పచ్చడి డబ్బా పట్టుకుని నాకోసం వచ్చి హాస్టల్ ముందు నిల్చుని ఉంది. ఆ డబ్బాలోని పచ్చడి నుంచి నూనె కారుతుండటం నాకు ఇప్పటికీ గుర్తే..!
‘‘దారి తెల్వకున్నా..
ఎన్నో దూరాలు దాటి..
నూనె కారిపోతున్న చట్నీ డబ్బాతో..
మా హాస్టల్ ముందు నిలబడ్డ
దేవగన్నేరు పువ్వు.. అమ్మ!
- అమ్మ కష్టాన్ని, పరిస్థితిని అక్షరబద్ధం చేసిన క్రమం అద్భుతం.!
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి చెందిన తగుళ్ల గోపాల్.. ప్రస్తుతం నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం అజీలాపూర్లోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించి చదువు కొనసాగించారు. ఐదో తరగతి పూర్తయ్యాక కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చదువు మానేసి పశువులు కాయాల్సి వచ్చింది. గోపాల్ ప్రతిభను గమనించిన అదే గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు రాజవర్ధన్రెడ్డి ఎంతో ప్రోత్సాహం అందించారు. చదువు కొనసాగించాలని తల్లిదండ్రులను ఒప్పించారు. అలా ఉదయం, సాయంత్రం గొర్రెలు, ఆవులు కాస్తూ మధ్యలో పాఠశాలకు వెళ్లారు. కల్వకుర్తిలో ఇంటర్ పూర్తి చేశారు. ఆ సమయంలోనూ రాజవర్ధన్రెడ్డి చేయూత అందించారు. తర్వాత నేరెడ్మెట్లో డీఎడ్ పూర్తి చేశారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ తెలుగు పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారు.
కవితా ప్రయాణం.. అలా మొదలు..
టీటీసీ చేస్తున్నప్పుడు నగరంలోని త్యాగరాయగాన సభలో ఓ సదస్సుకు హాజరయ్యారు. అక్కడ నారాయణ శర్మ రాసిన అస్తిత్వ పుష్పాలు అనే పుస్తకం చదివారు. అప్పుడే నానీలు రాయడం ప్రారంభించారు. తర్వాత వచన కవిత్వం వైపు మళ్లారు. సమాజంలో అసమానతలు.. పేదరికం.. ఈ రెండూ ప్రాతిపదికగా పాఠకుడికి అర్థమయ్యే భాషలో కవిత్వం రాయడం ప్రారంభించారు. పేదరికాన్ని ఎత్తిచూపుతూ మానవ సంబంధాలు, విలువలను అక్షరబద్ధం చేసి సాధారణ పాఠకుడిలోనూ ఆలోచన రేకెత్తించడం గోపాల్ కవిత్వానికే సాధ్యం.
అక్క చనిపోవడం విషాదకర ఘటన
గోపాల్కు పదేళ్ల వయస్సు ఉన్నప్పుడు అక్క హంసమ్మ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ సంఘటన అతని జీవితంలో తీవ్ర దుఃఖాన్ని నింపింది. అందుకే ఆయన కవిత్వంలో అక్కపై ప్రత్యేకంగా వాక్యాలు రాశారు.
పిల్లలకు ఉచితంగా ట్యూషన్లు
చిన్నప్పుడు తాను పడిన కష్టాలు మరెవరూ అనుభవించ కూడదని గోపాల్ భావిస్తుంటారు. అందుకే ఎనిమిదేళ్లుగా ఊళ్లోని పిల్లలకు ఉచితంగా ట్యూషన్లు చెబుతున్నారు.
కవితలు.. పురస్కారాలు
అమ్మపోసిన గంజినీరుపై రాసిన ‘గంజి’, పశువులను కాసిన బాల్యపు స్మృతుల ‘ముల్లుపాఠం’, మహిళలపై అకృత్యాలపై ‘నా బంగారం కదూ’, కుల పట్టింపులపై ‘నొసటిపై గాయం’ కవితలు ఎంతో పేరు తెచ్చాయి. దండకడియం కవితా సంపుటికి 2019లో పాలమూరు సాహితీ పురస్కారం లభించింది. ఈ ఏడాది తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు.
దండకడియం వెనుక స్ఫూర్తి అదే
దండకడియం కవితా సంపుటిని తన తాత, ఆయనలాంటి ఎంతోమంది కష్టాలను గమనించి రాసినట్లు చెబుతున్నారు గోపాల్. గొర్రెల కాపర్ల వేదన, పేదల జీవితంలో ఎదుర్కొనే ఒడుదొడుకులను పొందుపరిచినట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా