విలవిల్లాడి.. ప్రాణం వీడె..!
అప్పటి దాకా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాడు. పండగ వేళ కోడి కోసే క్రమంలో చేతికి గాయం అయింది. దీంతో పరిచయం ఉన్న ఆర్ఎంపీ వద్దకు వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నాడు. భార్యతో కలిసి
భీమన్న
మంచిర్యాలనేరవిభాగం, న్యూస్టుడే: అప్పటి దాకా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాడు. పండగ వేళ కోడి కోసే క్రమంలో చేతికి గాయం అయింది. దీంతో పరిచయం ఉన్న ఆర్ఎంపీ వద్దకు వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నాడు. భార్యతో కలిసి సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ తిరిగి ఇంటికి బయలుదేరారు. మరో రెండు.. మూడు నిమిషాల్లో ఇంటికి చేరేవారు.. కానీ విధి ఏమనుకుందో.. పండగ పూట విషాద రాత రాసింది. పతంగి మాంజా రూపంలో ఆయన ఆయువు తీసిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కేసుకు సంబంధించి ఎస్సై తైసోద్దిన్ తెలిపిన ప్రకారం.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన భీమన్న(39) పదిహేను సంవత్సరాల క్రితం మంచిర్యాలకు వలస వచ్చాడు. కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భీమన్న శనివారం కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నాడు. ఇంట్లో కోడి కోస్తుండగా చేతికి కత్తి గాయం అయింది. కట్టుతో పాటు టీటీ ఇంజెక్షన్ వేసుకోవాలని భార్య శారదతో కలిసి మేదరివాడలోని ఆర్ఎంపీ వైద్యుడి వద్దకి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నాడు. తిరుగు ప్రయాణంలో స్థానిక రాళ్లవాగు వంతెన దాటే క్రమంలో.. రోడ్డుపక్కనే ముళ్లపొదలో చిక్కిన గాలిపటం చైనా మాంజా భీమన్న మెడకు చుట్టుకుంది. వాహన వేగం నెమ్మదిగా ఉన్నప్పటికీ మాంజా ఆయన మెడను చుట్టూ కోసుకుంటూ వెళ్లింది. పదడుగుల ముందుకు వెళ్లే సరికి మాంజా భీమన్న మెడను పూర్తిస్థాయిలో కోసింది. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న భీమన్నను భార్య శారదతో పాటు స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేపించే క్రమంలోనే తుదిశ్వాస విడిచాడు. భీమన్న భార్య శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తైసోద్దిన్ తెలిపారు.
గ్రామంలో విషాదఛాయలు
గుంజపడుగు(గొల్లపల్లి) : మంచిర్యాల జిల్లాలో చైనా మంజాతో శనివారం జరిగిన ప్రమాదంలో మండలంలోని గుంజపడుగుకు చెందిన భీమన్న(39) మృతి చెందడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. స్థానికులు తెలిసిన వివరాల ప్రకారం.. భీమన్న చిరు వ్యాపారం చేసుకోవడానికి పలు గ్రామాలు తిరుగుతుంటాడు. ఇలా జీవనోపాధి కోసం వీరి కుటుంబం మంచిర్యాలలో ఉంటోంది. శనివారం జరిగిన ప్రమాదంలో భీమన్న అకాల మరణంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. భీమన్న వేలికి గాయమవడంతో ప్రాథమిక చికిత్స చేయించడానికి డాక్టర్ వద్దకు వెళ్లామని, బయటకు వెళ్లకుంటే తన భర్త ప్రాణాలతో ఉండేవాడని బాధితుడి భార్య శారద రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఎవరి చేతికి?.. మల్లగుల్లాలు పడుతున్న అధిష్ఠానం
[ 29-03-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారుపై ఆ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.. ఇప్పటికే భారాస, భాజపాల అభ్యర్థులు ఖరారవగా.. హస్తం పార్టీ తరఫున బరిలో నిలిచేదెవరో తెలియకపోవడంతో కాంగ్రెస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు అభ్యర్థి తేలేదెప్పుడు.. అని ఆందోళన చెందుతున్నారు. -
కనుల పండువగా శివయ్య కల్యాణం
[ 29-03-2024]
ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో గురువారం శివ కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. -
ఆందోళన వద్దు.. అవకాశాలు కోకొల్లలు!
[ 29-03-2024]
విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ పదో తరగతి పూర్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు కూడా పూర్తి చేసి ఉన్నతవిద్య వైపు అడుగులు వేయనున్నారు. -
అవసరాల మేరకు ఏదీ అనుసంధానం!
[ 29-03-2024]
ఈ రెండు అంశాల్లోనే కాదు. ప్రయాణికుల అవసరాలు తీర్చడంలో ద.మ.రై.అధికారులు ఆది నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. రైల్వే ఉద్యోగుల అవసరాలు, అధికారులు, నాయకులు లాబీయింగులతోనే కొత్త హాల్టింగులు, ఇతర వసతులు కల్పిస్తున్నారు. -
కరీంనగర్ బస్స్టేషన్ ఆస్తి పన్ను రూ.1.88 కోట్లు చెల్లింపు
[ 29-03-2024]
ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం రాయితీ గడువు మూడు రోజుల్లో ముగుస్తుందని నగరపాలక కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ తెలిపారు. -
భార్య చేతిలో భర్త హతం
[ 29-03-2024]
భర్త మద్యానికి బానిసై శారీరకంగా.. మానసికంగా వేధిస్తున్నాడని వేదనకు గురైన ఓ భార్య తనకు తెలిసిన ఇద్దరి సహాయంతో తాళ్లతో కట్టేసి.. కళ్లలో కారం చల్లి... ఒంటిపై వేడి నీళ్లు పోసి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి మృతి చెందాడు. -
లోక్సభ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పరీక్ష
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
వేసవి గట్టెక్కేనా!
[ 29-03-2024]
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ పట్టణాలకు డబ్బాలోని గ్రిడ్ ద్వారా మిషన్ భగీరథ పథకం నీరు సరఫరా అవుతోంది. ధర్మపురి పట్టణానికి డబ్బా నుంచి పైపులైన్లు వేసినా చివరి ప్రాంతం కావడంతో నీరు సరఫరా సక్రమంగా కావడం లేదు. -
మట్టి గుట్టలు మాయం!
[ 29-03-2024]
మండలంలోని వరద కాలువ మట్టిని కొందరు గుత్తేదార్లు, స్తిరాస్థి వ్యాపారులు అక్రమంగా తరలించుకుపోతుండటంతో మట్టికట్టలు మాయమవుతున్నాయి. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-03-2024]
వ్యవసాయ శాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించింది. శాఖాపరంగా రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం. -
లక్ష్యానికి చేరువగా సింగరేణి
[ 29-03-2024]
సింగరేణి సంస్థ తొలిసారిగా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరువ అవుతోంది. మూడేళ్లుగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంస్థ ఇప్పటివరకు ఆ మేరకు బొగ్గు ఉత్పత్తిని చేరుకోలేకపోయింది. -
బయో మైనింగ్ ప్రక్రియకు అవాంతరాలు
[ 29-03-2024]
పెరుగుతున్న నగరీకరణ.. అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్గా మారుతోంది. ఈ క్రమంలో చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
భాజపా పాలనపై ప్రజల్లో విసుగు
[ 29-03-2024]
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని భారాస ఎంపీ అభ్యర్థులు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్, కొప్పుల ఈశ్వర్లు అన్నారు. -
మతం పేరిట కేసీఆర్ రాజకీయం చేయలేదు: కేటీఆర్
[ 29-03-2024]
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఏ రోజు కూడా మతం పేరిట రాజకీయం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
రాష్ట్రాన్ని దోచుకుంది భారాసనే: ఆది శ్రీనివాస్
[ 29-03-2024]
తెలంగాణ ఏర్పడిన తరవాత రూ.16 వేల కోట్ల నిల్వ బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పగిస్తే భారాస తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రాబంధుల్లా దోచుకుందని, రూ.6.67 లక్షల కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ