అన్యాయంపై అతివ అంకుశం!
రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం.. హైదరాబాద్కు వలస వెళ్లి జీవనం గడుపుతుండగా గతేడాది భర్త మృతి చెందాడు.. ఇళ్లలో పని చేస్తూ జీవనం గడుపుతున్న ఆమె భర్త పేరిట ఉన్న కొద్దిపాటి భూమిని విరాసత్ చేసుకోవాలనుకుంది.. కానీ అధికారి
అనిశా వలలో మరికల్ తహసీల్దార్
అదే అధికారి చేతుల మీదుగా విరాసత్ పట్టా అందుకున్న వైనం
న్యూస్టుడే, నారాయణపేట న్యూటౌన్, మరికల్
బాధితురాలు శ్రీశైల
రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం.. హైదరాబాద్కు వలస వెళ్లి జీవనం గడుపుతుండగా గతేడాది భర్త మృతి చెందాడు.. ఇళ్లలో పని చేస్తూ జీవనం గడుపుతున్న ఆమె భర్త పేరిట ఉన్న కొద్దిపాటి భూమిని విరాసత్ చేసుకోవాలనుకుంది.. కానీ అధికారి తీరు ఆశ్చర్యంగొలిపింది.. ఎవరూ లేనిదాన్ని దయచూడండి అన్నా కనికరం చూపని అతడిని క్షమించకూడదనుకుంది.. అవినీతి నిరోధకశాఖను ఆశ్రయించి తహసీల్దార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టిచ్చింది.. అనిశా తహసీల్దార్ను విచారణ చేయడమే కాకుండా అదే అధికారి చేతుల మీదుగా విరాసత్ పూర్తి చేయించి ఆ మహిళకు పట్టా అందించారు.. లంచాలు అడిగిన అధికారులపై ఫిర్యాదు చేస్తే పనులు కావేమోనన్న భయం వీడాలన్న సందేశం పంపారు..
మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం లాల్కోటకు చెందిన రాసాల సతీశ్ అలియాస్ సత్యనారాయణకు నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్దచింతకుంట శివారులో 1.07 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతేడాది ఏప్రిల్ 26న ఆయన మృతి చెందాడు. దీంతో ఆయన పేరున ఉన్న భూమిని తన పేరు మీద మార్చుకునేందుకు భార్య శ్రీశైల గతేడాది సెప్టెంబరులో ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకున్నారు. దస్త్రాలు పరిశీలించిన తహసీల్దారు శ్రీధర్ ఆధార్ కార్డులో ఆర్.సతీశ్ అని పట్టాదారు పాస్ పుస్తకంలో ఆర్.సత్యనారాయణ ఉందంటూ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని ఆమె తమ ఇంటి పక్కన ఉన్న రుక్ముద్దీన్ అనే వ్యక్తితో చెప్పుకొంది. ఆయన సహకారంతో తహసీల్దారు కార్యాలయంలో ఆర్వోఆర్, ఖాస్రా, పహాణీ తీసుకున్నారు. వీటన్నింటిని తహసీల్దారు ముందుంచి విరాసత్ చేయాల్సిందిగా కోరగా రూ.45 వేలు డిమాండ్ చేశారు. తన భర్త హమాలీ పని చేసేవాడని, తాను హైదరాబాద్లో ఇళ్లలో పని చేస్తూ జీవనం గడుపుతున్నానని దయ చూపమన్నా పట్టించుకోలేదు. రూ.25 వేలకు తక్కువైతే కుదరదని తహసీల్దారు తేల్చి చెప్పారు. దీంతో శ్రీశైల అనిశా అధికారులను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకుంది. అధికారులు తహసీల్దారుకు ఇచ్చేందుకు గాను రూ.20 వేలు నగదు ఇచ్చారు. ఆ డబ్బును రుక్ముద్దీన్, శ్రీశైల బుధవారం సాయంత్రం తహసీల్దారుకు ఇవ్వబోతుండగా కాపుకాసిన అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ కృష్ణగౌడ్, ఎస్సైలు లింగస్వామి, రామారావు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లోని శ్రీధర్ ఇంట్లో మరో బృందం తనిఖీ చేపట్టినట్లు డీఎస్పీ చెప్పారు. తహసీల్దార్ను విచారించి నాంపల్లి అనిశా కోర్టులో హాజరు పర్చనున్నట్లు డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు.
డబ్బులతో పట్టుబడిన తహసీల్దార్ శ్రీధర్
విరాసత్ పూర్తయింది
2018లో జరిగిన భూ సర్వే కార్యక్రమంలోనే గుర్తింపు కార్డుకు అనుగుణంగా పేరు మార్పిడి జరగాలి. ఈ విషయాన్ని రాసాల సతీష్ అలియాస్ సత్యనారాయణ తాను బతికున్న సమయంలోనే పెద్ద చింతకుంట రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తనకు సర్వే నంబరు 204-ఆ బీ2, 205-ఆ3 1.07 ఎకరాల భూమి ఉందని ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్కులో పేరు వేర్వేరుగా ఉన్నందున భవిష్యత్లో ఇబ్బందులు ఏర్పడుతాయేమోనని భయంగా ఉందని సరిచేయాలని విన్నవించినా పట్టించుకోలేదు. శ్రీశైల ఈ చిక్కుల నుంచి బయటపడేందుకు ఆర్వోఆర్, ఖాస్రా, పహాణీలు పొందేందుకు సైతం రెవెన్యూ సిబ్బంది రూ.2,500లు డిమాండ్ చేశారని తెలిపారు. తప్పని పరిస్థితుల్లో రూ.1500లు ఇచ్చుకున్నట్లు బాధితురాలికి సహకరించిన రుక్ముద్దీన్ వెల్లడించారు. పత్రాలున్నా మళ్లీ విరాసత్ కోసం రూ.45 వేలు తహసీల్దారు డిమాండ్ చేయడంతో ఓపిక నశించిన శ్రీశైల అనిశా అధికారులను ఆశ్రయించారు. పట్టుబడ్డ తహసీల్దారు చేతుల మీదుగానే శ్రీశైలకు అనిశా అధికారులు బుధవారం రాత్రి విరాసత్ చేయించారు. ఈ సంఘటన తెలిసి రెవెన్యూ కార్యాలయం ముందు జనం పెద్ద ఎత్తున గుమిగూడి రెవెన్యూ అధికారుల తీరును చర్చించుకుంటూ కనిపించారు. శ్రీశైల ధైర్యాన్ని కొనియాడారు. ఆమెకు అండగా నిలిచిన రుక్ముద్దీన్ను అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా వైకుంఠ నారాయణస్వామి రథోత్సవం
[ 23-04-2024]
పౌర్ణమిని పురస్కరించుకుని మండల కేంద్రమైన రాజోలిలో శ్రీ లక్ష్మీ వైకుంఠ నారాయణస్వామి రథోత్సవాన్ని మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. -
మామా అల్లుళ్లు.. నా సవాల్కు సిద్ధమా?: రేవంత్రెడ్డి
[ 23-04-2024]
భారాస హయాంలో పాలమూరుకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. దేశానికే ఆదర్శవంతమైన నాయకులను ఇచ్చిన గడ్డ పాలమూరు అని కొనియాడారు. -
వేసవి సెలవులు ఆరంభం
[ 23-04-2024]
జిల్లాలోని 461 ప్రభుత్వ పాఠశాలలు, 12 కస్తూర్భాలు, 145 ప్రైవేట్ పాఠశాలలకు విద్యా సంవత్సరం మంగళవారంతో ముగిసింది. -
యువత క్రీడల్లో రాణించాలి
[ 23-04-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత అన్ని క్రీడల్లో రాణించాలని జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. -
యువత క్రీడల్లో రాణించాలి
[ 23-04-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత అన్ని క్రీడల్లో రాణించాలని జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. -
భక్తి శ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
[ 23-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శ్రీలక్ష్మి వైకుంఠ నారాయణస్వామి ఆలయంలో మంగళవారం పౌర్ణమి పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి ... -
మగువలే నిర్ణేతలు
[ 23-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభా స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటముల్ని మహిళా ఓటర్లే ప్రభావితం చేయనున్నారు. -
సీఎం నేడు సుడిగాలి పర్యటన
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో మంగళవారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
జోరందుకున్న నామపత్రాల సమర్పణ
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు ముంచుకొస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల పత్రాల సమర్పణ జోరందుకుంటోంది. -
ఏం చేశారని భాజపాకు ఓటెయ్యాలి? : ఎంపీ
[ 23-04-2024]
రైతుల ధాన్యం కేంద్రం కొనుగోలు చేయని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని భాజపాకు ఎందుకు ఓటెయ్యాలని ఎంపీ, భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ప్రశ్నించారు. -
లోక్సభ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికను భాజపా నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కర్ణాటక రాష్ట్రం దక్షిణ బెలగావి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభయ్ పాటిల్ సూచించారు. -
ఆత్మీయ నేస్తం.. దారిచూపే దీపం
[ 23-04-2024]
పుస్తకం ఆత్మీయ నేస్తం. కారు చీకట్లో దారి చూపించే దీపం. మేధావులంతా ఏదో ఒక పుస్తకాన్ని చదివి ప్రభావితమైన వారే. -
మోదీతోనే దేశం బలోపేతం
[ 23-04-2024]
నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం ఆర్థికంగా బలోపేతమవుతుందని, భద్రతపరంగా సురక్షితంగా ఉంటుందని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
ఎన్నికల తర్వాత భారాస కనుమరుగు : ఎమ్మెల్యే
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికలయ్యాక భారాస కనుమరుగవుతుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. అడ్డాకులలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడ్డాకుల ఎంపీపీ నాగార్జునరెడ్డితో పాటు వివిధ గ్రామాల నాయకులకు ఎమ్మెల్యే -
కొనసాగుతున్న ప్రసాద్ పనులు
[ 23-04-2024]
నిర్మించి ఏడాదైనా కాకుండానే, ఇంకా పనులు కొనసాగుతుండగానే, నిర్మాణాలు పూర్తికాకుండానే ప్రసాద్ పథకం భవనంలోని మొదటి అంతస్తులో నిర్మించిన గదులకు పగుళ్ల రావడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. -
‘రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్’
[ 23-04-2024]
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఎంపీ రాములు విమర్శించారు. -
సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేయండి
[ 23-04-2024]
నాగర్కర్నూల్ సర్కిల్ సీఐ కార్యాలయం గతంలో పట్టణంలోని ఠాణా మొదటి అంతస్తులో ఉండటం వల్ల ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలకు ఐఎస్వో గుర్తింపు
[ 23-04-2024]
మహబూబ్నగర్లోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు ఐఎస్వో గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.ఎం.విజయ్కుమార్ తెలిపారు. -
అన్నదానం నిధుల రికవరీ
[ 23-04-2024]
ఉమామహేశ్వర క్షేత్రంలో పక్కదారి పట్టిన నిత్యాన్నదాన నిధులను రికవరీ చేసినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి శ్రీనివాస్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ