పేదల కోసమే రెండు పడక గదుల ఇళ్లు
ఇల్లు లేదని రాష్టంలో ఎవరూ బాధపడొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తున్నారని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మండలంలోని వడ్డెపల్లిలో ప్రభుత్వం నిర్మించిన 36 రెండు పడక
అడ్డాకుల : వడ్డేపల్లిలో ఇళ్లను ప్రారంభిస్తున్న మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎంపీ శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్రెడ్డి
అడ్డాకుల, న్యూస్టుడే : ఇల్లు లేదని రాష్టంలో ఎవరూ బాధపడొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తున్నారని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మండలంలోని వడ్డెపల్లిలో ప్రభుత్వం నిర్మించిన 36 రెండు పడక గదుల ఇళ్లను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాష్ట గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయిచంద్తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల వైఫల్యంతో వడ్డెరులకు సొంత ఇళ్లు దక్కలేదన్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చొరవతో రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి ప్రారంభించామన్నారు. అందరి సహకారంతో పాలమూరు జిల్లాను ఆదర్శంగా నిలుపుతామన్నారు. ఎన్ని అడ్డంకులెదురైనా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి తీరుతామన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. వడ్డెరల జీవితంలో మరిచిపోలేని బహుమతిని అందించిన తెరాసకు కృతజ్ఞతగా ఉండాలన్నారు. అనంతరం మసాపేట మండలంలోని జానంపేటలో నిర్మించిన 80 రెండు పడక గదుల ఇళ్లు, పాఠశాల అదనపు గదులను ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవర్, నాయకులు రాజశేఖర్రెడ్డి, ఇంద్రయ్యసాగర్, నాగార్జునరెడ్డి, కళావతమ్మ, శ్రీకాంత్, శ్రీనివాసులు, శామలమ్మ పాల్గొన్నారు.
యూట్యూబ్ ఛానళ్ల సంగతి తేలుస్తాం..
చిన్నచింతకుంట : యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకొని కేసీఆర్పై అవాకులు పేలుతున్న వారిని గమనిస్తున్నామని, రెణ్నెల్ల తరవాత సంగతి తేలుస్తామని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయిచంద్ హెచ్చరించారు. మండల కేంద్రంలో వంతెన కం చెక్డ్యాం పనుల ప్రారంభోత్సవానికి మంత్రితోపాటు హాజరైన ఆయన మాట్లాడారు. ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. ఎమ్మెల్యే వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలవి అర్థం లేని ఆరోపణలన్నారు. చెక్డ్యాంలు నిర్మిస్తున్నది ఇసుక తరలించడానికి అని ఓ మాజీ ఎమ్మెల్యే ఆరోపించడాన్ని ఎమ్మెల్యే ఖండించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు రూ.2.20 కోట్ల చెక్కులను మంత్రి అందించారు. సాట్స్ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు హర్షవర్ధన్రెడ్డి, రాజేశ్వరి, మోహన్గౌడ్, ఉషారాణి, కోట రాములు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.