కుమారుడి కిరాతకం
కన్న కొడుకే ఆ తల్లి పాలిట కాలయముడయ్యాడు. కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలం, మల్కపల్లి గ్రామానికి చెందిన కొండా రమేశ్, పాపమ్మ(45) దంపతులు. బతుకు దెరువుకు కొనేళ్లక్రితం నగరానికి వచ్చారు.
అర్ధరాత్రి వ్యాయామం వద్దన్నందుకు డంబెల్స్తో దాడి
తల్లి మృతి.. అడ్డొచ్చిన సోదరికి గాయాలు
పాపమ్మ, సుధీర్కుమార్
సుల్తాన్బజార్, న్యూస్టుడే: కన్న కొడుకే ఆ తల్లి పాలిట కాలయముడయ్యాడు. కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలం, మల్కపల్లి గ్రామానికి చెందిన కొండా రమేశ్, పాపమ్మ(45) దంపతులు. బతుకు దెరువుకు కొనేళ్లక్రితం నగరానికి వచ్చారు. అనారోగ్యంతో 8 ఏళ్ల క్రితం రమేశ్ మృతి చెందగా.. పాపమ్మ, కుమారుడు సుధీర్కుమార్(24), కూతురు (25) రెండేళ్లుగా రాంకోఠిలో ఉంటున్నారు. డిగ్రీ చదివిన సుధీర్కొంతకాలం ప్రైవేట్ ఉద్యోగం చేశాడు. మానసికస్థితి సరిగ్గా లేక ఏడాదిగా ఇంటివద్దే ఉంటున్న కుమారుడికి తల్లి చికిత్స చేయిస్తున్నారు. ఆదివారం రాత్రి ముగ్గురూ నిద్రకు ఉపక్రమించారు. సుధీర్ తెల్లవారు జాము 2 గంటల సమయంలో లేచి వ్యాయామం చేస్తుండగా, ఇప్పుడు చేయడమేంటని తల్లి వారించింది. విచక్షణ కోల్పోయిన సుధీర్ చేతిలోని డంబెల్స్తో తల్లి తలపై కొట్టాడు. పాపమ్మ అక్కడికక్కడే కుప్పకూలారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన సోదరిపై కూడా దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి యజమాని కారు అద్దాన్ని ధ్వంసం చేశాడు. సుచిత్ర కేకలతో ఇంటి యజమాని, చుట్టుపక్కల వారు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలికి చేరుకుని సుధీర్, గాయపడ్డ అతడి సోదరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నగర పోలీసు సంయుక్త కమిషనర్(తూర్పు మండలం) రమేశ్, సుల్తాన్బజార్ ఏసీపీ, ఇన్స్పెక్టర్ భిక్షపతి ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇన్స్పెక్టర్ భిక్షపతి పర్యవేక్షణలో ఎస్సై శ్రీకాంత్రెడ్డి ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం పాపమ్మ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. వైద్యుల సూచనలు, న్యాయమూర్తి (మెజిస్ట్రేట్) ఆదేశాలతో సుధీర్ను ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించినట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.