గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం
పీఏపల్లి మండల పరిధిలో ఏఎమ్మార్పీ అనుసంధాన కాల్వ ఇన్ఫాల్ రెగ్యులేటర్ వద్ద మంగళవారం గల్లంతైన ఇద్దరు గల్లంతవగా.. వారి మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి. కుటుంబానికి ఆసరగా నిలుస్తున్న
పెద్దఅడిశర్లపల్లి, న్యూస్టుడే: పీఏపల్లి మండల పరిధిలో ఏఎమ్మార్పీ అనుసంధాన కాల్వ ఇన్ఫాల్ రెగ్యులేటర్ వద్ద మంగళవారం గల్లంతైన ఇద్దరు గల్లంతవగా.. వారి మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి. కుటుంబానికి ఆసరగా నిలుస్తున్న కుమారులను ఈ విషాద ఘటన దూరం చేసి కన్నవారికి తీరని దుఃఖం మిగిల్చింది.
శ్మశానమే ఇల్లు.. చెత్త కుప్పలే బతుకుదెరువు
రెక్కాడితే కానీ పూట గడవని కుటుంబాలు వారివి. కనీసం తలదాచుకునేందుకు సొంత ఇల్లు కూడా లేకపోవడంతో శ్మశాన వాటికే వారికి నివాసమైంది. జీవనోపాధి లేక ఇల్లు గడవాలంటే ఊరూరు తిరిగి వీధులు, చెత్త కుప్పలపైనున్న వ్యర్థాలను సేకరించి సొమ్ము చేసుకుని పొట్టపోసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటారు. ఏ ఒక్కరోజూ చెత్తకుప్పలను ఆశ్రయించకపోతే ఆ రోజు పస్తులుండాల్సిన దుస్థితి వారిది. ఇంతటి దయనీయ పరిస్థితిలో బతుకుజీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్న వారి కుటుంబాలను కాల్వ రూపంలో విధి వెక్కిరించింది. నాంపల్లి మండలం నెమిళ్లగూడేనికి చెందిన కొండపల్లి సైదులు - ఎల్లమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. వీరిలో పెద్దకుమారుడు రాము(19) వీరి ఆటో నడుపుతూ తల్లిదండ్రుల సీసాలు ఏరుకునే వృత్తిలో సాయ పడుతుంటాడు. సైదులు బంధువు కప్పెర రమేష్కు ఇద్దరు భార్యలు కాగా.. పెద్ద భార్య ధనమ్మ కుమారుడు సిద్ధూ (12) సైతం తండ్రికి సాయంగా ఆటోలో వెళ్తూ చెత్తకుప్పలపై సీసాలు సేకరిస్తూ చేదోడువాదోడుగా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలోనే వీరు మంగళవారం అక్కంపల్లి జలాశయం సమీపంలోని ఇన్ఫాల్ రెగ్యులేటర్ పక్కన చెత్తకుప్పలో సీసాలు సేకరిస్తున్నారు. ప్రమాదవశాత్తు కాల్వలో రాము, సిద్ధూ గల్లంతయ్యారు. గుడిపల్లి పోలీసులు ఏఎమ్మార్పీ మోటార్లు నిలిపివేయించి బుధవారం మధ్యాహ్నం జాలరులతో తెప్పలపై గాలింపు చర్యలు చేపడుతుండగా అనుసంధాన కాల్వ చివర్లో ముందుగా సిద్ధూ, సాయంత్రం రాము మృతదేహాలు బయటపడ్డాయి. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం దేవరకొండ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.వీరబాబు తెలిపారు. చేతికందొచ్చిన కుమారులు విగత జీవులుగా మారడంతో బాధిత తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
ప్రభుత్వపరంగా ఆదుకుంటాం: ఎమ్మెల్యే
బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ హామీ ఇచ్చారు. బుధవారం ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, కొండమల్లేపల్లి సీఐ వై.రవీందర్, సర్పంచి గోర్ల సైదమ్మ, పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ ఎస్.శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్