వీరి చేతులు అద్భుతాలు చేస్తున్నాయ్..!
చిన్నప్పటి నుంచి కళల్లో ఉన్న నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పదునుపెడుతూ తాము ఎంచుకున్న రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. వారు గీసే చిత్రాలైనా, చేసే బొమ్మలైనా చూస్తే ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. తీక్షణంగా చూస్తే తప్ప అవి
అభిరుచితో గుర్తింపు పొందిన యువత
మామడ/నిర్మల్ పట్టణం, న్యూస్టుడే
చిన్నప్పటి నుంచి కళల్లో ఉన్న నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పదునుపెడుతూ తాము ఎంచుకున్న రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. వారు గీసే చిత్రాలైనా, చేసే బొమ్మలైనా చూస్తే ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. తీక్షణంగా చూస్తే తప్ప అవి రంగులద్దుకున్నవని గుర్తించరు. ఇలా తమ ప్రతిభతో అందరిచే ఔరా అనిపించుకుంటున్న యువతపై ‘న్యూస్టుడే’ కథనం.
రమణీయ గీత.. : రమణిత
నర్సాపూర్ (జి) మండలకేంద్రానికి చెందిన రమణిత అందరికీ సుపరిచితురాలవడానికి కారణం ఆమెలోని కళనే. బొమ్మలు గీయడం, జానపద పాటలు పాడటం, లఘుచిత్రాల్లో నటించడం, నృత్యం, పల్లె సన్నివేశాలను ప్రతిబింబించే కార్యక్రమాలతో రాణిస్తోంది. యూట్యూబ్లో ఆ యువతి ప్రతిభకు ఎంతో ఆదరణ లభిస్తోంది. పల్లెటూరిలో పుట్టి సొంతంగా కళకు పదునుపెట్టి దినదినాభివృద్ధి చెందుతోంది. పట్టుదలతో ముందుకెళ్తే ఏ రంగంలోనైనా, ఎవరైనా రాణించొచ్చని రుజువు చేస్తోంది.
చమక్కుమనేలా.. : చెర్రీ
ఖానాపూర్ పట్టణానికి చెందిన చెర్రీ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందాడు. చిన్నప్పటి నుంచి రంగులు, బొమ్మలపై ఉన్న ఆసక్తితో చిత్రలేఖనంలో మెలకువలు అభ్యసించి నైపుణ్యం సాధించాడు. అందమైన బొమ్మలు గీస్తూనే ఆకట్టుకునే నటనతో మెప్పించగలడు. ఇటీవల విడుదలైన అర్ధశతాబ్దం, అర్జున్ చక్రవర్తి సినిమాల్లో నటించి ప్రశంసలందుకున్నాడు. మంచి నృత్యకారుడిగానూ రాణిస్తున్నాడు.
మట్టితో బొమ్మలు.. బరికుంట అజయ్
నర్సాపూర్(జి)కి చెందిన బరికుంట అజయ్కు చిన్నప్పటి నుంచి బొమ్మల తయారీ అంటే మక్కువ. చూసిన ఏ వస్తువునైనా అచ్చుగుద్దినట్లు తయారుచేయడంలో దిట్ట. సొంతంగా నేర్చుకొని రాణిస్తున్నారు. ఏటా వినాయకచవితి, దుర్గ నవరాత్రుల సమయంలో గణపతి, అమ్మవారి విగ్రహాలను చక్కగా తీర్చిదిద్దుతాడు. పర్యావరణ పరిరక్షణతో పాటు మంచి కళను ప్రదర్శిస్తూ అందరిలో గుర్తింపు పొందారు.
ఆయన ప్రతిభ.. ‘నమ్మలేనంత’.. : అబ్దుల్ రాయబోస్
కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ రాయబోస్ ప్రతిభను మాటల్లో వర్ణించలేం. తమిళనాడులో బీఎఫ్ఏ పూర్తిచేశారు. ఆయన కుంచె నుంచి జాలువారిన చిత్రాలు నిజమైనవాటికి ఏమాత్రం తీసిపోవు. చాయ్- బిస్కట్, బ్రెడ్, మొక్కజొన్న కంకి, నాణేలు, కూరగాయలు.. తదితర వస్తువులు, పదార్థాల బొమ్మలను ప్రదర్శిస్తే అవి చిత్రాలని నమ్మడానికి సమయం పడుతుంది. ఇప్పటికే పలు ప్రదర్శనల్లో స్థానం పొందిన ఆయన చిత్రకళతో పలు పురస్కారాలు దక్కించుకోవడం విశేషం.
అచ్చుగుద్దినట్లుగా.. : సందేశ్
భైంసా మండలం పేండ్పెల్లి గ్రామానికి చెందిన సందేశ్ కర్ణాటకలో బీఎఫ్ఏ పూర్తిచేశాడు. చిన్నప్పటి కళకు అక్కడ మెరుగులద్దుకున్నాడు. ఎదురుగా ఉన్న మనిషిని చూస్తూ ఇట్టే ఆయన చిత్రాన్ని అచ్చుగుద్దినట్లుగా గీసేస్తాడు. ఇటీవల నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి బొమ్మను గీసి ఆయనకు అందజేశారు. ఊహించని కానుకను చూసి కలెక్టర్ కాసేపు మైమర్చిపోయారు. ఆ యువకుడిని ప్రత్యేకంగా అభినందించారు. చిత్రకళనే కాకుండా పురాతన వస్తువుల సేకరణలోనూ సందేశ్ ప్రత్యేకతను చాటుతున్నాడు.
సహజసిద్ధంగా.. : గుండోజు సంతోష్
ప్రకృతిలో కనువిందు చేసే ప్రతీ అంశాన్ని ప్రతిబింబించే చిత్ర విచిత్రాలకు సంతోష్ జీవం పోస్తాడు. నర్సాపూర్ (జి)కి చెందిన ఈ యువకుడు గీసిన చిత్రాలు, తయారుచేసిన బొమ్మలు మ్యూజియాన్ని తలపిస్తాయి. గాల్లో తేలియాడుతున్నట్లు, ఆకాశంలో వేలాడుతున్నట్లు భ్రమింపజేసేలా కళాకృతులను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాడు. సమకాలీన అంశాలను, సందేశాత్మక విషయాలను సందర్భానుసారం తన చిత్రాలతో జనాలకు చేరవేస్తుంటాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ-సేవ కేంద్రం సేవలు ప్రారంభం
[ 28-03-2024]
జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్లోని న్యాయస్థానాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ-సేవ కేంద్రం సేవలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. -
గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలి
[ 28-03-2024]
ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ 60 ప్రకారం రిమ్స్ కార్మికులకు వేతనాలు చెల్లించకుండా, ఈపీఎఫ్ వారి ఖాతాలో జమ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రిమ్స్ గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. -
వైభవంగా రమా సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
[ 28-03-2024]
కొత్త హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ రమా సత్యనారాయణ, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం 6వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. -
ఎంపీగా సుగుణక్కను గెలిపించుకుంటాం
[ 28-03-2024]
ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రకటించిన సుగుణక్కను పార్టీ కార్యకర్తలు అందరూ ఐక్యంగా కృషిచేసి గెలిపించుకుంటామని పార్టీ పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్ అన్నారు. -
శివాజీ విగ్రహ నిర్మాణానికి విరాళం
[ 28-03-2024]
తాంసీ మండల కేంద్రంలో హిందూ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి భాజపా జిల్లా నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి విరాళంగా అందజేశారు. -
విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు
[ 28-03-2024]
జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో గురువారం వరంగల్ మ్యాక్సీ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. -
ఆదిలాబాద్లో బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు
[ 28-03-2024]
ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు గురువారం ఉదయం న్యాయస్థానం ఆవరణలో ప్రారంభమయ్యాయి. -
లక్ష్యానికి మించి ‘ఉపాధి’ పనులు
[ 28-03-2024]
మండుటెండల్లో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సంవత్సరం బడ్జెట్్ ప్రణాళికలు మించి పనులు చేశారు. 2023-24లో మొత్తం 36.58 లక్షల పని దినాలు అంచనాతో ప్రణాళికలు రూపొందించారు. -
కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ..
[ 28-03-2024]
అనూహ్య మలుపులు తిరిగిన ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిత్వం ఎట్టకేలకు ఆత్రం సుగుణకే ఖరారైంది. ఉట్నూరుకు చెందిన టీచర్, మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న సుగుణ పేరును ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) ఆమోదించింది. -
‘పది’ మూల్యాంకనానికి ఏర్పాట్లు
[ 28-03-2024]
పదోతరగతి పరీక్షలు ఈనెల 30తో ముగియనున్నాయి. ఫలితాలు సకాలంలో విడుదల చేసేలా విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. పరీక్షపత్రాల మూల్యాంకనానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లాకు ఇతర జిల్లాల నుంచి పత్రాలు చేరాయి. -
గొంతు తడవదు.. గోస తీరదు
[ 28-03-2024]
ఆసిఫాబాద్ మండలం సుద్దాఘాట్ గ్రామానికి చెందిన ప్రజలు నిత్యం కిలోమీటరు దూరంలోని వాగు నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. పక్కనే చెలమ తీసి నీటిని పట్టుకెళ్తున్నారు. వాగు అవతల ఉన్న పదుల సంఖ్యల్లో గ్రామాలదీ ఇదే పరిస్థితి. -
నిప్పు.. నిర్లక్ష్యం చేస్తే పెను ముప్పు
[ 28-03-2024]
వేసవి వచ్చిందంటే సహజంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ప్రధానంగా అడవుల్లో కార్చిచ్చులు మొదలవుతాయి. అటవీప్రాంతంలో జరిగితే మనకొచ్చిన ఇబ్బందేంటని నిర్లక్ష్య వైఖరి చాలా మందిలో కనిపిస్తుంటుంది. -
10,489 మందికి ఎన్నికల విధులు
[ 28-03-2024]
లోకసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార యంత్రాంగం పోలింగ్ కోసం అంతా సిద్ధం చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో ప్రధాన భూమిక పోషించే ఉద్యోగ, ఉపాధ్యాయ సమాచార సేకరణ, కంప్యూటర్లో వారి వివరాల నిక్షిప్తం చేసే ప్రక్రియను పూర్తి చేశారు. -
అరచేతిలో అతివకు భద్రత
[ 28-03-2024]
ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినా అతివలపై జరుగుతున్న నేరాలు ఆగడం లేదు. ఇప్పటికే మహిళలు, యువతుల, విద్యార్థినుల భద్రతకు అనేక మొబైల్ యాప్లను ప్రవేశపెట్టిన తెలంగాణ పోలీసుశాఖ తాజాగా టీ-సేఫ్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. -
భానుడి భగభగ
[ 28-03-2024]
వేసవి ప్రారంభంలోనే సూర్యుడు నిప్పులు గక్కుతున్నాడు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన పది ప్రాంతాల్లో ఆరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో జైనథ్లో మధ్యాహ్న సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42.3 డిగ్రీలుగా నమోదు అయింది. -
పల్లెలు భళా.. పట్టణాల్లో డీలా
[ 28-03-2024]
స్థానిక సంస్థల అభివృద్ధికి ప్రధానమైన ఆర్థిక వనరులు ఆస్తి పన్నులే. ఆర్థిక సంఘం, ప్రత్యేకాభివృద్ధి నిధులతో పంచాయతీలు, పురపాలక సంఘాల్లో సీసీ రహదారులు, నీటి సరఫరా, విద్యుత్ దీపాల నిర్వహణ, మరమ్మతు పనులు చేపడుతున్నారు. -
ముదురుతున్న వివాదం!
[ 28-03-2024]
ప్రభుత్వస్థలం కబ్జాకు గురవుతోంది. అక్రమమార్గంలో పట్టాలు చేసుకుంటున్నారు. విచారణ జరపండి. బాధ్యులపై చర్యలు తీసుకోండి.. అంటూ ఏకంగా శాసనసభ్యుడు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. -
రోడ్లు నిర్మానుష్యం.. అవస్థల్లో జనం
[ 28-03-2024]
ఆదిలాబాద్లో రాష్ట్రంలోనే అత్యధికంగా బుధవారం 42.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో మూడ్రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. -
ప్రభుత్వ బడులకు ఉచిత వెలుగులు
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్తు ఛార్జీలు గుదిబండగా మారాయి. సర్కారు అందించే నిర్వహణ నిధులు సరిపోకపోవడంతో చాలా పాఠశాలల్లో విద్యుత్తు బిల్లులు పేరుకుపోయాయి. -
రెండు పడక గదుల ఇళ్లపై నీలినీడలు
[ 28-03-2024]
భారాస హయాంలో చేపట్టిన రెండు పడకల ఇళ్ల నిర్మాణాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మూడు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వీటి విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
హలో.. హలోకు అనుమతి
[ 28-03-2024]
మారుమూల గ్రామాల్లో సంకేతాల (సిగ్నల్స్) సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రత్యేకంగా సెల్టవర్లు మంజూరు చేసింది. స్థలసమస్య కారణంగా పలు పనులు నిలిచి పోయాయి. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
[ 28-03-2024]
పట్టణంలోని శివాజీచౌక్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న లక్ష్మణ్ (25) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు పట్టణ సీఐ అనిల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత