ఈ-మెయిల్ పట్టి.. రూ.లక్ష కొల్లగొట్టి
ఈ- మెయిల్ ఐడీని హ్యాక్ చేసి ఎస్బీఐ క్రెడిట్ కార్డులో ఉన్న రూ.లక్షతో సైబర్ నేరగాళ్లు వివిధరకాల వస్తువులు కొనుగోలు చేసిన ఘటన జన్నారంలో చోటుచేసుకుంది. జన్నారం మండల
క్రెడిట్కార్డుతో అంతర్జాలంలో వస్తువుల కొనుగోలు
జన్నారం, న్యూస్టుడే: ఈ- మెయిల్ ఐడీని హ్యాక్ చేసి ఎస్బీఐ క్రెడిట్ కార్డులో ఉన్న రూ.లక్షతో సైబర్ నేరగాళ్లు వివిధరకాల వస్తువులు కొనుగోలు చేసిన ఘటన జన్నారంలో చోటుచేసుకుంది. జన్నారం మండల కేంద్రంలో శుద్ధజల కేంద్రాన్ని నిర్వహిస్తున్న మామిడి రవి క్రెడిట్కార్డు నుంచి ఈ నెల 26న రాత్రి 1.30 గంటల ప్రాంతంలో అంతర్జాలం వేదికగా వ్యాపారం జరిగింది. రూ.33 వేల విలువైన ఏసీ, రూ.18 వేల వాషింగ్ మెషిన్, రూ.20 వేల టీవీ, ఇతర వస్తువులను కొనుగోలు చేశారు. ఫోన్ నంబర్తో పాటు అనుసంధానం చేసిన ఈ-మెయిల్కి ఓటీపీ రావడంతో సైబర్ నేరగాళ్ల పని సులువైంది. బాధితుడు ఉదయం క్రెడిట్కార్డు వివరాలు చూసుకొని రూ.ఒక లక్ష షాపింగ్ జరిగినట్లు నిర్ధారించుకొని లబోదిబోమన్నాడు. వెంటనే క్రెడిట్కార్డు వినియోగదారుల కేంద్రానికి ఫోన్ చేశాడు. స్పందించిన వారు అర్ధరాత్రి దాటిన తర్వాత వేలాది రూపాయల షాపింగ్ జరుగుతుండటంతో అనుమానం వచ్చి మీక్రెడిట్ కార్డు సేవలు తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు. వారి సూచన మేరకు సైబర్ క్రైం టోల్ ఫ్రీ నెం.155260కు ఫోన్ చేయడంతో అంతర్జాలంలో దరఖాస్తు ఫారం ఇచ్చారు. దానిని పూర్తి చేసి పంపగా.. అధికారులు కేసు నమోదు చేశారు. క్రెడిట్కార్డు సేవలు నిలిపివేయడంతో డబ్బులు తిరిగి వస్తాయని అధికారులు చెప్పినట్లు బాధితుడు పేర్కొన్నారు. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై పి.సతీష్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రీడా ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
[ 24-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పల్లెల్లో ప్లాట్లు.. కొన్నవారికి పాట్లు
[ 24-04-2024]
అనుమతులు లేని లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినా.. ‘రియల్’ దందా చేసే వ్యక్తులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పంచాయతీ అధికారుల లెక్కల ప్రకారం.. జిల్లాలోని 396 పంచాయతీల్లో అధికారులు గుర్తించిన లేఅవుట్లు 419 ఉండగా.. ఇందులో కేవలం ఎనిమిదింటికి మాత్రమే అనుమతులున్నాయి. -
ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు
[ 24-04-2024]
వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని మంచిర్యాల జిల్లా పాలనాధికారి బి.సంతోష్ పేర్కొన్నారు. -
25 నుంచి సార్వత్రిక పరీక్షలు..
[ 24-04-2024]
వివిధ కారణాలతో ఆగిపోయిన చదువును ముందుకు సాగించడానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఎంతగానో దోహద పడుతోంది. -
ఏడుసార్లు ఎంపీ.. రెండుసార్లు ఎమ్మెల్యే
[ 24-04-2024]
గుడిసెల వెంకటస్వామిగా, కాకాగా గుర్తింపు పొందిన గడ్డం వెంకటస్వామి తెలంగాణ నుంచి అత్యధికంగా ఏడుసార్లు ఎంపీగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి సుదీర్ఘకాలం చట్టసభలకు ఎన్నికైన నేతగా పేరు గడించారు. -
ఉక్కపోత.. చిన్నారుల వెత
[ 24-04-2024]
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల 43 డిగ్రీల సెల్సియస్కుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
రక్షణ తీగలే.. యమపాశాలు
[ 24-04-2024]
రేయింబవళ్లు కష్టపడి సాగుచేసిన పంటలు చేతికొచ్చే సమయంలో అడవి జంతువుల కారణంగా చేజారుతున్నాయి. -
తునికాకు సేకరణకు వేళాయె..
[ 24-04-2024]
ఈ ఏడాది తునికి ఆకు సేకరణకు అటవీశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇటీవల అకాల వర్షాలు కురవడంతో ఆకు నాణ్యత బాగా వస్తుందని అధికారులు భావిస్తున్నారు -
అక్రమ దందా.. అధికారుల అండ
[ 24-04-2024]
రాయితీ బియ్యం దందా చూడడానికి మామూలుగా అనిపిస్తుంది. దీనిపై లోతుగా తెలుసుకుంటే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
గొలుసుకట్టు.. అక్రమాలతో కనికట్టు
[ 24-04-2024]
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా పదేళ్ల కిందట ఓ జిల్లా అధికారి నేతృత్వంలో సాగిన గొలుసుకట్టు వ్యాపారంలో తవ్వినకొద్దీ మరిన్ని అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. -
ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు
[ 24-04-2024]
వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని మంచిర్యాల జిల్లా పాలనాధికారి బి.సంతోష్ పేర్కొన్నారు. మంగళవారం నస్పూర్లోని కలెక్టరేట్లో ఫీల్డ్ డైరెక్టర్ ఆఫ్ ఫారెస్ట్ ఎస్.శాంతారామ్, -
25 నుంచి సార్వత్రిక పరీక్షలు..
[ 24-04-2024]
వివిధ కారణాలతో ఆగిపోయిన చదువును ముందుకు సాగించడానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఎంతగానో దోహద పడుతోంది. సామాజిక, ఆర్థిక రంగాల్లో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల బాలలు పాఠశాల స్థాయిలో చదువును మానేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం