సమకాలీన పరిస్థితులపై అవగాహన ఉండాలి
సర్కారీ కొలువు సాధించాలంటే ప్రణాళికతో చదవాలని, తాజా పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండాలని 2018 ఎస్సై బ్యాచ్ శిక్షణ టాపర్ మాలోతు రమాదేవి తెలిపారు. జన్నారం ఎస్టీకాలనీకి చెందిన ఆమె
2018 ఎస్సై బ్యాచ్ శిక్షణ టాపర్ రమాదేవి
ఏన్కూరు, న్యూస్టుడే
సర్కారీ కొలువు సాధించాలంటే ప్రణాళికతో చదవాలని, తాజా పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండాలని 2018 ఎస్సై బ్యాచ్ శిక్షణ టాపర్ మాలోతు రమాదేవి తెలిపారు. జన్నారం ఎస్టీకాలనీకి చెందిన ఆమె ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా బయ్యారం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. పేద కుటుంబంలో పుట్టిన రమాదేవి గురుకులాలు, ప్రభుత్వ విద్యాలయాలను వేదికగా చేసుకుని స్వశక్తితో ఉద్యోగం సాధించారు. శిక్షణలోనూ 2018 బ్యాచ్లో ఇండోర్ టాపర్, ఆల్రౌండర్గా ముఖ్యమంత్రి పిస్టల్ను బహుమతిగా పొందారు. తాను సన్నద్ధమైన తీరు, అభ్యర్థులకు ఇచ్చే సూచనలు ఆమె మాటల్లోనే..
రెండు ఉద్యోగాలు సాధించా..
చిన్నతనం నుంచి సర్కారు కొలువే లక్ష్యంగా ఉన్న నేను కానిస్టేబుల్, ఎస్సై రెండు ఉద్యోగాలకు దరఖాస్తు చేశా. బీటెక్ చివరి సంవత్సరంలో ఉండగానే ఉద్యోగ ప్రకటన వెలువడింది. పోటీ పరీక్షలకూ కొంత సమయం కేటాయించా. బీటెక్ పరీక్షలు పూర్తయ్యాక రోజుకు 13 గంటలు కష్టపడ్టాను. ఉదయం శారీరక పరీక్షకు, మిగతా సమయం పుస్తకాలు చదివా. గుర్తింపు పొందిన పుస్తకాలను ఎంచుకుని చదివా. తొలుత కానిస్టేబుల్గా నియమితులయ్యా. శిక్షణకు వెళ్లిన కొద్ది రోజులకే ఎస్సై పరీక్ష ఫలితాల్లో కూడా అర్హత సాధించాను.
* ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు తొలుత దేశ, రాష్ట్ర తాజా పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండాలి. ఆర్థిక పరిస్థితులు, త్రివిధ దళాలు, కరోనాతో ఎగుమతులు, దిగుమతుల పరిస్థితులు? ఆర్థిక వ్యవస్థపై ప్రభావం? రష్యా- ఉక్రెయిన్ యుద్ధ కారణాలు, యుద్ధం తర్వాత పరిణామాలు.. ఇలా అన్ని అంశాల్లో పట్టు బిగించాలి.
* ప్రశ్నాపత్రంలో ఒక ప్రశ్నకు ఆప్షన్లలో ఒకటి నుంచి మూడు సమాధానాలు చాలా దగ్గరగా ఉంటాయి. అవగాహన ఉంటేనే సమాధానం ఇవ్వగలుగుతాం.
* పుస్తకాలు ఎంచుకోవడంతో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. మార్కెట్లో దొరికే వాటిల్లో నిపుణులు తయారు చేసిన వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి.
* మైదానంలో శారీరక దారుఢ్యంపై కూడా ఎక్కువ శ్రద్ధ చూపాలి. 2018లో మహిళా అభ్యర్థులకు 100 మీటర్లు మాత్రమే ఉంది. ప్రస్తుతం 800 మీటర్లు పరుగెత్తాలి.
‘‘ప్రస్తుత ఉద్యోగ ప్రకటన మంచి అవకాశంగా భావించాలి. సాధించాలనే పట్టుదలతోపాటు ప్రణాళికతో శ్రమిస్తే కచ్చితంగా విజయం సాధిస్తాం. కొలువు సాధించాక శిక్షణలోనూ కష్టపడ్ఢా మా బ్యాచ్లో ఇండోర్, ఆల్రౌండ్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించాను.’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏన్కూరులో హనుమాన్ శోభాయాత్ర
[ 23-04-2024]
ఏన్కూర్లో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల భక్తులు టీఎల్ పేట రామాలయానికి చేరుకొని అక్కడ నుంచి 10 కి.మీ శోభాయాత్రతో పాటు ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు. -
భాగ్యనగర్ తండాలో బోనాల వేడుక
[ 23-04-2024]
భాగ్యనగర్ తండాలో బోనాల వేడుకను మంగళవారం వైభవంగా నిర్వహించారు. -
పార్లమెంట్ ఎన్నికల్లో భారాస అత్యధిక స్థానాలు విజయం
[ 23-04-2024]
మహబూబాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత నామినేషన్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఇల్లందుకు చేరుకున్న పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారాస నాయకులు దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో స్వాగతం -
ఏది నిజం?.. సోషల్ మీడియాలో సమాచార వ్యాప్తిపై ఈసీఐ సూచనలివీ..
[ 23-04-2024]
ఎన్నికలోస్తే చాలు, సామాజిక మాధ్యమాల్లో కుప్పలుతెప్పలుగా సమాచారం వచ్చిపడుతుంది. వాటిల్లో పుకార్లు ఏవి? తప్పుదోవ పట్టించేవి ఏవి? నిజమైన సమాచారం ఏదో తెలియక ఓటర్లు తికమకపడుతుంటారు. -
బరిలో నిలవాలంటే.. పరిశీలన దశ దాటాల్సిందే!
[ 23-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ)కి అఫిడవిట్లు సమర్పించారు. -
ప్రాదేశిక ఎన్నికలకు రంగం సిద్ధం
[ 23-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి పంచాయతీరాజ్ కమిషనర్ సహా జిల్లా పరిషత్లకు సూచనలందాయి. -
రైతులకు అండగా ఉంటాం: నామా
[ 23-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరికి భారాస అండగా ఉంటుందని ఆపార్టీ ఖమ్మం లోక్సభ స్థానం అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
గ్యారంటీలు నమ్మి మోసపోకండి: తాండ్ర
[ 23-04-2024]
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నమ్మి ఓటర్లు మోసపోవద్దని, దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న భాజపాను ఆదరించాలని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు పేర్కొన్నారు. -
సెలవులొచ్చాయ్.. ప్రణాళికలు ఖరారయ్యాయ్!
[ 23-04-2024]
ఈవిద్యా సంవత్సరం నేడు (మంగళవారం) ముగియనుంది. పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వ బడుల బలోపేతంపై దృష్టి సారించింది. -
పది మందిలో ఐదుగురు స్థానికేతరులే..
[ 23-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా పది మంది గెలిచారు. వీరిలో ఐదుగురు స్థానికేతరులు కావటం విశేషం. -
అకాల వర్షంతో 700 ఎకరాల్లో పంట నష్టం
[ 23-04-2024]
జిల్లాలో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులతో కొత్తగూడెం, సుజాతనగర్, చుంచుపల్లి ,లక్ష్మీదేవిపల్లి, ఇల్లెందు, టేకులపల్లి, అశ్వారావుపేట, పినపాక, కరకగూడెం మండలాల్లో సుమారు 700 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు డీఏఓ బాబురావు సోమవారం తెలిపారు. -
‘పది’ విద్యార్థులు ఫలితాలపై ఒత్తిడి చెందొద్దు
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎలా ఉన్నా విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు గురికావొద్దని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.జేవీఎల్ శిరీష సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు