నిఘా కన్ను నేలచూపు
శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీసుశాఖ, ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటివరకు జిల్లాలో 2,890 సీసీ కెమెరాలు బిగించారు. నేను సైతంలో 2,045 ఏర్పాటు చేశారు. ఇందులో
బిగింపుతోనే సరి.. నిర్వహణ గాలికి
నిరుపయోగంగా వందలాది సీసీ కెమెరాలు
ఈనాడు డిజిటల్, కామారెడ్డి, న్యూస్టుడే, కామారెడ్డి అర్బన్: శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీసుశాఖ, ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటివరకు జిల్లాలో 2,890 సీసీ కెమెరాలు బిగించారు. నేను సైతంలో 2,045 ఏర్పాటు చేశారు. ఇందులో చాలావరకు ప్రస్తుతం పనిచేయడం లేదు.
నిధుల్లేవీ లేకపోవడంతో..
పోలీసుల చొరవతో సీసీ కెమెరాల బిగింపునకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. నిర్వహణకు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా వీటి కోసం ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులేవీ లేకపోవడం సమస్యగా ఉంది. పోలీసుశాఖ కొన్ని సమస్యాత్మాక ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధవహించి మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకొస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పాటు స్వచ్ఛంద సంస్థలు చేయూతనందిస్తేనే నిఘా కెమెరాలు వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది.
వాడుకలోకి తెచ్చేందుకు చర్యలు: శ్రీనివాస్రెడ్డి, ఎస్పీ, కామారెడ్డి
జిల్లావ్యాప్తంగా వినియోగంలో లేని సీసీ కెమెరాలను గుర్తిస్తున్నాం. ప్రజల భాగస్వామ్యంతో వాడుకలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ఇటీవల కాలంలో వీటి వల్లే చాలా కేసులు ఛేదించాం. నేరాల అదుపునకు ఎంతో దోహదపడుతున్నాయి. ప్రజలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
క్షేత్రస్థాయిలో ఉందిలా..
జిల్లా కేంద్రంలో మొత్తం 540 సీసీ కెమెరాలు బిగించగా వాటిలో 200 సక్రమంగా లేవు. నిత్యం ఏదో ఓ నేరం జరిగే కొత్తబస్టాండులో కొన్నాళ్లుగా పని చేయడం లేదు. ఆర్టీసీ అధికారులు మాత్రం తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. అశోక్నగర్ కాలనీలో రైల్వేగేట్ ప్రాంతంలో యువకులు రాత్రిపూట గొడవలు పడుతుంటారు. అక్కడున్న నిఘా కెమెరాలు మరమ్మతుకు నోచుకోక నేలచూపులు చూడాల్సి వస్తోంది. గొడవలు జరిగినప్పుడు పోలీసులు చేరుకునే సరికే ఎక్కడివారక్కడ పరారవుతున్నారు. రైల్వేస్టేషన్ ముందున్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల్లో పాత బస్టాండు వైపు కనిపించే నిఘా కన్ను నిదురోతోంది. స్టేషన్రోడ్ మీదుగా జిల్లా ఆసుపత్రి కేంద్ర పక్క నుంచి సుభాష్రోడ్ వైపు వెళ్లే దారిలో మూలమలుపు వద్ద అసలు సీసీ కెమెరాలే లేకపోవడం గమనార్హం.
* పిట్లం పోలీసుస్టేషన్ వెనుక బిగించిన సీసీ కెమెరాలు మరమ్మతులు లేక మరుగునపడ్డాయి.
* భిక్కనూరు మండల కేంద్రంలోని 21 కెమెరాల్లో ఒక్కటీ పనిచేయక చాలా రోజులవుతోంది. ఇదే మండలంలోని బస్వాపూర్లోనూ 10 ఉండగా అన్నీ నిరుపయోగంగా మారాయి.
* బాన్సువాడ సబ్ డివిజన్ పరిధిలో 916కు గాను 688 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. పట్టణ పరిస్థితిని పరిశీలిస్తే 115 కెమెరాలుండగా వాటిలో 80 మాత్రమే పనిచేస్తున్నాయి.
* ఎల్లారెడ్డిలో నూతనంగా కెమెరాల బిగింపునకు కార్యాచరణను సిద్ధం చేశారు.
* తాడ్వాయిలోని శబరిమాత ఆలయం దారిలో తరచూ రహదారి ప్రమాదాలు జరుగుతున్నా సీసీ కెమెరాల మరమ్మతులపై ధ్యాసే లేదు.
ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం.. ప్రతిచోట నిరంతరం నిఘా కొనసాగాలంటే వీటిని బిగించుకోవడమే శాశ్వత పరిష్కారం.. ఇవన్నీ పోలీసు అధికారులు తరచూ చెప్పే మాటలు. కెమెరాలు ఏర్పాటు చేస్తున్నా వాటి నిర్వహణ గాలికొదిలేయడంతో నిఘా నేలచూపులు చూస్తున్న వైనంపై ‘ఈనాడు’ పరిశీలన కథనం.
అక్కడ ఇలా..
‘‘ఆ గ్రామంలో సీసీ కెమెరాలున్నాయన్న ధీమాతో గ్రామస్థులు నిర్భయంగా తిరుగుతుంటారు. ఇంతలోనే ఓ మహిళ మెడలోంచి రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును దుండగులు తెంపుకెళ్లారు. పోలీసులు హడావుడిగా వచ్చి సీసీ ఫుటేజీ కోసం వెతికితే అవి పనిచేయడం లేదని తేలింది. దీంతో నెలన్నరగా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇదంతా జిల్లాలోని బీర్కూర్ మండలం చించోలి గ్రామంలో చోటు చేసుకుంది.’’
ఇక్కడ గంటలోనే..
‘‘జిల్లా కేంద్రంలోని రాంమందిర్ సమీపంలో ఈ నెల 17న తెల్లవారుజాము ప్రాంతంలో పులి రవి అనే యువకుడిని ఓ గుర్తుతెలియని వ్యక్తి హత్య చేశాడు. అక్కడ జరిగిందంతా సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. దాని ఆధారంగా నిందితుడు పాండును గంట వ్యవధిలోనే పట్టుకున్నారు. దీనికి ప్రధాన కారణం సంఘటనా స్థలంలో ఓ వ్యాపారి ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా ఫుటేజీ వల్లే.’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పురపాలక ఛైర్మన్పై అవిశ్వాసం
[ 24-04-2024]
ఎల్లారెడ్డి పురపాలక ఛైర్మన్ కుడుముల సత్యనారాయణపై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని భారాస పార్టీ కౌన్సిలర్లు తీర్మానించినట్లు తెలుస్తుంది. -
కాంగ్రెస్లో చేరిన పుర ఛైర్మన్
[ 24-04-2024]
పుర ఛైర్మన్ సత్యనారాయణ సంగారెడ్డిలో బుధవారం తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్లో చేరగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వారికి కాంగ్రెస్ కండువా వేసి పార్టీలో ఆహ్వానించారు. -
ఇందూరు నగరం.. కాషాయ వనం
[ 24-04-2024]
మనసంతా పవనసుతుని నామ జపం.. తనువంతా ఆధ్యాత్మికం.. అయోధ్య రాముడి బంటుగా.. సీతమ్మ జాడను అందించిన హనుమంతుడిపై ఇందూరు ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. -
ప్రణాళికతో సద్వినియోగం
[ 24-04-2024]
సెలవులు వచ్చాయంటే పిల్లలకు భలే సరదా.. చిందులు, సరదాలు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉరకలేసే సమయం. ఆనందం మాత్రమే చూసుకుంటే ఒక్కోసారి విషాదం, ఆందోళనకు దారి తీయొచ్చు. -
సాగర్లో పూడిక.. తొలగించాలిక
[ 24-04-2024]
ఉమ్మడి జిల్లా వరదాయిని నిజాంసాగర్లో పూడిక పేరుకుపోయింది. ప్రస్తుతం 17 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీరు లేదు. -
వరికే ప్రాధాన్యం
[ 24-04-2024]
రానున్న వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే వాతావరణ శాఖ సమాచారంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది సైతం సమృద్ధిగా వానలు పడితే జలాశయాలు నిండి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వొచ్చనే అంచనాలతో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. -
సంగ్రామానికి సమష్టిగా..
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు ఊపందుకొంది. అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార వేగాన్ని పెంచుతున్నారు. -
సమాచారం అరచేతిలో..
[ 24-04-2024]
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నూతన సంస్కరణలకు నాంది పలికింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటోంది. -
బాలాగౌడ్కు అత్యల్పం.. రాంగోపాల్రెడ్డికి అత్యధికం
[ 24-04-2024]
ఎన్నికల్లో ఒక్క ఓటు అనేది ఎంతో కీలకం. ఒక్క ఓటుతోనే ఫలితం తారుమారు కావచ్చు. చాలా మంది ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరూ ఎంపీలు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. -
పోలింగ్శాతంపై అభ్యర్థుల బెంగ
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఏప్రిల్లోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. -
ఐదో రోజు తొమ్మిది నామినేషన్లు
[ 24-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఐదో రోజైన మంగళవారం తొమ్మిది మంది నామినేషన్లు వేశారు. అశోక్గౌడ్(బహుజన్ లెఫ్ట్ పార్టీ), పోతు నవీన్(ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ), నాగార్జున్(ప్రజా సేన పార్టీ), ఎండీ.షాహెద్ ఖాన్(ఆలిండియా నేషనల్ పార్టీ), గోలి నరేష్(దళిత బహుజన పార్టీ), శక్తి ప్రసాద్, బీబీ నాయక్, మహ్మద్ జమీల్, సాయికృష్ణ(స్వతంత్ర) నామపత్రాలను రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతుకు అందజేశారు. -
ఓట్లు ఎక్కువ.. ప్రాతినిధ్యం తక్కువ
[ 24-04-2024]
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రాజకీయ రంగంలోకి వచ్చేసరికి సర్పంచి నుంచి జడ్పీ ఛైర్పర్సన్ వరకు ఇలా వివిధ పదవుల్లో రాణిస్తున్నారు. -
కార్యకర్తలపైనే ప్రచార బాధ్యతలు
[ 24-04-2024]
నామపత్రాల దాఖలు గడువు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొదటిసారి త్రిముఖపోరు నెలకొంది. -
పర్యవేక్షిస్తేనే ఆదాయం
[ 24-04-2024]
బల్దియాల నుంచి అనుమతులు పొందకుండానే ప్రధాన కూడళ్లతోపాటు ఆయా రోడ్ల పక్కన ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఈ దిశగా అడుగులు పడటంలేదు. -
200 మందికి ఉపాధి లక్ష్యం
[ 24-04-2024]
గ్రామాల్లో ఉపాధి పనుల జోరు పెంచాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి గ్రామ పంచాయతీలో 200 మంది కూలీల కంటే ఎక్కువగా హాజరు ఉండాలని పేర్కొంది. దీంతో జిల్లా యంత్రాంగం ఉపాధి కూలీల సంఖ్య పెరగడంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్