Property Tax: కొలతల కుర్చీ.. జలగలా పట్టీ!
ఆస్తి పన్ను వసూళ్ల దృష్ట్యా.. శేరిలింగంపల్లి జోన్ సంపన్నమైంది. నగరంలోని అన్ని జోన్లకన్నా అక్కడి నుంచే ఎక్కువ మొత్తంలో పన్ను వసూలవుతుంది. దాన్నే అవకాశంగా తీసుకుని కొందరు అవినీతి అధికారులు జీహెచ్ఎంసీకి చెందాల్సిన డబ్బును సొంత జేబుల్లోకి మళ్లించుకుంటున్నారు.
ఆస్తి పన్ను వసూళ్ల దృష్ట్యా.. శేరిలింగంపల్లి జోన్ సంపన్నమైంది. నగరంలోని అన్ని జోన్లకన్నా అక్కడి నుంచే ఎక్కువ మొత్తంలో పన్ను వసూలవుతుంది. దాన్నే అవకాశంగా తీసుకుని కొందరు అవినీతి అధికారులు జీహెచ్ఎంసీకి చెందాల్సిన డబ్బును సొంత జేబుల్లోకి మళ్లించుకుంటున్నారు. నగర వ్యాప్తంగా దాదాపు అన్ని జోన్లలో ఆస్తిపన్ను మదింపు, వసూళ్ల యంత్రాంగం అటు, ఇటు బదిలీ అవుతుంటుంది. శేరిలింగంపల్లి జోన్లో మాత్రం అలా జరగడం లేదు. ఎవరైనా బదిలీపైనో, పదోన్నతిపైనో అక్కడికి వెళ్లాల్సి వస్తే.. వాళ్లకు అవస్థలు తప్పడం లేదు. కుర్చీలన్నీ అవినీతి జలగల చేతిలో చిక్కి ఉండటమే అందుకు కారణం.
ఏడేళ్లుగా అవినీతి చక్రం.. కొత్తగా నిర్మించే అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్సులు శేరిలింగంపల్లి సర్కిల్లోనే ఎక్కువ. ఆస్తిపన్ను విభాగంలో ఓ అధికారి దాన్ని వసూళ్లకు అవకాశంగా మార్చుకున్నారు. 2016లో రాయదుర్గం, ఖాజాగూడ, గచ్చిబౌలి ప్రాంతాల బిల్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న ఆయన 2018లో ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి తీసుకున్నారు. సూపరింటెండెంట్గా 2020లో మరో పదోన్నతి వచ్చినా తన పరిధిని మాత్రం వదల్లేదు. సూపరింటెండెంట్గా పని చేయకుండా.. ఆస్తిపన్ను వసూళ్లతో ముడిపడిన సహాయ మున్సిపల్ కమిషనర్ హోదాలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నారు. అతడికి సర్కిల్ ఉన్నతాధికారి అండదండలు ఉండటంతో.. అధికారికంగా ఆ స్థానంలో కూర్చోవాల్సిన అధికారులు వివక్షకు గురవుతున్నారు. ఓ సహాయ మున్సిపల్ కమిషనర్.. కార్యాలయంలో కుర్చీ లేక బయట కూర్చుని వెళ్లిపోతున్నారు.
ఏళ్లుగా బదిలీల్లేవు
ఆస్తిపన్ను విభాగం అదనపు కమిషనర్ ప్రియాంకనే ప్రస్తుతం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏళ్లుగా అమలు కాని బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ల బదిలీల ప్రతిపాదనను ఆమె ఆమోదించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆస్తిపన్ను మదింపు సవ్యంగా జరిగితే.. గ్రేటర్లో అధికారికంగానే రూ.2,500 కోట్ల పన్ను వసూలవుతుందని అంచనా. ఇప్పటికీ నగరంలో వందలాది నిర్మాణాలు ఆస్తిపన్ను లేకుండా కొనసాగుతున్నాయి. కొన్ని రూ.1నుంచి రూ.10 చెల్లిస్తున్నాయి. అలాగని అవి పెంకుటిల్లు, రేకుల డబ్బాలు కాదు.. అందులో కొన్ని భారీ షెడ్లు, వ్యాపార సముదాయాలు ఉండటం గమనార్హం.
ఇదీ తీరు.. అందుకే కదలరు
నిర్మాణ అనుమతులిచ్చే ప్రణాళిక విభాగానికన్నా.. ఆస్తి పన్ను విభాగంలోనే అవినీతి ఎక్కువని నగర పౌరుల అంచనా. శేరిలింగంపల్లి సర్కిల్కు అనధికారిక ఏఎంసీగా కొనసాగుతున్న అధికారే అందుకు సాక్ష్యం. సదరు అధికారి తాజాగా బయోడైవర్సిటీ కూడలిలోని ఓ వాణిజ్య సముదాయానికి రూ.5లక్షల మేర వార్షిక పన్ను తక్కువగా వచ్చేలా చేశారు. ఖాజాగూడలో అపార్ట్మెంట్ల నుంచి భారీగా వసూలుచేశారు. అపార్ట్మెంట్లోని అందరు యజమానులు రూ.25వేల చొప్పున అతడికి ముడుపులు సమర్పించుకున్నారని, బదులుగా.. ఏడాదికి రూ.5వేలు పన్ను తక్కువగా వచ్చేలా కొలతలు తీసుకున్నారని విమర్శలున్నాయి. అడ్డదారిలో సంపాదించిన డబ్బుతో మెహిదీపట్నంలో, బండ్లగూడలో ఆస్తులు కొనుగోలు చేశాడని బాధితులు ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన ఆ ఇద్దరికీ బుద్ధి చెప్పాలి: కేటీఆర్
[ 23-04-2024]
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన రంజిత్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డికి బుద్ధి చెప్పాలని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
[ 23-04-2024]
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
అభిమానం పోటెత్తి.. చెయ్యెత్తి జైకొట్టి
[ 23-04-2024]
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభకు నాయకులు ఆశించిన జనం కంటే అధికంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. -
పొరుగు నేతలకే పెద్దపీట
[ 23-04-2024]
గత రెండు నెలల్లో భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున నేతలు చేరిపోయారు. దీంతో రాజధానిలో అనేక నియోజకవర్గాల్లో బలపడ్డామని నాయకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉండటంతో ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. -
కొండంత విశ్వాసం
[ 23-04-2024]
చేవెళ్ల ఎంపీ స్థానానికి భాజపా అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి సోమవారం భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.c -
4 ఎంపీ స్థానాలకు 37 నామపత్రాలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాలకు మొత్తం 37 మంది అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటికి ఆరుగురు.. ఎలా గురూ?
[ 23-04-2024]
రాజధానిలోని ఒక ఇంటి నంబరుపై గరిష్ఠంగా ఆరుగురు, కనిష్ఠంగా ముగ్గురు ఓటర్లున్నారు. చార్మినార్, బహదూర్పుర నియోజకవర్గాల్లో ఆరు మంది ఓటర్లుండగా, సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో ముగ్గురేసి ఉన్నారు. -
చరవాణి హ్యాక్ చేసి.. రూ. 40.74 లక్షలు స్వాహా
[ 23-04-2024]
మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి నగదు దోచేశారంటూ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన వ్యాపారి ఫోన్కు ‘మీ ఖాతా బ్లాక్ చేయబడింది’ అంటూ సందేశం వచ్చింది. -
15 స్ట్రాంగ్ రూముల్లో.. 5వేల ఈవీఎంలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికకు సంబంధించి ఈవీఎంలను సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ వెల్లడించారు. -
అప్పుడు 38.5.. ఇప్పుడు 43.3
[ 23-04-2024]
నగరంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 43.3 డిగ్రీలు నమోదైంది. -
ప్రతిదానికీ ఓ లెక్కుంది..!
[ 23-04-2024]
ఫలితాల వరకు ఈనాడు డిజిటల్, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
రూ.72 లక్షలు వడ్డీతో సహా చెల్లించండి
[ 23-04-2024]
నిర్మాణ ఒప్పందానికి సంబంధించి బ్యాంకు గ్యారంటీలు చెల్లించకుండా కాలయాపన చేసిన ఐసీఐసీఐ బ్యాంకుకు హైదరాబాద్ వాణిజ్య వివాదాల కోర్టు మొట్టికాయలు వేసింది. -
స్ట్రాంగ్ రూమ్లకు భారీ బందోబస్తు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలుగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఒక్కొక్కటీ పూర్తవుతున్నాయి. ఎన్నికలకు అవసరమైన సరంజామా ఆయా నియోజకవర్గాలకు చేర్చారు. -
గుడిలో ఆభరణాల చోరీ కేసులో ముగ్గురి రిమాండ్
[ 23-04-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డులోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడు సహా మరో ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రేవంత్రెడ్డికి పాలనా అనుభవం శూన్యం: పొన్నాల
[ 23-04-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పాలన అనుభవం శూన్యమని, అందుకే విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. -
సాంకేతిక ఉత్సవం.. విద్యార్థుల నైపుణ్యం
[ 23-04-2024]
జేఎన్టీయూ ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక నమూనాలతో సత్తాచాటారు. సోమవారం వర్సిటీలో రెండురోజుల సాంకేతిక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా వివిధ విభాగాల్లో విద్యార్థులు ఏర్పాటుచేసిన నమూనాలు వారిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటాయి. -
విమానాశ్రయంలో పార్కింగ్ చేసిన డీసీఎం దగ్ధం
[ 23-04-2024]
పార్కింగ్ చేసిన ఓ డీసీఎం అగ్నికి ఆహుతైన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం చోటు చేసుకుంది. అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. -
నీటి విక్రయం.. నాణ్యత ప్రశ్నార్థకం
[ 23-04-2024]
జిల్లాలో నాణ్యతలేని తాగు నీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమార్కులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. -
సీఎం సుడిగాలి పర్యటన నేడు
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో నేడు (మంగళవారం) సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
ప్రజలను మోసం చేసిన భాజపా, భారాస: కాంగ్రెస్
[ 23-04-2024]
మతతత్వ పార్టీలకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గొట్లపల్లి, తట్టేపల్లి గ్రామాలు కేంద్రాలుగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
తనిఖీలు శూన్యం.. సౌకర్యాలు కనం
[ 23-04-2024]
తాండూరు ప్రాంతం నాపరాయి ఇతర జిల్లాలు..పొరుగు రాష్ట్రాలు..విదేశాలకు ఎగుమతి అవుతోంది. అంతటి పేరున్న నాపరాయిని వెలికితీసేందుకు వేలాది మంది కార్మికులు శ్రమిస్తున్నారు. -
ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలు పాటించాలి
[ 23-04-2024]
జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలు తమ పరిమితికి మించి వైద్య సేవలు అందించకూడదని, ఒకవేళ అందిస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి పల్వన్కుమార్ సోమవారం హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ