Telangana News: జూబ్లీహిల్స్ అత్యాచారం.. A-1కు 3రోజుల కస్టడీ
జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసు నిందితుడు సాదుద్దీన్ను మూడు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసు నిందితుడు సాదుద్దీన్ను మూడు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సాదుద్దీన్ను.. రేపటినుంచి కస్టడీలోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించనున్నారు. కాగా బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో సాదుద్దీన్(18) ప్రధాన నిందితుడు(ఏ-1)గా ఉన్నాడు. మిగిలిన అయిదుగురూ మైనర్లు. మే 28న ఈ సంఘటన జరిగింది.
నిందితుల్లో మిగిలిన ఐదుగురు మైనర్లను కూడా కస్టడీలోకి తీసుకునేందుకు జువైనల్ జస్టిస్ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే దానికి సంబంధించిన విచారణ ఇంకా జరగాల్సి ఉంది. నాంపల్లి కోర్టులో సాదుద్ధీన్ను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులు కోరినప్పటికీ.. మూడు రోజులే కోర్టు అనుమతి ఇచ్చింది. కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ప్రాథమిక సమాచారం సేకరించారు. అయినప్పటికీ ప్రధాన నిందితుడు సాదుద్ధీన్ కాబట్టి.. ఇతను మైనర్లను ఏవిధంగా ప్రోత్సహించాడు? బాలికను ఎలా మభ్యపెట్టి వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లారు? తదితర విషయాలను క్షుణ్నంగా తెలుసుకోవటానికి కస్టడీకి తీసుకున్నారు. మరింత సమాచారం అతని నుంచి రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. కస్టడీ ముగిసిన అనంతరం నాలుగో రోజు ఉదయం 10 గంటలకు సాదుద్ధీన్ను పోలీసులు కోర్టులో హాజరుపరిచి తిరిగి రిమాండ్కు తరలించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్