Medak: వృద్ధురాలి సమస్య తీర్చడానికి నేరుగా ఆమె ఇంటికే వెళ్లిన జడ్జి
బాధితురాలి సమస్య తెలుసుకుని నేరుగా ఆమె ఇంటికి న్యాయమూర్తి వెళ్లిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. శివంపేట మండలం
మెదక్: బాధితురాలి సమస్య తెలుసుకుని నేరుగా ఆమె ఇంటికి న్యాయమూర్తి వెళ్లిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. శివంపేట మండలం శభాశ్పల్లికి చెందిన వృద్ధురాలు శివమ్మ.. పింఛన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి అనిత దృష్టికి వెళ్లింది. వెంటనే బాధితురాలి ఇంటికి జడ్జి వెళ్లారు. జిల్లా కలెక్టర్ హరీశ్కు ఫోన్ చేసి.. శివమ్మకు పింఛన్ మంజూరయ్యేలా చూడాలని కోరారు. బాధితురాలికి తగిన న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారానికి నేరుగా జడ్జి గ్రామానికి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
-
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా