Crime News: అశ్వారావుపేటలో కిలాడీ లేడీల హల్‌చల్

వారు లేడీలు కాదు కిలాడీలు. పట్టపగలే చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్

Published : 23 Sep 2021 21:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహిళలు పట్టపగలే చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఒకే రోజు ముగ్గురు మహిళల వద్ద చోరీ చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో చోటు చేసుకుంది. జెట్టి మంగమ్మ అనే మహిళ వినాయకపురం యూనియన్ బ్యాంకులో 30 వేల రూపాయలు జమ చేసేందుకు వెళ్లారు. మంగమ్మ క్యూలైన్లో నిల్చుని నగదు చెల్లించే లోపే ఆమె సంచిలోని డబ్బును కాజేశారు. సీసీ ఫుటేజ్లో చోరీ నమోదయ్యింది. ఆ మహిళల వెంట ఇద్దరు చిన్నారులు ఉండటం విశేషం. అదే రోజు ఊట్లపల్లికి  చెందిన ఒక మహిళ అశ్వారావుపేటలోని ఒక వడ్డీ వ్యాపారి వద్ద తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను విడిపించుకునేందుకు వెళ్లారు. ఇదే సమయంలో ముగ్గురు మహిళలు ఆమె వద్దకు వచ్చి మాటలు కలిపి యాభై వేలు చోరీ చేశారు . అంతేకాదు పక్కనే ఉన్న మరో మహిళ వద్ద కూడా పది వేలు కాజేశారు. ఈ మూడు ఘటనలో పట్టపగలే జరగటం గమనార్హం. అంతేకాదు మూడు చోరీలు చేసింది మహిళలే కావడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని